19.06.2022 ఆదివారం
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 15వ, భాగమ్
అధ్యాయమ్
–12
సాయి
అనుభవ గాధ
1916
వ.సం.లో జరిగిన అనుభవం. ఆరోజుల్లో సాయిబాబా
షిరిడీలొ ఉన్నారు. మహారాష్ట్ర అంతటా సాయిబాబా
పేరు మారుమ్రోగుతూ ఉంది. ప్రతివారు సాయిబాబా
దర్శనార్ధం షిరిడికి వెడుతూ ఉండేవారు.
1916
వ.సం. మేము దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నాము. ఆ రోజుల్లో సంత్ జ్ణ్నానేశ్వర్, సంత్ తుకారాం ఇద్దరూ
ఆధ్యాత్మిక వాతావరణానికి పునాదులు వేసారు.
అమర్
భూపాలి రాగంతో రోజు ప్రారంభమయేది. ప్రతి ఉదయం
ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అటువంటి పవిత్ర వాతావరణం
నిండి ఉన్న రోజులలో మా తాతగారయిన కీ.శే. విష్ణుపంత్ పితలే గారు విలేపార్లేకి వచ్చి
ఒక చిన్న కుగ్రామంలో నివాసం ఏర్పరచుకున్నారు.
ఆయన లాండ్ రెవెన్యూలో తితలి గా ప్రభుత్వ ఉద్యోగి. అప్పట్లో ఆయన జీతం రూ.40/-.
