

02.10.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి దసరా శుభాకాంక్షలు
ఈ రోజు బాబాతో సాయి బా ని స అనుభవాలలో 16 వ అనుభవాన్ని తెలుసుకుందాము
ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు.

శ్రీ సాయి సచ్చరిత్ర ఏడవ అధ్యాయంలో సాయినాధులవారు కపర్ధే కుమారునియొక్క ప్లేగు వ్యాధిని మరియు శ్రీ సాయి సచ్చరిత్ర 34 వ అధ్యాయములో డాక్టరు పిళ్ళేకి నారి కురుపు వ్యాధిని నివారించిన విధానము మనందరికీ తెలిసినదే. శ్రీ సాయి ఎంతో మందికి శారీరిక రుగ్మతలను తొలగించారు. శ్రీ సాయి ఈనాడు శరీరంతో లేకపోయినా ఇప్పటికీ తన భక్తులయొక్క శారీరిక బాధలను స్వీకరించి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు అని చెప్పడానికి నాకు జరిగిన అనుభవాన్ని మీముందుంచుతున్నాను.
అది 1993 వ సంవత్సరము జనవరి 12 వ తారీకు. నాకుడికాలి మడమవద్ద తీవ్రమయిన నొప్పితో బాధపడుతూ నడవలేకున్నాను. రాత్రి నిద్రకు ముందు బాబాను నన్నీ కాలి నొప్పి బాధనుండి విముక్తుణ్ణి చేయమని వేడుకున్నాను. 13.01.1993 ఉదయము 5 గంటల సమయము. మాయింటిలో ఉన్న పెంపుడు పిల్లి నేను నిద్రిస్తున్న గది తలుపు దగ్గిరకి వచ్చి విపరీతమయిన బాధతో ఏడవసాగింది. నా భార్య తలుపు తీయగానే ఒక కాలు విరగకొట్టుకుని మూడు కాళ్ళమీద కుంటుతూ నావైపు రావడాన్ని చూసాను. మా పెంపుడు పిల్లి అలా బాధపడుతుంటే నేను చూడలేకపోయాను. నేను కాలి నొప్పితో నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కొన్ని గంటలముందు సాయిని నా కాలినొప్పిని నివారించమని ప్రార్థించాను, శ్రీ సాయి మా పెంపుడుపిల్లి రూపములో ఒక కాలు విరగగొట్టుకుని నా బాధను స్వీకరించుచున్నారా అనే ఆలోచన కలిగింది. ఆ సమయమునుండి 24 గంటలలో నా కాలినొప్పి పూర్తిగా తొలగిపోయినది. కాని మా పెంపుడు పిల్లి కాలు నొప్పితో పది రోజులు బాధపడింది. ఆ పదిరోజుల తరువాత మా పెంపుడు పిల్లి యెక్కడికి వెళ్ళిపోయినదో తెలియలేదు, కాని శ్రీ సాయి పెంపుడు పిల్లి రూపములో నాకాలి నొప్పిని స్వీకరించి నన్ను రక్షించారని ఈ నాటికీ నమ్ముతున్నాను.
అది 15.03.1993 వ సంవత్సరము. నాకు హృద్రోగ సమస్య తలయెత్తింది. వైద్య పరీక్షల కోసం 17.03.1993 న మెడ్విన్ ఆస్పత్రికి చేరుకున్నాను. ఆ వైద్య శాలలో వైద్యులు నా గుండె మీద స్ట్రెస్ టెస్ట్ (వత్తిడిని కలిగించే పరీక్ష) చేయటానికి నా శరీరం మీద అనేక చోట్ల ఎలక్ట్రోడులను అమర్చారు.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
