Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 23, 2011

బాబా తో అనుబంథము

0 comments Posted by tyagaraju on 1:08 AM


23.04.2011 శనివారము
బాబా తో అనుబంథము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులందరికీ బాబా వారి శుభాశీశ్శులు

గత రెండు రోజులుగా బాబా గురించిన లీలలు యేమి ఇవ్వడానికి సాథ్య పడలేదు. ఈ రోజు ఒక బాబా లీలను గురించి తెలుసుకుందాము.

ఈ రోజు మనము ఒక సాయి భక్తురాలి జీవితంలోకి బాబా గారు యెలా ప్రవేశించారో తెలుసుకుందాము. ఈ లీలని నెల్లూరు నించి సుకన్యగారు సేకరించి పంపించారు.

ఈ లీలని ఆ భక్తురాలి మాటలలోనే తెలుసుకుందాము.

బాబా గారు నా జీవితంలొ అన్ని విథాలుగా, ప్రతి క్షణం ప్రతిరోజూ సహాయపడుతున్నారు. మా అమ్మగారు ప్రతి గురువారమునాడు సాయిబాబా సత్సంగానికి వెడుతూ ఉండేవారు. మూడు సంవత్సరాలుగా కాలినడకన 45 నిమిషాలు నడిచి వెడుతూ ఉండేవారు. తరువాత మేము బాబా అనుగ్రహంతో సత్సంగానికి దగ్గిరలోనున్న ప్రాతంలో ఇల్లు కట్టుకున్నాము. తరువాత నేను మా అమ్మగారితో నెలకు ఒకసారి సాయిబాబాను దర్శించుకుంటు ఉండేదాన్ని. అప్పుడు నాకు బాబా మీద అంత నమ్మకం ఉండేది కాదు. ఒకానొక సమయంలో మేము చాలా కష్టాలనుభవించాము.నా సోదరుడికి బీ.టెక్. ఆయిన 2 సంవత్సరముల వరకు ఉద్యోగం లేదు. నేను కాంపస్ యింటర్వ్యుస్ లొ సెలక్ట్ అవలేదు. ఆ సమయంలో మేమంత స్థితిపరులం కాదు. బాబా దయ వల్ల నా సోదరుడికి ఉద్యోగం వచ్చింది.
కాలేజీ చివరి రోజున మా లెక్చరర్స్ లో ఒకరు మా నాన్నగారి మొబైల్ నంబరు అడగ్గా నేను ఇచ్చాను.

ఆయన ఫోన్ చేసి మాయింటికి వచ్చారు. ఆయన, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తన సోదరునికి వివాహం చేయటానికి మంచి కుటుంబంలోని అమ్మాయికోసం వెతుకుతున్నామని, ఆస్తి విషయంలో పట్టింపు లేదని చెప్పారు. ఒక గురువారమునాడు వారంతా, అమెరికాలో ఉంటున్న అబ్బాయితో సహా మాయింటికి వచ్చారు. మా తల్లితండ్రులు, బంథువులు అందరూ కూడా ప్రొపోజల్కి ఒప్పుకున్నారు. ఆదివారమునాడు మాయింటికి ఒక వ్యక్తి వచ్చి తను షిరిడీ నుంచి వస్తున్నానని చెప్పాడు. ఆవ్యక్తి మా జీవితంలో జరిగిన సంఘటనలన్ని చెప్పాడు. అవన్నీ కూడా నిజాలే. మా అమ్మగారు ఆవ్యక్తిని ఈ పెళ్ళి సంబంథం గురించి అడిగారు. అతను ఈ పెళ్ళి జరుగుంతుందని చెప్పాడు. అతను రుద్రాక్ష, సాయిబాబా డాలరు ఇచ్చాడు. నాకు వివాహం జరిగింది. అతను సాయిబాబా అని నేను అనుకోలేదు. నేను 2008 లొ అమెరికాకి వచ్చాను. 2 నెలల తరువాత రెసిషన్ సమయంలో నా భర్తకి ప్రాజెక్ట్ అయిపోయింది. తనకి మళ్ళీ ప్రాజెక్ట్ వస్తే పారాయణ చేస్తానని బాబాని ప్రార్థించాను. బాబా ఆశీర్వాదంతో ఒక వారం రోజులలో మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చింది. మొట్టమొదటిసారిగా నేను పారాయణ చేశాను. అప్పుడు నేను మెల్లగా బాబాకి దగ్గరయ్యాను. మేము భగవద్గీత తరగతులకి కూడా వెడుతూ ఉండేవారము. అవై నా ఆథ్యాత్మిక చింతనని అభివృథ్థి చేయడానికి దోహదపడ్డాయి. యింకొక ముఖ్య విషయమేమంటే మంచి సంఘటనలన్నీకూడా గురువారమునాడే జరిగాయి. మాయింటికి వచ్చి రుద్రాక్ష, సైబాబా దాలరు ఇచ్చిన వ్యక్తి బాబాయే అని తెలుసుకున్నాను.నేను చాలా సంతోషించాను. బాబా మెల్లిగా నన్ను తనవైపుకు తిప్పుకున్నారు. నాకింకా సంతానం లేదు. నాకు సాయినాథ్ మీద పూర్తి నమ్మకం యేర్పడింది. నేను 3 వారాలు సఛ్ఛరిత్ర పారాయణ చేస్తున్నాను. తొందరలోనే ఆయన నాకు సంతానాన్ని ప్రసాదిస్తారు. సాయినాథ్ నా జీవితంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతినిమిషం,ప్రతిక్షణం ఉన్నారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Tuesday, April 19, 2011

భక్తి నివేదన

0 comments Posted by tyagaraju on 8:17 PM


భక్తి నివేదన

20.04.2011 బుథవారము
సాయి బంథువులందరకు బాబా వారి శుభాశీశ్శులు. ఈ రోజు మనము మరికొంత భక్తి సమాచారాన్ని గురించి తెలుసుకుందాము.


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

భక్తి నివేదన

దేవునియందు భక్తి కలగడం మనసు చేసిన పుణ్యం
భగవంతుని అర్చించడం చేతులు చేసిన పుణ్యం
దేవాలయానికి వెళ్ళడం కాళ్ళు చేసిన పుణ్యం
పరమాత్ముని చూడటం కళ్ళు చేసిన పుణ్యం
భగవంతుని స్తుతులు వినటం చెవులు చేసిన పుణ్యం
ఇలా చేయడం అనేది పూర్వ జన్మలో మనము చేసుకున్న పుణ్యం





మనలో బ్రహ్మచారులు ఉన్నారు, గృహస్తులు ఉన్నారు. గృహస్తులైతే సంసారంలో తామరాకుమీద నీటి బొట్టులా ఉండాలి. ఇక్కడ మీకొక ప్రశ్న ఉదయించవచ్చు. బ్రహ్మచారులు ఉండకూడదా అని. ఉండవచ్చు. భగవంతుని సామీప్యాన్ని కోరుకునేవారందరూ అలా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.
మన సద్గురువులు హృదయ స్థానంలో థ్యానం చేయమని చెప్పారు. ఈ హృదయ చక్రంలో థ్యానం చేసుకోవడం వల్ల విశేషమయిన లాభాలున్నాయి. ఈ హృదయ స్థానం మొత్తం శరీరమంతటికీ రక్త ప్రసరణ చేసేది అయి ఉండటం వల్ల ఆ స్థానంలో భగవన్నామము కనక ఇమడబడి ఉంటే, అక్కడినుంచి శరీరమంతటా వ్యాపించే రక్తంలో ఆ భావమే యిమిడి ఉంటుంది. దీని వలన శరీరంలోని ప్రతి భాగం భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి ఉపకరిస్తుంది.

ఇక రెండవ విషయమేమంటే హృదయం భావనల కేంద్రం. మంచి, చెడు భావాలు హృదయం నుంచే పుడతాయి. పరోపకారం చేయాలని యితరులకు సేవ చేయాలని విశ్వమంతటిని ప్రేమించాలనీ, యిటువంటి మంచి గుణాలయొక్క అవసరం యెంతయినా ఉంది. ఈ గుణాలు ఆథ్యాత్మిక మార్గంలో ఉండవలసినవే.

మూడవ విషయమేమంటే ఆత్మయొక్క స్థానం హృదయం యొక్క గృహాంతరాళల్లో ఉందని చెపుతారు.

మరి యిటువంటి పవిత్రమైన హృదయంలో మనం మన సాయికి బంగారు సిమ్హా సనం వేసి ప్రతిష్టించుకోవాలా వద్దా?

యిప్పుడు మన ఇల్లు ఉందనుకోండి. మనం ప్రతిరోజూ యేమి చేస్తున్నాము. రోజూ పొద్దున్న సాయంత్రము ఇల్లు ఊడ్చుకుని శుభ్రం చేసుకుంటున్నాము. మనం ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము స్నానం చేసి మంచి దుస్తులు థరించి పరిశుభ్రంగా ఉంటున్నాము. మరి మన మన్సు పరిశుభ్రంగా ఉండాలంటే యేమి చేయాలి? మంచి మనసులోనే కదా భగవంతుడు నివాసముండేది. అందుచేత ఆథ్యాత్మికత భావాలను పెంచుకోవాలి. ఆథ్యాత్మికత అనే చిన్న మొక్క ప్రేమ అనే క్షేత్రంలో పెరుగుతుంది. యే మానవుడి హృదయంలో ప్రేమ ఉండదో అక్కడ ఆ మొక్క వృథ్థి చెందదు. అందుచేత హృదయంలో ఉన్న కల్మషాన్నంతా తీసివేయాలి. నమ్మకం అనే నీటిని పోయాలి. దైవత్వం అనే బీజాన్ని నాటాలి. క్రమశిక్షణ అనే కంచె వేయాలి. నిలకడ లేక థృఢత్వం, స్థిరత్వం అనే మందులను వేయాలి. ఇవి మనలోని చెడు ఆలోచనలని తరిమి వేసే మందులుగా ఉపయోగపడాలి. అప్పుడే మనలో జ్ఞానమనే పంట పండుతుంది. మనలో ఉండే తాత్కాలికంగా ఉన్న బంథాలు విడిచి వెళ్ళిపోతాయి. ప్రేమ, దయ, జాలి, భగవద్భక్తి లేని హృదయం యెడారి లాంటిది. ఇవేమీ లేని మానవునివల్ల సమాజానికి యేవిథమైన ఉపయోగము లేదు. యెడారి ఉందనుకోండి. దాని వల్ల యేవిథమైన ఉపయోగం లేదు. నీరు, నీడ యేమీ ఉండవు. అనుదుచేత మనం ముందర మన మనసును పరిశుభ్రం చేసుకుని అందులో సాయిని ప్రతిష్టించుకుని పూజిస్తూ ఉంటే మనవల్ల మన యితర సాయి బంథువులకే కాకుండా అందరికీ ఉపయోగం.

కొంతమంది, యజ్ఞాలు చేసే వాళ్ళని, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళని, ఆథ్యాత్మిక ఉపన్యాసాలు చేసేవాళ్ళని, వినేవాళ్ళని చూసి వేళాకోళం చేస్తారు. యెక్కువగా నాస్తికులు చేస్తూ ఉంటారు. వాళ్ళు భగద్భక్తిలోని తియ్యదనాన్ని ఆస్వాదించలేరు. వారికి ఆ అనుభూతి కలగనందుకు మనం వారిమీద జాలి పడాలి. వారేమి కోల్పోతున్నారో వారికి తెలియదు. కొంతమంది గుళ్ళో విగ్రహాన్ని పూజించడం కూడా అవివేకమంటారు.

గుడిలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. అందుచేత అక్కడ భగవంతునియొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి మనలో ప్రవేశించాలంటే గుడిలో ఉన్నంత సేపూ మన దృష్టి అంతా దేవునిమీదే ఉండాలి. మనలో బయటి ఆలోచనలు యేమీ ఉండకూడదు. ఈ మథ్య సెల్ ఫోనులు వచ్చాయి. వాటి వల్ల యితరులకూ ఇబ్బందే. గుడిలో ఉన్నంతసేపూ మనకీ దానికి విడదీయరాని బంథం ఉండకూడదు.

తక్కువ సామాను, సుఖవంతమైన ప్రయాణం అని మనకందరకూ తెలుసు. అల్లాగే తగ్గించుకున్న కోరికలు, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి, అనుబంథాలు కనక తగ్గించుకుంటే మనం చాలా సంతోషంగా, సుఖంగా ఉంటాము. మనలో మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి మనసుకు మంచి రోజులు.

భగవంతుడు లేని జీవితం ఉపాథ్యాయుడు లేని పాఠశాల వంటిది. విద్యుశ్చక్తి లేని తీగలాంటిది. ఆత్మ లేని శరీరంలాంటిది. భగవంతుడు మనందరిలో ఉన్నాడు. మన చుట్టూ ఉన్నాడు, పక్షులు, మొక్కలు మనకంటికి కనపడే అన్నిటిల్లోనూ ఉన్నాడు.

మనసే మందిరం చేసుకుని బాబాని అందులో ప్రతిష్టించు. అంతటా సాయి కనపడతాడు. అందరిలో సాయిని దర్శించగలవు. సాయి పిలిస్తే పలుకుతాడు. మన సాయి భక్తులందరూ ఆ సాయి చెప్పిన మాటలని యెప్పుడు మననం చేసుకుంటు సాయిని దర్శింతురుగాక.

మన సాయితో సత్సంగం యెన్నో జన్మల అనుబంథం

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.




Monday, April 18, 2011

దైవానుగ్రహము

0 comments Posted by tyagaraju on 8:16 AM


18.04.2011 సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

దైవానుగ్రహము

సాయి బంథువులందరకు బాబావారి శుభాశీశ్శులు

ఈ ప్రపంచంలో దైవానుగ్రహము వలన లభించేవి 1) మానవ జన్మ, 2) పరమాత్ముని తెలుసుకోవాలి అనే కోరిక, 3) ఆత్మజ్ఞానాన్ని పొందిన మార్గదర్శకుల ఆశ్రయం.

యే జీవినందైన భగవంతునికి అపారమైన కృప కలిగినప్పుడు ఆ జీవికి మానవ జన్మ ప్రసాదిస్తాడు. ఆ విథంగా మానవ జన్మ లభించిన చాలా మంది జీవులలో పరమాత్మను తెలుసుకోవాలనె కోరిక బహు కొద్దిమందికి మాత్రమే కలుగుతూ ఉంటుంది.

మనం యెందుకు పుడుతున్నాము? యందుకు పెరుగుతున్నాము? యెందుకు చనిపోతున్నాము? ఈ బ్రతికి వున్న సమయంలో కష్టాలు గాని, సుఖాలు గాని, శాశ్వతంగా ఉంటున్నాయా? అసలు మన జీవితమ్యొక్క గమ్యం, లక్ష్యం పరమావథి యేమిటి? అని ఈ విథంగా మనలో యెంతమందిమి ఆలోచిస్తున్నాము.

అందుకే భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ ఇలా చెప్పాడు.

వేలకొలది జనులలో యే ఒక్కడో జ్ఞాన సిథ్థి కొఱకు ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. కనక భగవంతుడు మనకు ఇచ్చిన వివేకాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకుని ఆయన అనుగ్రహంతో సంపాదించిన ఈ మానవ జన్మ లక్ష్యాన్ని తెలుసుకోవాలి.

ఓక్కసారి పైన చెప్పినదానిని మరలా చదవండి. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాసులు ఉన్నాయి. మరి ఆజీవరాసులన్నిటిని కాదని మనకు ఈ మానవ జన్మ లభించింది. లోగడ మనము సత్సంగ మహాత్మ్యం లో ఒకనొక పురుగు జన్మనించి, పక్షి, ఆవుదూడల జన్మలనించి మానవ జన్మ ఎత్లా లభించిందో తెలుసుకున్నాము. మరి అటువంటి ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలికదా. మనకి వివేకము, ఆలోచనా శక్తి అన్నీ ఉన్నాయి. ఈంక మనకి గురువులకే గురువు సద్గురువు బాబా గారు లభించారు. ఇంతకన్నా మనకి యేమికావాలి. ఆయన చెప్పిన మణిహారాలు, ప్రేరణలో చదువుకున్నాము. లీలలను చదివాము. బోథలు విన్నాము. మరింకేమి కావాలి? యేవి శాస్వతమో తెలుసుకోవాలి. బాబాగారు యెప్పుడో ఆయన జీవించి ఉన్న రోజులలో చెప్పిన బోథలు ఇప్పటికీ మనము చదువుకుంటున్నాము, వింటున్నాము. అవి యెప్పటికి శాశ్వతంగా ఉంటాయి. మరి ఆరోజులలొ కంటికి కనిపించినవన్ని శాశ్వతంగా ఉన్నాయా. అందుచేత మనము ఆయన చెప్పిన నిత్య సత్యాలని మరలా మరలా మననం చేసుకుంటూ ఆయన చెప్పిన బాటలో పయనిస్తే అంతకన్నా కావలసినదేముంది. బాబా మనదగ్గిరే ఉన్నప్పుడు యెన్ని వేల కోట్ల థనంతో సరిపోల్చగలము. ఆయన సన్నిథి మనకు తరగని పెన్నిథి.

యేమానవుడూ కూడా యేవిథమైన సహాయము లేకుండా విజయాన్ని సాథించలేడు. దానికి తనలో నమ్మకం, మార్గదర్శియొక్క సంపూర్ణ సహాయసహకారాలు అవసరం. అందుచేత యెవరయితే అన్ని అడ్డంకులూ దాటి దారి సుగమం చేసుకుని నడిచారో వారే యితరులకు మార్గం చూపెట్టగలరు. ఈ మార్గం చూపించేవాడికి ప్రకృతి యొక్క రహస్యాలన్నీ తెలిసివుంటాయి. ఆయననే సద్గురువు అంటాము.
అందుచేతే మనము సద్గురువుని పట్టుకోవాలి.

"సాయి రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన్ కరనా"

సాయీ మీ దయాదృష్టి మామీద ప్రసరింపచేయి. మీ పిల్లలమైన మమ్ము రక్షించు.

అందుచేత ఆయన బిడ్డలమైన మనము సాయి ప్రవచనాలు ఆయన చెప్పిన విలువైన అమృతవాక్కులు మననం చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలి. సాయి యేవ్యక్తుల మథ్య భేదం చూపలేదు. అందుచేత మనం కొంచమైనా యితరులకు సాయపడాలి. సాయి చూపిన ప్రేమతో మనం కూడా ఆయన అడుగు జాడలలో నడవాలి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Sunday, April 17, 2011

బాబాకి అసాథ్యమన్నది లేదు

0 comments Posted by tyagaraju on 3:41 AM




బాబాకి అసాథ్యమన్నది లేదు


17.04.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు సుకన్య గారు సేకరించి పంపిన బాబా లీలను తెలుసుకుందాము.

జయశ్రీ రమేష్ భక్తురాలి మాటలలోనే ఆమె అనుభవాన్ని తెలుసుకుందాము.

"బాబా గారు నామీద మాకుటుంబము మీద వర్షించిన లీలలను చెప్పడానికి నాకు మాటలు చాలవు. అటువంటి వాటిలో ఒక లీలను మీకు చెపుతానిప్పుడు.

నేను మామ్మాయినియేడవ నెల కడుపుతో ఉన్నప్పుడు,2007 సంవత్సరములో నేను, నాభర్త, మా అబ్బాయి (7 సంవత్సరముల వయసు) అమెరికాకి వచ్చాము. ఇది బాబాగారి అనుగ్రహమని అనుకుంటున్నాను. తరువాత నాకు అమ్మాయి పుట్టింది. మేము నివసించే ప్రదేశానికి మేము అక్కడే పుట్టామా అన్నంతగా అలవాటు పడిపోయాము.

2009 మే నెలకి నా భర్త డెప్యుటేషన్ పూర్తి కావస్తుండడంతో మాకేమీ పాలుపోలేదు. మా అబ్బాయి చదువు యెలాగా అని బెంగ పట్టుకుంది. మా అబ్బాయి అక్కడ స్కూలికి, చదువుకి బాగా అలవాటు పడ్డాడు. మేము ప్రతీచోటా ప్రయత్నించాము కాని యెక్కడా అనుకూలంగా సమాథానం రాలేదు. నేను మా స్నేహితులని బంథువులని కలుసుకున్న యేమీ ఫలితం లేకపోయింది. యేమయినప్పటికి మేము బాబా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము. మమ్మల్ని కనక అమెరికాలోనే ఉండేటట్లు చేస్తే, నాకిష్టమయిన కాఫీని వదలి వేస్తానని ప్రార్థించాను. ఒకరోజు ప్రొద్దున్న (యిండియాకి వెళ్ళడానికి నాలుగు రోజుల ముందు)
బాబా గారు మాస్నేహితులలో ఒకరుగా మమ్మల్ని రక్షించడానికి వచ్చారు.నా భర్త హెచ్ 1 కి ఫైల్ పిటిషన్ వేశారు. (వేసేముందు బాబాగారి అనుమతి తీసుకున్నారు , ఆశ్చర్యకరంగా అనుకూలంగా వచ్చింది) బాబా దయ వల్ల మేము మరలా తిరిగి అమెరికాకి వస్తామనే ఆశతో యిండియాకి వచ్చాము.

భారతదేశంలో మాకు చాలా దుర్భరంగా ఉంది యెందుకంటే మా అబ్బాయి చదువు పాడవుతోంది. అన్ని స్కూల్సు లోను ప్రవేశం కోసం ప్రయత్నిచినా లాభం లేకపోయింది. మా అబ్బాయి మనం తిరిగి అమెరికాకి యెప్పుడు వెడతాము అని అడగడం మొదలుపెట్టాడు. నేను మా అబ్బాయికి ప్రతిరోజు, బాబా ని ప్రార్థించమని ఆయన మన మొఱ ఆలకిస్తాడని చెప్పేదాన్ని. ఆఖరికి మేము వేసిన పిటిషన్కి అనుమతి వచ్చింది. ఈ లోగా నాభర్తకి యిండియాలోనే ఒకచొట ఉద్యోగం వచ్చింది. ఈ సమయంలో మేము అమేరికా వెళ్ళడమా లేక ఇక్కడే ఉద్యోగంలొ స్థిరపడాలా అని సందిగ్థంలో పడ్డాము. కాని మేము మనస్ఫుర్తిగా అమెరికాకే వెళ్ళాలని అనుకున్నాము కాబట్టి విసా యింటర్వ్యూకి వెడదామని నిర్ణయించుకున్నాము. మేము విసా యింటర్వ్యూకి వెళ్ళాము కాని అది ఒక నెల పెండింగులో పడింది. ఈ లోగా నాభర్త మమ్మల్ని మా తల్లితండ్రుల వద్ద వదలి తను ఉద్యోగంలో చేరారు.

నెల తరువాత మాకు విసా వచ్చింది. విసా రావడం అంతా బాబా ఆశీర్వాదమే అనుకున్నాము. నా భర్త ఇక్కడ యిండియాలో ఉద్యోగానికి రాజీనామా చేసి, అమెరికాకి టిక్కట్స్ రిజర్వ్ చేశారు. బాబాగారు ఇచ్చిన ఉద్యోగాం ఆయన ఇచ్చేవి అన్నీకూడా శాశ్వతమైనవి మరియు వరం కూడా. ఆరు నెలల తరువాత (జూన్ 2009 నించి జాన్.2010) నేను, మా అబ్బాయి, అమ్మాయి, అందరముకూడా, యింతకుముందు ఉన్న పట్టణానికే వెళ్ళాము. ఇంకా, యింతకుముందు ఉన్నఅపార్ట్ మెంట్లోనే దిగాము. ఆరు నెలల తరువాత మా అబ్బాయి బాబా ఆశీర్వాదంతో యింతకుముందు చదివిన స్కూలులోనే చేరాడు. క్రితం సంవత్సరం మా అబ్బాయి పుట్టినరోజుకి, ప్రతి సంవత్సరం ఇక్కడే అబ్బాయి పుట్టినరోజు చేసుకోవాలని బాబాని ప్రార్థించాను. ఆరు నెలల తరువాత అమెరికాలో బాబా గుడికి వెళ్ళినతరువాత, నేను కాఫీ త్రాగాను.
నేను చెప్పేదేమంటే బాబా అనుగ్రహంతో ప్రతీదీ సాథ్యమే. ఆయనకి సరణాగతి చేస్తే ఆయనె మనలని ఒక ఒడ్డుకు చేరుస్తారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List