

06.08.2011/05.08.2011 శనివారము/శుక్రవారము
సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
రేపు శ్రీరంగపట్టనము దగ్గరున్న నిమిషాదేవి ఆలయ దర్శనార్థం వెడుతున్న కారణంగా రేపటి బాబా లీల ఈ రోజే ప్రచురిస్తున్నాను. వరుసక్రమం తప్పకుండా ఉంటుందనే ఉద్దేశ్యంతో.
ఈ సందర్భంగా నిమిషాదేవి ఆలయ చరిత్రను కొంచెం క్లుప్తంగా ఇస్తున్నాను. ఆలయం కూడా చిన్నదే.
నిమిషా దేవి ఆలయం
ఈ నిమిషా దేవి దేవాలయం శ్రీ రంగపట్టణానికి దగ్గరలో కావేరి నది ఒడ్డున ఉంది. మైసూరుకు దగ్గర శ్రీరంగపట్టణం. శ్రీరంగపట్టణం నించి ఆటోలో వెళ్ళి రావచ్చు. ఇక్కడ మనమేది కోరుకుంటే అది తీరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఈ నమ్మకానికి రెండు కథనాలున్నాయి.
1. కోరుకున్న కోరిక నెరవేరడం, కోరిక తీరే ప్రక్రియ నిమిషంలోనే ప్రారంభమవుతుంది.
2. రెండవ నమ్మకం నిమిషాదేవి దీవెనలు ప్రతీ నిమిషం అందుతూ ఉండటం.
అందుకనే ఇక్కడి దేవతకి నిమిషాదేవి అన్న పేరు.
రెండు కథనాలు కూడా "ఒక నిమిషం" అన్నదానికి బంథం. ఈ దేవాలయంలో శక్తివంతమైన శ్రీ చక్రం ఉంది. దీనిని మూకాంబికా దేవాలయం నించి కృష్ణరాజ వడయార్ మహారాజు, ఈ నిమిషాంబా ఆలయాన్ని నిర్మించేముందు తీసుకుని వచ్చారు.
కాని ఒక విషయం ఈ దేవాలయానికి వెళ్ళి కోరుకున్న వెంటనె యెప్పుడు తీరుతుందా అని మనసులో చింత పెట్టుకోకుండా, ఆవిడ అనుగ్రహాన్ని పొందడానికి సిథ్థంగా ఉండాలి.
యిక తార్ఖడ్ వారి బాబా అనుభావలలో మరొకటి.
బాబా గారు పెట్టిన బంగారు పరీక్ష
ఓం శ్రీ సాయినాథాయనమహ
ప్రియమైన సాయిభక్త పాఠకులారా ! యింతవరకు నేను చెప్పిన ఈ అనుభవాలన్ని కూడా మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. మన సాథారణ జీవిత చక్రం యెలా ఉంటుందంటే మొదట మనం సంసార జీవితానికి అల్లుకోవాలి, తరువాత మనకి తీపి, చేదు అనుభవాలు కలుగుతూ ఉంటాయి. వాటిని అనుభవించాక మనం చివరికి మనశ్శాంతి కోసం ఆథ్యాత్మికత వైపు ఆకర్షితులమువుతాము. కాని, ఈ చక్రం మా నాన్నగారి విషయంలో తిరగబడింది. ఆయన మొదట చాలా దివ్యానుభూతులని పొంది తరువాత కఠినతరమైన సంసార జీవితాన్ని గొడ్డలితో బాగా నలగగొట్టవలసి వచ్చింది. ఒక విషయం మాత్రం తేటతెల్లం, యెందుకంటే సాయిబాబా సాహచర్యంలో యెటువంటి పరిస్థితినైనా యెదుర్కొనే నేర్పుని పొందే అవకాశం వచ్చింది.
నేను కూదా నమ్మేదేమిటంటే భక్తి మార్గం యెటువంటిదంటే దానిని ఒకసారి సాథన మొదలు పెట్టాక జీవితంలొ యెటువంటి భయాన్నయినా యెదుర్కొనేందుకు చక్కగా సన్నథ్థమౌతాడు.
యిప్పటికి మా నాన్నగారు షిరిడీకి చాలా సార్లు వెళ్ళారు. ఆయన ఖాతాలో దివ్యానుభూతులను జమ చేసుకుని తగినంతలో థనవంతుడయారు. యిప్పుడు కొన్ని తిరకాసు క్షణాలను యెదుర్కొనే సమయం వచ్చింది. అప్పుడవి శీతాకాలపు రోజులు. పగటి రోజులు సమయం యెక్కువ, తాత్రి వేళ సమయాలు తక్కువగా ఉండేవి. అటువంటి ఒకరోజున సందె చీకటి వేళ ఆకాశంలో మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాలు కనపడుతున్నాయి. బాబా మా నాన్నగారిని తమతో కూడా రమ్మన్నారు. అది ఊహించని ఆహ్వానం. కారణం, బాబా అటువంటి సమయంలో ద్వారకామాయిని విడిచి యెప్పుడూ వెళ్ళరు. ఆయన "లెండీబాగ్" వైపు నడచుకుంటూ అక్కడినించి యింతకు ముందు అథ్యాయంలో వివరించిన వాగు ఒడ్డు వద్దకు వచ్చారు. అప్పటికి పూర్తిగా చీకటి పడింది. చంద్రుడు ఆకాశంలోకి పైకి వచ్చాడు. అప్పుడు బాబా మా నాన్నగారితో తాను ఆయనకి ఒక విచిత్రం చూపించబోతున్నానని ఆ కారణం చేతనే ఆయనను ఆ చోటువద్దకు తీసుకుని వచ్చానని చెప్పారు. యేమయినప్పటికి తాను కొంత వ్యక్తిగతమైన ప్రత్యేకమైన శ్రథ్థను పొందుతున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషించారు.
అప్పుడు వారి కింద కూర్చున్నారు. బాబా మెత్తగా ఉన్నమట్టిని తన చేతితో తొలగించడం మొదలు పెట్టారు. ఆయన మా నాన్నగారితో మట్టిలోకి చూసి యేమయినా కనపడుతోనదా అని అడిగారు. మా నాన్నగారు చూసి లేదని చెప్పారు. బాబా తిరిగి మరలా అదేపని చేశారు. మా నాన్నగారు రెండవసారి చూసి తనకు మట్టి మాత్రమే కనపడ్తోందని చెప్పారు. ఆపుడు బాబా మూడవసారి తిరిగి అదేపని చేసి, మా నాన్నగారి తల వెనుక తన చేతితో కొట్తి, ఆయనతో జాగ్రత్తగా చూడమని చెప్పారు. మా నాన్నగారు ఆ ప్రదేశంలో చూడగా అక్కడ మెరుస్తున్న లోహాన్ని చూశారు. వెన్నెల వెలుగులో అది యింకా మెరుస్తూ కనపడింది. బాబా మా నాన్నగారిని ఏమయినా కనపడుతోందా అని ఆదిగారు. ఒక లోహపు వస్తువు మెరుస్తూ కనపడుతోందని మా నాన్నగారు చెప్పారు. అప్పుడు బాబా "భావూ, ఆ లోహం బంగారం తప్ప మరేమీ కాదు. నీకు యెంతకావలిస్తే అంత తీసుకో" అన్నారు.

ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. షిరిడీ స్థానికుడొకడు వాగు ఒడ్డున జరిగినదంతా చూశాడు. సాయిబాబా మా నాన్నగారికి పాతిపెట్టబడిన నిథి యేదో చూపించి వుంటారని ఊహించాడు. బాగా రాత్రి పొద్దు పోయాక ఆ చోటకి వెళ్ళి ఆ నిథిని తవ్వి తీసుకుందామనుకున్నాడు. అనుకున్న విథంగా నిథి వేటకి సాహసం చేయడానికి అర్థరాత్రి లేచి వెళ్ళాడు. కాని, అయ్యో ! యెప్పుడయితే అతను గడ్డపారమీద చేతులు వేశాడొ, వెంటనే అతని వేళ్ళమీద తేలు కుట్టింది. అతను రాత్రంతా బాథపడుతూనే ఉన్నాడు. ఉదయమయేటప్పటికి బాథ భరింపరానంతగా ఉండటంతో తెలివిగా సాయిబాబా దగ్గరకెళ్ళి తన తప్పు ఒప్పుకుందామని నిశ్చయించుకున్నాడు. తను రాత్రి నిథి వేటకు వెళ్ళిన విషయం బాబాకి తప్ప మరెవరికీ తెలియపరచకూడదనుకున్నాదు. అతను ద్వారకామాయిలోకి ప్రవేశించినప్పుడు విపరీతమయిన బాథతో ఉన్నాడు. మా నాన్నగారు, ఆ స్థానికుడు బాబాని తన తప్పును మన్నించమని వేడుకుంటూ, యిక ఆ పాపం యెప్పుడూ చేయనని చెప్పడం చూశారు. తేలు కుట్టడం వల్ల కలిగిన భరింపరాని బాథ నుంచి విముక్త్ణ్ణి చేయమని అడిగా?డు. బాబా అప్పుడు "యెవరయినా తనకు దైవసంకల్పితంగా నిర్దేశించబడిన థనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే దాని అర్థం యెవరినైనా తీసుకోమని కాదు. ఈప్రపంచంలో భగవంతుడు యెవరి అదృష్టాన్ని బట్టి వారికది లభించేలా ఒక నియమాన్ని యేర్పరిచాడు. యెవరయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో అతను భగవంతుని చేత శిక్షింపబడతాడని" చెప్పారు. మా నాన్నగారికి ఆ సంభాషణ అర్థమయింది. బాబా తన పవిత్రమైన ఊదీని తేలు కుట్టిన అతని వేలిపైద్ వ్రాసి, భవిష్యత్తులో చెడుగా ప్రవర్తించవద్దని చెప్పారు. భగవంతుడు అతన్ని ఈ బాథనుండి తప్పిస్తాడని ఆశీర్వదించారు.
షిరిడీలో మా నాన్నగారికి పెట్టబడిన "బంగారు పరీక్ష" అదీ. నేననుకునేదేమంటే ఆయన యిటువంటి మాయకు యెర కాకుండా సఫలీకృతులయారని. కాని ఒక విషయం మటుకు ఖచ్చితం, యేమిటంటే తన భవిష్యత్తులో ఆయన థనాన్ని కూడబెట్టుకోలేకపోయారు. లక్ష్మీదేవి ఆయనవద్దకు వెళ్ళడం మానుకొంది. కాని ఆయన ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది. మనం ఆ చరిత్రలోకి వెళ్ళవద్దు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
