Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, July 31, 2011

గణేష్ విగ్రహాన్ని రక్షించిన సాయి

Posted by tyagaraju on 9:43 PM






01,08.2011 సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు

ఈ రోజు బాబా వారు గణేష్ విగ్రహాన్ని యెలా రక్షించారో తెలుసుకుందాము.



గణేష్ విగ్రహాన్ని రక్షించిన సాయి

ఓం సాయినాథాయనమహ

చందనపు మందిరంలో గణేష్ జీ చిన్న పాలరాతి విగ్రహం కూడా ఉంది. యిది ఒక అపూర్వమైన విగ్రహం. యెందుకంటే వినాయకుడి తొండం కుడివైపుకు తిరిగి ఉంది. విగ్రహం వెండి సిం హాసనంలో ఉంది. దానికి అది ప్రత్యేకంగా తయారుచేయబడింది. గణేష్ మూర్తి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుచేత పాఠకులందరికీ దానిని గురించి చెబుతాను. గణేష్ మూర్తి చాలా కాలం నించీ వుంది. దీనికి సంబంథించిన గొప్పతనమంతా బాబాకే చెందుతుంది.

మా తాతగారు బొంబాయి రీగల్ థియేటర్ దగ్గిర పురాతన వస్తువులు అమ్మే దుకాణానికి వెడుతూ ఉండేవారు. ఒక సారి అల్లా వెళ్ళినపుడు, షాపు యజమానితో ఒక ఆంగ్లేయుడు బేరమాడుతూ ఉండటం వినపడింది. ఒక ఆంగ్లేయుడు బేరమాడుతూ ఉండటంతో మా తాతగారికి కుతూహలం కలిగి, ఆసక్తిగా గమనించడం మొదలు పెట్టారు. ఆ బేరం అందమైన పాలరాతి గణేష్ విగ్రహం గురించి జరుగుతోంది. అది 9 అంగుళాల పొడవుతో పద్మంలో కూర్చుని ఉండి దానికి తగ్గ రకరకాల రంగులతో రంగు వేయబడి ఉంది.


షాపతను థర రూ.15/- చెప్పాడు. అది సోమనాథ్ మందిరం నించి వచ్చిన చాలా పురాతనమైనదని అందు చేతనే దానికి అంత థర న్యాయమైనదని చెప్పాడు. ఆంగ్లేయుడు దానికి రూ.5/- నుంచి రూ.8/- దాకా ఇవ్వడానికి సిథ్థమయాడు. మా తాతగారు ఆ బేరసారాలకి ఆకర్షితుడై, ఆ విగ్రహంతో యేమి చేయబోతున్నాడో కుతూహలంతో ఆగ్లేయుడిని అడిగాడు. ఆంగ్లేయుడు తానా పాలరాతి విగ్రహాన్ని తన బల్ల మీద పేపర్ వెయిట్ గా వాడుకోవడానికని చెప్పాడు. యిది వినేటప్పటికి మా తాతగారికి చాలా కోపం వచ్చింది. ఆయన తన పర్స్ నుంచి రూ.80/- తీసి షాపతనికిచ్చారు. ఆయన అతనితో రూ.80/- తీసుకొమ్మని ( ఆంగ్లేయుడు ఇస్తానన్నదానికి 80 రెట్లు) ఆ విగ్రహాన్ని తనకు పాక్ చేయమని చెప్పారు. తన దేవుడిని మరెవ్వరూ కూడా పేపర్ వెయిట్ గా ఉపయోగించనివ్వనని వెల్లడించారు. యింకా అడిగిన మీదట ఆ విగ్రహం సోమనాథ్ మందిర ప్రథాన ద్వారం దగ్గర వుండేదని అందుచేతనే అది చాలా పురాతనమైనదని షాపు యజమానినుంచి తెలుసుకున్నారు.


యింటికి వెళ్ళగానే చందనపు మందిరంలో ఉంచి సాయి పూజతో పాటు దానిని కూడా పూజిస్తానని చెప్పారు. యేమయినప్పటికి పేపర్ వెయిట్ గా ఉపయోగించేకంటే అదే చాలా మంచిదనుకున్నారు. కుటుంబంలోని వారంతా ఆయన చెప్పిన సూచనకి అంగీకరించారు. పాకెట్ విప్పగానే మా నానమ్మగారు విగ్రహం యొక్క తొండం కుడివైపుకుతి రిగి ఉందని, యిటువంటి లార్డ్ గణేష్ (సిథ్థివినాయక) సాథారణంగా యింట్లో పూజ కోసం ఉంచుకోకూడదని, యెందుకంటే యింటిలో ఆచార వ్యవహారాలు చాలా ఖచ్చితంగా పాటించాలని తెలుసుకున్నారు. అప్పుడు వారు పూజారిగారిని సంప్రదించగా ఆయన ఒక షరతు ప్రకారమైతే విగ్రహాన్ని పూజించవచ్చు, అదేమిటంటే ప్రతి గణేష్ చతుర్థినాడు దానికి మరలా రంగు వేసి, దానిని నిమజ్జనం చేయకూడదని చెప్పారు. అటువంటి పరిష్కారం సూచించినందుకు తార్ఖడ్ కుటుంబమంతా సంతోషించి, రాబోయే గణేష్ చతుర్థికి విగ్రహానికి వెండి సిం హాసనం తెచ్చి శాస్త్రోక్తంగా దానిని చందనపు మందిరంలో ప్రతిష్టించారు. అప్పటినించి ప్రతి హార్తాలిక కి (గణేష్ చతుర్థికి) ఒక రోజు ముందు మానాన్నగారు విగ్రహానికి టర్పంటైన్ తో పాత రంగుని తొలగించేవారు. తరువాత దానికి పరిమళపు నీటితో (సెంటెడ్ వాటర్) స్నానం చేయించేవారు. మాలో ప్రతి ఒక్కరం కూడా అందులో పాల్గొని దానికి మరలా రంగులు వేసేవాళ్ళము. గణేష్ చతుర్థినాడు, దానిని మరలా వెండి సిం హాసనంలో ప్రతిష్టించేవారు. మేమంతా కలిసి పూజ చేసేవారము. నా చిన్నపుడు నా స్కూలు స్నేహితులు నన్ను మీరు గణపతిని తెచ్చుకున్నారా అని అడుగుతూ ఉండటం నాకు గుర్తు. గణపతి మా యింటిలో శాశ్వతంగా ఉన్నాడని చెబుతూ ఉండేవాడిని. అప్పుడు వారు నన్ను అర్థం చేసుకోలేకపోయేవారు.


అందుచేత తార్ఖడ్ వారంతా ప్రార్థనాసమాజ్ నించి విగ్రహారాథకులుగా మారిపోయారు.

మా యింటిలో ఉన్న ఈ గణేష్ విగ్రహానికి మా నానమ్మగారు ఒకసారి యాసిడ్ టెస్ట్ చేసారు. మా తాతగారికి టెక్స్ టైల్ యిండస్ట్రీలో మంచి పేరుంది. ఆయనకి బరోడా మహరాజావారి నుంచి తమ రాష్ట్రంలో టెక్స్ టైల్ మిల్ స్థాపించే బాథ్యత యివ్వబడింది. అందుచేత వారు బరోడాకి నివాసం మార్చారు. వారికి నది ఒడ్డున ఒక బంగళా వసతి కోసం యిచ్చారు. ఒకసారి వర్షాకాలంలో రాత్రంతా పెద్ద వర్షం కురిసింది. పొద్దున్నకి వారి బంగళా నీటితో నిండి ఉంది. యిది వారికొక కొత్త అనుభవం. గంట గంటకి నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో మా నానమ్మగారు భయపడ్డారు. ఆఖరి మెట్టు తప్ప బంగళా మెట్లన్ని నీటిలో మునిగి పోయిఉన్నాయి. మా నానమ్మగారు అప్పుడు మట్టం సరిగానున్న రాగి పాత్రను తెచ్చి ఆఖరి మెట్టుమీద పెట్టారు. అప్పుడామె వెండి సిం హా సనం నుంచి "విఘ్నహర్త" ని పైకి తీసి రాగి పాత్రలో ఉంచి, విగ్రహం కనక నీటిలో మునిగిపోతే, అదే నీటిలో లార్డ్ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుతానని చెప్పేశారు. అటువంటి ప్రమాదకర పరిస్ఠితినుంచి లార్డ్ తమని రక్షిస్తారనే ధృఢమయిన అబిప్రాయం కావచ్చు ఆవిడది.

బాగా భక్తి భావం ఉన్న ధృఢమయిన భక్తులు మాత్రమే అటువంటి సాహసం, అటువంటి సాహసోపేతమైన చర్యలు చేయగలరు అని నేననుకుంటున్నాను. దేవుడు కూడా అలాంటివారిని యిష్టపడే అవకాశం కూడా ఉంది. నీటిమట్టం యింకా పెరిగి రాగిపాత్రని తాకి, యిక పెరగడం ఆగిపోయింది. 3, 4 గంటల తరువాత నీటిమట్టం తగ్గిపోవడంతో అంతా సంతోషించారు. వారు కోరుకున్న ప్రకారం వారి "విఘ్నర్త" వారిని రక్షించాడు. ఆ సంవత్సరం వారు గణేష్ చతుర్థిని ఒకటిన్నర రోజులకు బదులు అయిదు రోజులు జరుపుకున్నారు.

గణేష్ మూర్తి గురించి మరియొక సంఘటనని వివరించడానికి యింకా కొనసాగిస్తాను.

ఈ సంఘటన ఈ అథ్యాయానికి పెట్టిన పేరుకు కొంత సార్థకత చేకూరుస్తుంది. ఒక హత్రాలికా రోజున మా నానమ్మగారు కాల థర్మం చెదారు. (అనుకోకుండా). ఒక హత్రాలికా రోజున పాత రంగు తీసివేస్తున్నపుడు విగ్రహం యొక్క కుడి చేయి మోచేయి నుండి పట్టు తొలగింది. మా నాన్నగారు చాలా భక్తిపరులు. హిందూ సిథ్థాంతము ప్రకారం పాడయిన విగ్రహాన్ని పూజించరాదని. యేమయినప్పటికి అది యిప్పుడు కుటుంబంలో భాగమయిపోయింది. వారు దానిని వదలుకోవడానికిష్టపడలేదు. వారు పండగలు జరుపుకోవాలని నిర్ణయించుకుని అప్పుడు సాయిబాబా సలహా తీసుకుందామనుకున్నారు. ఆ విథింగా వారు షిరిడీకి బయలుదేరారు. ప్రియ పాఠకులారా అది వారి తప్పు చేస్తున్నట్లు కాదూ? వారెప్పుడు బాబాని లార్డ్ గణేష్ వ్యవహారాల్లో పాల్గొనేలా చేయలేదు. యిపుడు కష్టం వచ్చేటప్పటికి ఆయన సహాయం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో వారు ద్వారకామాయిలో ఉన్నపుడు బాబా అసాథారణంగా వారితో మవునంగా ఉన్నారు. వారు తమ తప్పును తెలుసుకుని మొదటినుంచి బాబాని సంప్రదించనందుకు తప్పు చేశామన్న భావం కలిగింది. వారు లోలోపల ఆయనను క్షమించమని కోరుతున్నారు. వారు ఓర్పుతో యెదురు చుశారు. అప్పుడు ద్వారకామాయిలో జనం తగ్గిపోయాక బాబా, వారిని దగ్గరకు పిలిచారు. ఆయన ప్రసంగించారు. "ఓ ! అమ్మా! మన కొడుక్కి చేయి విరిగితే అతనిని మన యింటినుంచి వెళ్ళగొట్టము. దానికి ప్రతిగా అతనికి తిండి తినిపించి, కోలుకునేలా చేసి తిరిగి మామూలు మనిషి అయేలా చేస్తాము" యిది వినగానే వారు వెంటనె ఆయన పాదాల మీద పడి మన్స్పూర్తిగా థన్యవాదాలు తెలుపుకున్నారు. ప్రియ పాఠకులారా, బాబా విజ్ఞతను వర్ణించడానికి నేను తగిన మాటలు కనుగొనలేకపోతున్నాను. ఆయన నిజంగా "అంతర్థ్యాని". నిజం చెప్పాలంటే నీ మనసులో ఉన్నది ఆయన చదవగలరు.

బాబా లీలలు అంత గొప్పవి. ఆ తల్లి కొడుకులిద్దరూ కూడా అంతగొప్పవారు. ఈ విథంగా బాబా, యింతవరకు యిప్పటి వరకు కూడా తార్ఖడ్ కుటుంబంలో పూజలందుకుంటున్న గణేష్ మూర్తిని రక్షించారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List