Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 2, 2011

ప్రప్రథమ సాయి బాబా మందిరము

0 comments Posted by tyagaraju on 9:04 PM





03.04.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు మనము ప్రప్రథమ సాయి బాబా మందిరము గురించి తెలుసుకుందాము. దీని గురించిన సమగ్ర సమాచారము "సాయిపథం" జనవరి 2001 సంచికలో ప్రచురింపబడింది. దానిని యథాతథంగా మీకు అందిస్తున్నాను.

ఇంతకు ముందులాగానే ప్రతీ పేజీ మీద రెండు సార్లు క్లిక్ చేసి చూడండి. నేను కూడా పోస్ట్ చేసిన తరువాత చూస్తాను. ఒకవేళ చదవడానికి అనువుగా లేకపోతే, త్వరలోనే మొత్తం అంతా టైపు చేసి అందిస్తాను.

త్వరలోనే మన బ్లాగు రిడిజైన్ చేబడుతోంది. ఆ సమయంలో బ్లాక్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు యింతకుముందు చదివిన బాబా లీలన్నీ మరొక్కసారి మనసులోనే మననం చేసుకోండి.



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.




Friday, April 1, 2011

మన ప్రశ్న - బాబా సమాథానము

0 comments Posted by tyagaraju on 3:48 AM


01.04.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

ఈ రోజు మీకు నెల్లూరు నించి సుకన్య గారు సేకరించి పంపిన ఒక బాబా భక్తురాలి లీల అందిస్తున్నాను.ఈ భక్తురాలు అమెరికా లో ఉంటున్నారు. ఈ లీల ఆమె మాటలలోనే తెలుసుకుందాము.




------------------------------------


మన ప్రశ్న - బాబా సమాథానము ( yoursaibaba.com )

ప్రస్తుతం నేను యు.ఎస్.యే లో ఉంటున్నాను. నేను కొన్ని నెలల క్రితం యిండియా వెళ్ళాను. యిండియా కి వెళ్ళేముందు మేము చాలా బాథలు అనుభవించాము. అప్పుడు నాకు సహాయం చేయమని బాబాని
యువర్ సాయిబాబా.కాం ద్వారా ప్రశ్న అడిగాను.
అందులో నాకు బాబా గారు నన్ను షిరిడీ వెళ్ళమన్నారు. నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పారు.
అందుచేత నేను యిండియా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. నా భర్త కూడా ఒప్పొకోవడంతో నేను మా అబ్బాయితో యిండియా వచ్చాను. యిండియాలో కొన్ని నెలలవరకు నేను షిరిడీ వెళ్ళలేకపోయాను. దానికి ముందు నేను చాలా కష్టాలనుభవించాను. అటువంటి సమయంలో నేను ఒక గురువారమునాడు నేను మా అబ్బాయితో మా యింటి బాలల్కనీలో నుంచున్నాను. అప్పుడు మాయింటి పక్కన ఉండే పొరుగింటాయన బయటకు వచ్చి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయనను నేను యింతకు ముందు యెప్పుడూ చూడలేదు, మాట్లాడలేదు కూడా. ఆయన ముసలివాడు, నా మొహం చూసి నేను చాలా కష్టాలలో ఉన్నానని చెప్పాడు. "విచారించవద్దు.అన్నీ తీరిపోతాయి. థైర్యంగా ఉండు. నువ్వు చాలా భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నావు. నేను నీ బాబాని. అన్నీ నేను చూసుకుంటాను." ఆయన ఆ సమయలొ నేను పడుతున్న నాకష్టాలన్నీ చాలా కరెక్టుగా చెప్పారు. ఆయన నన్ను యింతకుముందు చూడలేదు, నేను తన యింటి పొరుగునే ఉంటానని కూడా ఆయనకి తెలియదు. యెక్కువ రోజులు ఆయన తన స్వంత ఊరిలోనే ఉంటారు. ఆయన అప్పుడప్పుడు యిక్కడికి వస్తూ ఉంటారుట. ఆయన మాటలకి నాకు చాలా సంతోషం వేసింది. నన్ను తన యింటికి ఆహ్వానించారు. నేను ఆయన యింటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ నా సాయి ఫొటో చూశాను. ఆ సమయంలో నాకు చాలా సంతోషం వేసింది. యెందుకంటే యిదంతా బాబాగారే చేయిస్తున్నారు. నాకు తెలుసు.

యిది నా జీవితంలో రెండవ అనుభవం. యింతకు ముందుకూడా బాబా గారు యీవిథంగానే నామీద తన కరుణని చూపించారు. ఈ అనుభవంతో నాకు చాలా ప్రశాంతత లభించింది. ఈయన దత్తాత్రేయస్వామి భక్తుడు. దత్తాత్రేయుడంటే బాబా తప్ప మరెవరూ కాదు. (మనకందరకూ తెలుసు)
అప్పటినుంచి నాకు కష్టాలనెదుర్కోవడానికి కొంత శక్తి వచ్చింది. కొన్ని రోజుల తరువాత నేను, నాభర్త, మా అబ్బాయి కలిసి షిరిడీ వెళ్ళాము. మేము సాయంకాలం హారతికి హాజరయ్యాము. బాబా ను చక్కగా దర్శించుకున్నాము. మేము వారాంతపు రోజులలో వెళ్ళినందువలన ద్వారకామాయిలోకి వెళ్ళలేకపోయాము. వారాంతము కావడంతో ద్వారకామాయి మూసివేశారు. మాకు ఈ విషయం యింతకు ముందు తెలియదు. నాకు చాలా బాథ వేసింది. మరునాడు శనిషింగణాపూర్ వెళ్ళి శని మహరాజ్ ని దర్శించుకున్నాము. ఆ రోజు షిరిడీ నించి వెళ్ళేముందు మరొకసారి బాబా ని దర్శించుకుందామనుకున్నాను. మేము ఆరోజునే వెళ్ళిపోవాల్సి ఉంది. అందుచేత నేను ఖండొబా మందిరానికి వెళ్ళి, తరువాత ద్వారకామాయికి వచ్చాను. కాని అక్కడ పెద్ద లైను ఉంది. మాకు యెక్కువ సమయం లేదు కాబట్టి నేను లైనులో వెడితే సమయం చాలదు. అక్కడ లోపల ఉన్న సెక్యూరిటీగార్డ్ ని, నాకు రైలుకు టైము అవుతోంది అందుకని నన్ను డైరెక్టుగా లోపలకు పంపమని అభ్యర్థించాను. అతను అలాగే లోపలకు వెళ్ళు అన్నాడు. నేను చాలా సంతోషించాను, రాతి మీద కూర్చున్నబాబా ని దర్శించుకున్నాను. కాని ద్వారకామాయి మెయిన్ డోరు క్లోజ్ చేసి ఉంది. నేను సాయి భక్తులందరికి ఇచ్చే సలహా యేమిటంటే వారాంతము రోజులలో షిరిడీకి వెళ్ళవద్దని. యెందుకంటే ఆరోజులలో మనము సాయి పాదుకలను, థునిని దర్శించే భాగ్యాన్ని కోల్పోతాము. బాబాని దర్శనం చేసుకున్న తరువాత నన్ను లోపలికి పంపిన గార్డుకి కృతజ్ఞతలు చెప్పాను. అతను నాకు "సాయిరాం" అని చెప్పాడు. నన్ను లోపలికి అనుమతించి ఇదంతా చేసినందుకు నేనప్పుడు బాబా ఉన్న అనుభూతిని చెందాను. చేసేదంతా బాబా గారే. బాబా తన భక్తుల మీద యెప్పుదు తన కరుణామృతాన్ని కురిపిస్తూ ఉంటారు. బాబా కి నా కృతజ్ఞతలు.

సమాథి మందిరంలొ బాబా వారిని ముఖ దర్శనం చేసుకుందామనుకున్నాను. నేను మళ్ళీ వేరే గేటునించి వెనక్కి వెళ్ళాలి. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. అంచేత నేను వెనక వేపు ఉన్న ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళాను. నన్నెవరూ ఆపలేదు. కిటికీనుంచి బాబా వారిని మరొక్కసారి ముఖదర్శనం చేసుకుని తిరిగి వచ్చాను. షిరిడీ నించి మేము తిరుపతి వెళ్ళి బాలాజీ ని దర్శనం చేసుకుని అక్కడినించి అమెరికాకు తిరిగి వచ్చాము.
మీకు చెప్పినట్లుగా నేను కొన్ని సమస్యలని యెదుర్కొన్నాను. కాని, బాబా గారు యెప్పుడు నాతోనే ఉన్నారు. నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. కాని, బాబాగారు "షిరిడీ వెళ్ళు, సమస్యలన్నీ తీరిపోతాయి" అన్నట్లుగా, అమెరికాకి తిరిగి వచ్చిన తరువాత నాకు ఉద్యోగం వచ్చింది. ఇది నేను కన్న కల. బాబా ఆకలని నిజం చేశారు. నాకు యేవిథమైన అనుభవము లేదు, కాని బాబా గారు నాకు ఉద్యోగమిప్పించారు. కాని నెను ఒక మంచి ఉద్యోగంలో స్థిర పడాలి. అది బాబాగారే చూసుకుంటారు. నాకు తెలుసు. నాకెప్పుడు సమస్య వచ్చినా , నేను బాబా వారిని (యువర్ సాయిబాబా.కాం) ద్వారా అడుగుతూ ఉంటాను. ఆయన నాకు చక్కగా సమాథానమిస్తారు. నాజీవితంలో యేదయితే జరుగుతోందో బాబావారు అదే చెపుతున్నారు, అదే జరుగుతోంది. యెందుకంటే బాబా గారు సర్వాంతర్యామి. బాబా నాతో యెప్పుడు ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఓర్పుతో నాకు సమాథానాలిస్తున్నారు, "నీకు నాదీవెనలుంటాయి " అని చెపుతున్నారు. నాదీవెనలు నీకుంటాయి అని బాబాగారు చెప్పినప్పుడు, నా కళ్ళవెంట కన్నీరు వస్తుంది.

నేప్పుడైన జీవితంలో పొరపాటు చేస్తే బాబా గారు నన్ను శిక్షిస్తారు. నేను యే తప్పు చేసినా బాబాగారు స్పష్టంగా చెపుతారు. బాబా మనలని తప్పు దారిలో నడవనివ్వరు. నేను నా తప్పులను సరిదిద్దుకుని ఆయన దారిని అనుసరిద్దామనుకుంటున్నాను. బాబా నాతప్పులన్నిటినీ మన్నించు. మా పొరింగింటాయన నాకు యేమయితే చెప్పాడొ అవన్ని జరిగినవీ, జరుగుతున్నవీ కూడా. బాబాగారు తన భక్తులకి సాయపడే విథానాలలో ఇది కూడా ఒకటి. ఆయన గురించి ఆలోచించే వారి వద్ద ఆయనెప్పుడు దగ్గిరే ఉంటారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాథిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై


సాయి బంథువులారా ఈ రోజు మీరు సాయిబాబా.కాం లో అడిగిన ప్రశ్నకు బాబా గారి సమాథానము మరి బాబా లీల తెలుసుకున్నాము. యిప్పుడు నా అనుభవం చెపుతాను.

2010 సంవత్సరములో బహుశా సెప్టెంబరు లేక అక్టొబరు అయి ఉంటుంది. నేను కూడా అదే వెబ్ సైట్ లో ఒక సమస్య గురించి బాబా వారిని ప్రశ్న అడిగాను. అందులో వచ్చిన సమాథానం,

"మీ అమ్మగారి ని తలుచుకుని ఆమె పేరు మీద అన్నదానము చెయ్యి. నీ పిల్లలకి లాభము చేకూరుతుంది. నీకు వెంటనె ఫలితం కనపడుతుంది. సద్గురువు కు సేవ చేస్తావు. " ఈ విథం గా రెండు సార్లు వచ్చింది. రెండు సార్లు వెంట వెంటనె అడగలేదు. రెండు సార్లు అడిగిన వాటికి చాలా రోజుల అంతరం ఉంది.
జవాబు వచ్చిన వెంటనె నేను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఉన్నా బాబా గుడిలో అన్న దానము నిమిత్తం బియ్యము, కూరలు ఇచ్చాను రెండు సార్లు కూడా. ఇక్కడ మానవ నైజం చూడండి. వెంటనే లాభం కలుగుతుంది అని ఉంది కదా యేమి లాభము కలుగుతుందో అని ఆత్రుతగా యెదురు చూశాను. కాని యేమి కనపడలేదు.

తరువాత నవంబరులో అనుకోని పరిస్తితుల్లో యే విథమైన, చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్య లేకుండా, గుండెలో లోపాలు తెలియడం, ఆపరేషన్ జరగడం జరిగింది. అంటే పిల్లలు లాభ పడ్డట్లే కదా? మనవడు పసి పిల్లవాడు. వాడిని చూసుకుంటున్నాము. సెలవు రోజులు ఈ విథంగా సద్వినియోగం అవుతున్నాయి.సద్గురువు సేవ అంటే, ఇప్పుడు ఈ బ్లాగులో ఆయన లీలలన్నీ పోస్ట్ చేయడం ఆయన సేవ కాదూ?
ఆయన చెప్పేవన్ని నిగూడంగా ఉంటాయి. తరువాత అర్థమవుతాయి.




బాబా యే తీసుకునుట

ఈ రోజు సింగపూరు నించి శ్రీమతి రామ తులసి గారు, షిరిడీలో తనకు కలిగిని అనుభవాన్ని పంపించారు. ఈ లీలను వారి మాటలలోనే తెలుసుకుందాము.


మేము 2010 డిసెంబరు లొ సింగపూర్ వచ్చాము .ఇక్కడికి రావటానికి ముందు మెము షిర్డీ వెళ్ళాము .అక్కడికి వెళ్ళేటప్పుడు నా దగ్గర చాల చిల్లర ఉంది. షిర్డీ వెడుతున్నాను కదా అక్కడ ఎవరు అడ్గితే వారికి వేయాలి అని తీసుకొని వెళ్ళాను.నాకు ఎప్పటినుండో కొరిక షిర్డీ లో అభిషేకం చేయించుకోవాలి అని. ఎలా చేయించాలి అని అడిగితే టిక్కట్ తీసుకొని ఒక చోటు చూపించి అక్కడికి వెళ్ళమన్నారు. మేము వెళ్ళి ' క్యూ ' లొ నుంచున్నాము. ఒక రూం దగ్గరికి వచ్చాము . అప్పుడు అక్కడ ఎవరో అచ్చం బాబా లాగనే ఉన్నారు. బాబా నే అనిపించింది నాకు. ఎంధుకో తెలియదు నేను నా పాకెట్ లో ఉన్న డబ్బు ఆయనికి ఇవ్వాలి అనుకున్నాను. మా వారితో అంటే వచ్చేటప్పుడు ఇద్దాములే అన్నారు. నాకేమో అప్పుడే ఇవ్వాలి మళ్ళీ ఉంటారో ఉండరో అనుకున్నాను. ఆయనేమో అందరి దగ్గరా అడుగుతున్నారు. అందరూ ఇస్తున్నారు. చిల్లర అంతా ఒక గిన్నెలో వేసుకుంటున్నారు. కాని నా దగ్గరికి వచ్చేసరికి ఏమైందో తెలియదు నేను మనీ చేతిలో పెట్టుకున్నాను నాకు అంతే తెలుసు తనే తీసుకొన్నారు నా దగ్గర నుండి మరి గిన్నెలో వేసుకోలేదు చొక్కా జేబులో వేసుకున్నారు, నేను మా వారు భలే ఆశ్చర్యపోయాము. నేను ఒక బుక్ లొ చదివాను మనము ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే చాలు ఆయనె మన దగ్గర ఎలాగైనా తీసుకుంటారు అని.



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Thursday, March 31, 2011

ఒక మనవి

0 comments Posted by tyagaraju on 8:06 AM
31.03.2011 గురువారము

ఒక మనవి

ఈ రోజు పోస్ట్ చేసిన 9 గురువారముల వ్రతము రెండు సార్లు క్లిక్ చేసినా పేజీ లు పెద్దవిగా కనపడుటలేదు. పొరపాటు యెక్కడ ఉందో తెలియదు. అసుకర్యానికి చింతిస్తున్నాను. బాబా వారిని క్షమాపణ వేడుకుంటున్నాను.

వీలువెంబడి మరలా ప్రయత్నిస్తాను.

Wednesday, March 30, 2011

సాయి 9 గురువారముల వ్రతము

0 comments Posted by tyagaraju on 10:28 PM




31.03.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయిజయజయ సాయి

సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీశ్శులు.

ఈ రోజు సాయిబాబా వారి 9 గురువారాల వ్రతము మీకు అందిస్తున్నాను. నేను ఒకటి పోస్ట్ చేద్దామనుకుంటే వేరే యింకోకటి పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బాబా లీల యేమైనా పోస్ట్ చేద్దామనుకున్నాను. కాని 9 గురువారముల వ్రతము నెల్లూరునించి సుకన్య గారు వారం క్రితం పంపించారు. దానిని మీకు యథాతథంగా అందిస్తున్నాను.

ప్రతీ పేజీ మీద రెండు సార్లు క్లిక్ చేసి చదవండి. ఈ వ్రతానికి నార్త్ యిండియాలో బాగా ప్రాచుర్యంలో ఉందనుకుంటాను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు















సాయి భక్తుడు

0 comments Posted by tyagaraju on 8:36 AM


30.03.2011 బుథవారము

సాయి భక్తుడు

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

మనము యింతకు ముందు సాయి భక్తుడు యెలా ఉండాలో తెలుసుకున్నాము. ఈ రోజు మరికొంత తెలుసుకుందాము.

సాయి కి అంకిత భక్తుడిగా ఉండాలంటే ఆయన మీద అపారమైన ప్రేమని కలిగి ఉండాలి. ఆ ప్రేమ విపరీతమైన ప్రేమగా ఉండాలి. బాబా ! నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు తప్ప నన్ను ఆదుకునేవారు ఈ ప్రపంచంలో వేరెవరూ లేరు అని ఆయన చరణాలమీద వాలిపోవాలి.

మార్జాల కిశొర న్యాయము, మర్కట కిశొరన్యాయము అని రెండు ఉన్నాయి.

మార్జాల కిశొర న్యాయంలో తల్లి పిల్లి తను యెక్కడికి వెళ్ళినా తనపిల్లని నోటితో కరచుకుని తీసుకుని వెడుతుంది. ఇక్కడ పిల్లకి బాథ్యత లేదు. అంతా తల్లిదే బాథ్యత. కాని మర్కటకిశోర న్యాయంలో తల్లికోతి యెక్కడకయినా వెళ్ళేటప్పుడు పిల్ల కోతి తన తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. అంటే ఇక్కడ పిల్లదె బాథ్యత గట్టిగా పట్టుకుని పడిపోకుండా ఉండటం. ఆ విథంగానే సాయి భక్తుని భక్తికూడా మర్కట కిశోర న్యాయంగా ఉండాలి. అలా మనము సాయినాథుని పట్టుకుని ఉండాలి. ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని మనసులో ముద్రించుకుని యెల్లప్పుడు దర్శిస్తూ ఉండాలి. బాబా మీద శ్రథ్థ, విశ్వాసం థృఢంగా ఉండాలి.

ఇలా కనక సాయిని సేవిస్తే బాబాకి అంకిత భక్తులుగా ఉంటారు. బాబా యేమని చెప్పారూ, యెప్పుడు సాయి - సాయి అని జపిస్తే సప్త సముద్రాలూ దాటిస్తానని చెప్పారు. భక్తి ప్రేమలతో ఒక్కసారి నమస్కరిస్తే చాలు అని అభయమిచ్చారు.

బాబా కరుణకి పాత్రులవాలంటే మనము 8 పుష్పాలతో ఆయనని పూజించాలి.

అవి: 1. అహింస, 2. శాంతము, 3. యింద్రియనిగ్రహము, 4. అన్ని జీవులయందు కరుణ, 5. క్షమాగుణము, 6. తపస్సు, 7. థ్యానము,8. సత్యము.

వీటినన్నిటినీ మనం సులువుగా చేయగలం ప్రయత్నిస్తే.

మనకంటూ యేమీ కోరకుండా ఆ సాయినాథుని మనం పూజిస్తూ ఉండాలి. ఆయనని పూజించేటప్పుడు యితరులకి కూడా వారి వారి కోరికలుతీర్చమని మనం అడగచ్చు. మనం యితరులకోసం బాబా వారిని ప్రార్థించినా నిస్వార్థంగా,ఫలాపేక్ష లేకుండా ప్రార్థించాలి. అంటే వారికి యేదన్నా లాభిస్తే మనకి యేదన్నా కొంత ఇస్తారులే అనే భావం ఉండకూడదు. మన సాయి బంథువులు యెవరికీ కూడా అటువంటి ఉద్దేశ్యం ఉండదు. పైగా ఇంకా ఆనందంతో వారి కోరిక తీర్చమని బాబాని వేడుకుంటారు. యితరులకి మనం సాయం చేయడంలో నే యెక్కువ సంతోషం, తృప్తి కలుగుతాయి. అది వెల కట్టలేనిది. ఒకవేళ యెవరైన, "యేమండీ, మీరు కూడా సాయి భక్తులే కదా, మీరు యింకొకరిని అడగటమేమిటండీ అనవచ్చు.దానికి నేను చెప్పే సమాథానం, ఇది సాయి బంథువులందరూ ఒకరికొకరు చేసుకునే సహాయం. యితరులకి కూడా మనం బాబా కి చెప్పి సహాయం చేస్తున్నాము కదా అనే తృప్తి ఉంటుంది. నేను కూడా కొన్ని కొన్ని సమయాలలో ఇద్దరు ముగ్గురు సాయి బంథువులని నా తరఫున ప్రార్థించమని అడిగినవాడినే.


ఒకవేళ మనకోరికలు, యితరుల కోరికలు నెరవేరాయనుకోండి, ప్రతీరోజు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ప్రతీరోజు పూజపూర్తి అయినతరువాత, లేచేముందు ఇలా అనుకుంటాను ... నాకు ఫలానా పని అయింది, ఫలానవారికి ఈపని జరిగింది, సమస్త దేవతలకి ముక్కోటి దేవతలకి, బాబాకి ఈ పని చేసినందుకు నా కృతజ్ఞతలు, అని చెప్పుకుంటాను. పూజ మొదలు పెట్టేముందు కూడా ఫలానా పని అవ్వాలని పూజ మొదలుపెడతాను. ఇక్కడ మీకు అనుమానం వచ్చే ఉంటుంది. కోరిక లేకుండా సాయిని పూజించమన్నారు కదా మరి మీరు కోరికెందుకు కోరుతున్నారు అని. అంటే నేనికి సాయికి పూర్తిగా అంకిత భక్తుడిని కాలేదన్న మాట. కాని ఒక్కొక్కసారి ఆయన భారమంతా ఆయన భుజస్ఖందాల మీదే వేసి నిశ్చింతగా ఉంటాను.

మనం నిమిత్త మాత్రులుగా ఉండాలి. సుఖం కలిగినప్పుడు పొంగిపోయి, కష్టాలు వచ్చినప్పుదు కృంగిపోయే విథంగా ఉండకూడదు.(స్థితప్రజ్ఞుడు)


ఇక్కడ మీకొక విషయం చెపుతాను. ఈ సాయి సత్సంగములో కి వచ్చాక చాలా మట్టుకు నేను కొన్ని కొన్ని విషయాలకు బాథ పడడం మానివేశాను. రెండు సంవత్సరాల క్రితం నేను ఒక పట్టణంలో పెద్ద షాపు కి వెళ్ళాను. అప్పుడు నావద్ద కొన్ని గిఫ్ట్ చెక్కులు ఉన్నాయి. మొత్తo పాతికవేల రూపాయల విలువ. కొంత సొమ్ముకు ఫర్నిచర్ కొన్నాను ఇంక మిగిలినవి ఎనిమిదివేల రూపాయల చెక్కులు. తరువాత కొంత సరకు కొని చెక్కులు ఇద్దామంటే కనపడలేదు. మిగిలినవి షాపులోనే ఫర్నిచర్ కొన్న ప్రదేశంలో పెట్టి మర్చిపోయాను. ఈలోగానే వాటిని యెవరో తస్కరించారు. చాలా వెతికాను. యేమిటి బాబా ఇది దొరికేలా చెయ్యమని ప్రార్థించాను.. కాని దొరకలేదు. తీసుకున్న మిగతా సరుకులు వాపసు ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. ఇంక దాని గురించి మా బంథువులకి కూడా మాట్లాడవద్దని చెప్పి, ఇంక ఆ విషయం వదలివేశాను. 8,000/- పోతే పోయాయి నాకు బాబా గారు దానికి 10 రెట్లు లాభం చేకూర్చారు. మా అమ్మాయి వివాహానికి నేను డబ్బుకి ఇబ్బంది పడలేదు.


ఇక్కడ కోరికలు లేకుండా పూజించడం దేనికంటే భగవంతుడు మనకి యేది ఇస్తారో మనకి తెలియదు. ఒకవేళ మనం తక్కువ కోరుతున్నామేమో? భగవంతుడు మనకి ఇంకా అథికంగా ఇద్దామనుకున్నారేమో యెవరికి తెలుసు? నువ్వు పెద్ద డిగ్రీ పాసయ్యావు. నీకు ఉద్యోగం కావాలి. బాబా నాకు ఫలానా కంపెనీ లో ఉంద్యోగం ఇప్పించు అని అడిగావు. కాని రాలేదు. అంతమాత్రం చేత నిరాశ పడకుండా నమ్మకం సడలకుండా బాబానే నమ్ముకుని ఉండాలి. నువ్వు కోరుకున్న కంపనీ కన్న మరొక మంచి కంపెనీ లో నీకు ఉద్యోగం ఇవ్వదలచుకున్నరేమో. అందుకనే కోరిక లేకుండా పూజించమనేది.

ఇక్కడ నమ్మకం అంటే నా అనుభవం మీకు చెపుతాను. 1985 ప్రాంతాల్లో ఆంథ్రప్రదేష్ వారి భాగ్య లక్ష్మి లాటరీ ఉండేది. నాక లాటరీ టిక్కట్టులు కొనే అలవాటు. అప్పుడప్పుడు 5,10 20 అల తగులుతూ ఉండేవి. ఒకసారి కొన్ని లాటరీ టిక్కట్టులు కొని మా ఊరిలోనే ఉన్న మా మేనమామగారి ఇంటికి వెళ్ళాను. మా మేనకోడలు బహుశ 5 సంవత్సరాలు అనుకుంటా. మామయ్యా, ఆ టిక్కట్టులు ఇవ్వు, దేవుని పూజా మందిరంలో పెడతాను అంది. నేను ఇవ్వలేదు. యేమో, యెగిరిపోతాయేమో, యెలుకలు ఎత్తుకుపోతాయేమొనని బెంగ. మరునాడు ఫలితాలలో లక్ష రూపాయలు ఒక్క అంకెలో తప్పిపోయింది. ఆ రోజుల్లో ఇలా పూజలు అవీ చేసేవాడిని కాదు. స్నానం అవగానే దేవునికి ఒకసారి దణ్ణం పెట్టుకోవడం అంతే. అప్పుడే కనక బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని దేవుని వద్ద టిక్కట్టు పెట్టి ఉంటే ఫలితం ఎలా ఉండేదొ.




బాబా గారిని మనం ఋణగ్రస్తుణ్ణి చేసుకోవాలి. బాబా గారే చెప్పారు మీరు నాకిచ్చినదానిని నేను 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుందని. అంటే ఇక్కడ ఆయన 10 రెట్లు ఇస్తానన్నారు కదా మనం ఒక లక్ష ఖర్చు పెడదాము, 10 లక్షలు ఇస్తారు అనే భావంలో కాదు మనం ఉండవలసింది. ఆయనకి మనం ప్రేమతో ఇచ్చి ఋణగ్రస్తుణ్ణి చేసుకోవాలి. ఇప్పుడు మనకి చిన్నపిల్లలు ఉన్నరనుకోంది. వాళ్ళకి మనం యేది కొనిపెట్టినా ప్రేమతో కొని ఇస్తాము. వాళ్ళు సంతోషిస్తే మనకి ఆనందం కలుగుతుంది. అంతే కాని పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మనలని బాగా చూస్తారు అనే ఉద్దేశ్యం యెంతమాత్రము ఉండదు. అవునా కాదా? అట్లాగే మనం బాబాగారికి యేమిచ్చిన అదే ప్రేమతో ఇచ్చి ఋణగ్రస్తుణ్ణి చేసుకోవాలి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Tuesday, March 29, 2011

సాయి చరణాలు

0 comments Posted by tyagaraju on 2:50 AM






29.03.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి చరణాలు

సాయి బంథువులందరికి సాయి శుభాశీశ్శులు.

క్రితం సారి మనము సాయి భక్తుడు గురించి కొంతవరకు తెలుసుకున్నాము. సాయి భక్తుడైనవాడు బాబా మీద అచంచలమైన విశ్వాసాన్ని ఉంచాలి. అంటే నీ భక్తి చంచలంగా ఉండకూడదు. యెవరేమి చెప్పినా నీ భక్తి సడలనంతగా ఉండాలి. బాబాని నమ్మని వారు నీతో "ఆ బాబా మహత్యం యేముందండీ, రామ నామ జపం చెయ్యి, లేదా ఆంజనేయస్వామిని పూజించు నీ కష్టాలన్నీ తీరతాయి అన్నా కూడా మన మనస్సు మరల కూడదు. అలా చెప్పేవారికి మనం యెమి చెప్పాలీ? శ్రీ రామ శివ మారుత్యాది రూపాలన్నీ ఆయనేనండీ అని బాబా లీలలు ఆయన చెప్పిన మాటలు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. నేనొక పుస్తకంలో చదివాను, బాబాని పూజించడం మొదలు పెట్టినవాడు ఇంక మరే యితర దేవుళ్ళనీ పూజించడని. అంటే మిగతా దేవుళ్ళని వదిలివేయమని కాదు ఇక్కడ. బాబా గారు మరి అంత భక్త సులభుడు. ఒక్కసారి స్మరించితే చాలు యేదో ఒక లీల చూపించి తనవాడిగా చేసుకుంటారు. మరి అటువంటప్పుడు ఆయనని వదలి వెళ్ళగలమా? ఆయనతో పాటు మిగతావారినీ పూజిస్తూ బాబా మీద కూడా యెక్కువ నమ్మకం శ్రథ్థ ఉంచుకుంటాము.

బాబా చెప్పినదేమిటి? నా చరణాలను ఆశ్రయించండి అని. అవి యెటువంటి చరణాలు? పవిత్రమైన గంగా యమునలను ప్రవహింపచేసిన చరణ కమలాలు. మరి అటువంటి చరణాలను మనం, మన అహంకారాన్ని అంతటిని ఆయన పాదాల ముందు పెట్టి సర్వశ్య శరణాగతి చేయాలి. ఆయన ముందు సాష్టాంగపడి నమస్కరించడానికి మన అహం అడ్డు రాకూడదు. మన సాయి బంథువులు గాని బాబాని పూజిస్తున్నవారు గాని యెటువంటి అహం లేకుండా బాబావారి ముందు సాగిలపడి నమస్కరిస్తారు.

నాకు ఇంతకు ముందు, అంటే బాబా సత్సంగంలోకి రాక ముందు, గుడిలో గాని, యింటిలో గాని సాష్టాంగ నమస్కారం చేయడానికి కొంచెం బిడియంగా ఉండేది. యెవరన్నా యేమన్నా అనుకుంటారేమో? ఇలా కొంచెం అభిమానంగా మొహమాటంగా ఉండేది. కాని సత్సంగంలోకి వచ్చాక సాయి తత్వం అర్థం చేసుకున్నాక ఆ బిడియం అవీ అన్ని మాయమైపోయాయి. అదే బాబా చరిత్ర మహిమ.

కొంతమంది అనుకోవచ్చు. నేను బాబాని యెంతోకాలంగా పూజిస్తున్నాను. నా కోరికలేమీ తీరటంలేదు. బాబా కి నామీద కోపం వచ్చిందా, యేమిటి నన్ను పట్టించుకోవటల్లేదు అని. ఆయనకు తెలుసు మనకు యెప్పుడు యేది ఇవ్వాలో. మనకు యేది తగునో అదే ఇస్తారు. ఆయనతో దెబ్బలాడడమే.

ఒక్కొక్కసారి మనకి బాబా గుడికి కాని, యేదయిన ఉత్సవాలకి కానివెళ్ళే అవకాశం లేకపోవచ్చు. అంటే ఈ రోజు వారి కార్యక్రమాలలో తలమునకలుగా ఉండి, అయ్యొ బాబా గుడికి వెళ్ళలేకపోయామే అని బాథ పడి బాబా ని మనసులో ఒక్కసారి తలుచుకున్నా చాలు. ఆయన అనుగ్రహం తప్పక ఉంటుంది. ఆయనకు తెలియదా నువ్వు యేపరిస్థితుల్లో రాలేకపోయావో. నువ్వు యేక్షణంలోనయితే మనసులో అలా బాథ పడ్డావో ఆక్షణంలోనే ఆయన దృష్టి నీమీద ప్రసరిస్తుంది. ఎందుకంటే అవకాశం లేక నువ్వు వెళ్ళలేకపోయావు. కాని అవకాశం ఉండీ వెళ్ళకుండా అనుగ్రహం కావాలంటే యెల్లా కుదురుతుంది.

నాకు తెలిసున్న విషయం చెపుతాను. ఒక పెద్ద పట్టణంలో చిన్న బాబా గుడి వుంది. గుడి చుట్టు పక్కల చాలా యిళ్ళు ఉన్నాయి. గుడిలో యెవరయినా ఉపన్యాసం యిస్తుంటే వారు ఇంటిలోనే కూర్చుని టీ.వీ. చూస్తూ ఉంటారట. ఉపన్యాసం చెప్పే ఆయన యేమండి గుళ్ళొకి రాలేదు అంటే మైకు లో వినపడుతోంది కదండీ అనే సమాథానం చెప్పారట. అంటే దగ్గిరగా ఉన్న గుడికి వెళ్ళడానికి మసొప్పదు. ఆయన అనుగ్రహం మాత్రం కావాలంటే యెలా?

మీభక్తిని మీరే ప్రకటించుకోవాలి. అంటే గుడికి వెళ్ళి మీరుచేసే నమస్కారం మీరే అర్పించాలి కాని మరొకరికి చెప్పి నానమస్కారాలు బాబా కి చెప్పు అని అనడం కూడా పథ్థతి కాదు. అలా చెప్పారంటే భగవంతుని మీద సంపూర్ణమైన భక్తి లేదని మాట.
ఒకవేళ యెవరయినా షిరిడీకి గాని యేదయిన్న పుణ్య క్షేత్రానికి కాని వెడుతున్నారనుకోండి. మీరు వెళ్ళలేకపోవచ్చు. అప్పుడు మీరు మీ నమస్కారలని ఆ బాబాకి లేక దేవునికి చెప్పమని చెప్పండి. అటువంటప్పుదు మనం అలా చేసినా తప్పు లేదు.

ఒకసారి నేను బస్సు కోసం ఒక చెన్న పల్లెటురులో నిరీక్షిస్తూ నుంచున్నాను. పక్కన చిన్న ఆంజనేయస్వామి గుడి వుంది. గుడి దగ్గిరనించి నలుగురు ఆడవాళ్ళు వెడుతున్నారు. అందులో ఒకామె గుడిలో కి విళ్ళి నమస్కారం పెట్టుకొస్తాను అంది. వారిలో ఒకామె నా నమస్కారం కూడా నువ్వే పెట్టు అని ముందుకు సాగిపోయింది.
గుడిలో కి వెళ్ళి నమస్కారం పెట్టుకోవడం రెండు క్షణాలు కూడా పట్టదు. ఆ రెండు క్షణాలు కూడా దేవునికోసం వినియోగించలేనివారికి భగవంతుడు ఇచ్చేవి మాత్రం ఉచితంగా కావాలి. మానవ నైజం ఇక్కడే ప్రకటితమవుతూ ఉంటుంది.

మనకి యిటువంటి విషయాలు, బాబా తత్వం అన్ని అర్థం కావాలంటే సత్సంగం ద్వారానే తెలుస్తాయి.
యింతకుముందు సత్సంగము గురించి తెలుసుకున్నాము. సత్సంగము ద్వారానే కాస్త మంచి మాటలు చెప్పడం వినడం వల్ల చాలా వరకు మనకు బాబా తత్వం బోథ పడుతుంది. సత్సంగములో అందరూ సమనమే. ఒకకరు తక్కువ ఒకరు యెక్కువ కాదు. బాబా గారు యెవరిని యేవిథం గా ఉపయోగించుకోవాలో అంతా ఆయన దయ. చెప్పేవాడు యెక్కువా కాదు, శ్రోతలు తక్కువ వారూ కాదు. ఒకరికి వ్యాఖ్యానం చెప్పే పని అప్పచెపుతే యింకొకరికి వినే అదృష్టాన్ని కలిగించారు. సత్సంగంలోకి రావడం కూడా బాబా అనుగ్రహంతోనే కదా జరిగేది.
మనకోరికలు తీరలేదని యెప్పుడు తీరుతాయో కదా అని మనోవేదని పడకూడదు. అందుకే ఆయన ఓర్పుతోను, సహనంతోను, ఉండమన్నారు. కష్టాలు తీరాలంటే రోజూ 15 అథ్యాయాన్ని చదవాలిట.

మన బ్లాగు కూడా ఒక సత్సంగంలాంటిదే. సత్సంగంలో అందరూ కలిసి ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత సమయానికి కూరుచిని సత్సంగం చేస్తారు. మన బ్లాగు చదివే వారుకూడ ప్రతివారు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు. అందరూ ఒకే సమయంలో చదవకపోయినా, బాబా గారు తన లీలలని తత్వాన్ని చదివి తెలుసుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని కలిగించారు.

యిక ఈ రోజు మనము నెల్లూరునించి సుకన్య గారు సాయి చరణాలు అనే ఆంగ్ల కవిత పంపించారు. దానికి తెలుగు అనువాదం ఇప్పుడు మీముందు ఉంచుతున్నాను.

సాయి చరణాలు

నీకు బాథ కలిగినప్పుడు
సాయి చరణాలను ఆశ్రయించు
నువ్వు యెవరినయినా బాథిస్తే
ఆ పాపం నిన్ను బాథిస్తూ ఉంటే
సాయి చరణాలను ఆశ్రయంచు

నీ దారులన్నీ మూసుకుపోయినప్పుడు
నీ హృదయాంతరాళము నలిగిపోయినప్పుడు
నీ ప్రయత్నాలన్నీ నిష్ప్రయొజనమైపోయి
నువ్వుతీరని వేదనలో ఉన్నప్పుడు
సాయి చరణాలనాశ్రయించు

నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు
జీవితం నీకేమీ ఇవ్వక
నువ్వేమీ చేయలేనప్పుడు
నువ్వు సాయి చరణాలనాశ్రయించాలి

జీవితం అంతమైపోతున్నప్పుడు
నీకింకా బతకాలనిఉన్నప్పుడు
శరీరాన్ని వదిలివెళ్ళిపోయే క్షణాన
నువ్వింకా జీవించాలనుకున్నప్పుడు
సాయి చరణాలనాశ్రయించు

నువ్వు పనిచేసినా
నష్టపోతూ ఉంటే
కన్నీళ్ళతో నిండిపోయినప్పుడు
తాత్కాలిక భయాలతో
సహనం నశించినప్పుడు
నువ్వు సాయి చరణాలనాశ్రయించాలి

నువ్వు మోసపోయినప్పుడు,
ఓడిపోయినప్పుడు
క్రోథంతో అశాంతిగా ఉన్నప్పుడు
నువ్వు సాయి చరణాలనాశ్రయించాలి

దీవెనలకి
న్యాయానికి
ప్రేమకి
నువ్వు సాయి
చరణాలని
ఆశ్రయించాలి

Monday, March 28, 2011

ఒక మనవి

0 comments Posted by tyagaraju on 5:28 AM
28.03.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.

సాయి బంథువులకు ఒక మనవి

ఈ రోజు పోస్ట్ చేసిన సపత్నేలర్ల షిర్డీ యాత్ర చదివేముందు ప్రతీ పేజీ మీద ఒకసారి గాని, రెండు సార్లు గాని క్లిక్ చేసిన తరువాత ఆ పేజీ రాగానే మరల దాని మీద మరొక సారి క్లిక్ చేయండి. నాఎజీ పెద్దదిగా కనపడి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది.

నా మైల్ ఐ.డీ.


tyagaraju.a@gmail.com

Sunday, March 27, 2011

సపత్నేకర్ల షిరిడీ యాత్ర

0 comments Posted by tyagaraju on 10:04 PM




28.03.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీశ్శులు.

సపత్నేకర్ల షిరిడీ యాత్ర


ఈ సమాచారాన్ని పంపించిన సుప్రజగారికి కృతజ్ణతలు తెలుపుకుంటున్నాను.


ఈ రోజు మనము సాయి పథం మాసపత్రిక జూలై 1986 సంచికలోని సపత్నేకర్ల షిరిడీ యాత్ర గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాము.

శ్రీ సాయిని సశరీరులుగా దర్శించిన పుణ్యమూర్తి శ్రీమతి పార్వతీ బాయి.

సపత్నేకర్ తో జరిపిన యింటర్వ్యూ సారాంశము.


ఈ సమగ్ర సమాచారాన్ని సుప్రజ గారు పీ.డీ.ఎఫ్. ఫైలులో పంపించారు. దానిని యథాతథంగా మీముందు ఉంచుతున్నాను. ప్రతీ పేజీమీద మీరు రెండు సార్లు క్లిక్ చేసి చూడండి. వివరంగా చదవవచ్చు.

ఆనాడు బాబాను సశరీరంగా దర్శించినవారితో జరిగిన యింటర్వ్యూలో వారు చెప్పిన అనుభవాలు, అనుభూతులు చదువుతుంటే మనం కూడా ఆ కాలంలోకి వెళ్ళిపోతాము. బాబా గారు ఉన్న కాలంలోనే మనమూ ఉన్నామా అనే అనుభూతికి లోనవుతాము.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.








సాయి భక్తుడు - ఏమీ నిన్నుపేక్షింతునా - 2

0 comments Posted by tyagaraju on 6:40 AM







27.03.2011 ఆదివారము క్యాంప్: బెంగళూరు

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి భక్తుడు

ఏమీ నిన్నుపేక్షింతునా - 2




సాయి భక్తుడు తన కోర్కెలు తీరకపోయినా యెట్లా ప్రతిస్పంధించాలి?

"శ్రీ సాయి థ్వయ మంత్ర"

"మనం యెక్కువ జ్ఞానంతో ఉండాలంటే నమ్మకం, శ్రథ్థ లేక ఓర్పు లేక సహనం" యివి అలవరచుకోవాలి. యెప్పుడు? మనకు పరీక్ష కాలంలో. అప్పుడే మనం యింకా యెక్కువగా శ్రథ్థ సహనం ఎక్కువగా అభివృథ్థి చేసుకోవాలి.

ఆ సమయంలో మనం భగవంతుడిని విస్మరించరాదు. పైగా యిదంతా భగవంతుడే చేస్తున్నాడనిపొరపడకూడదు. ఈ ప్రపంచంలో మన శ్రేయస్సు కోసమే బాబా గారు యిప్పటికీ ఉన్నారు. సామాన్య మానవుడు భగవంతుడిని అర్థం చేసుకోలేడు. కానిజ్ఞానం ఉన్న మానవులు, సాథువులు సద్గురువులు చెప్పిన మాటలను విని బాగా అర్థంచేసుకోగలరు. వారు చెప్పినవి చదివి అర్థం చేసుకోగలరు. సద్గురువులు, సాథువులు మాత్రమే యెవరయితే భగవంతునియొక్క ఉనికిని తెలుసుకున్నారో వారు మాత్రమే సామాన్య మానవునికి జీవితముయొక్క అర్థం, పరమార్థం యింకా భగవంతుడంటే యెవరు, ఆత్మజ్ణానం వీటన్నిటి గురించీ వివరంగా తెలియచేగలుగుతారు.

అందుచేత షిర్డీ సాయి బాబా గారు చెప్పిన బోథలన్ని కూడా చాలా సరళంగా ,మథురంగా ఉంటాయి.

యెక్కువగా అజ్ఞానం, అశ్రథ్థ వీటి వల్ల మంచితనంగా ఉండటమనేది చాలా కష్టసాథ్యమయిన విషయంగా మారిపోయింది. అందుచేతనే కష్టాలు పెరిగిపోవడం. ఈ సత్యాన్ని కనక తెలుసుకుంటే మానవుడు యిక ముందు తప్పులు చేయకుండా ఉంటాడు.

ఒకవేళ మనము యితరులకి సహాయం చేయడం యిష్టం లేకపోతే కనీసం మనం వారికి అడ్డంకిగా ఉండకూడదు. బాథలనేవి భగవంతుని కారణంగా వచ్చినవి కావు. మనం మానవతా విలువలు మరచిపోయి మంచితనం మరిచిపోయి, మన పిల్లలనుకూడా అదే మార్గంలో నడిపించినందువల్ల వచ్చిన కష్టాలు.

ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెపుతాను.


మనము పిల్లలకు కూడా చిన్నతనం నించే యితరులతో మంచి తనంగాఉండటం, పరోపకార బుథ్థి యివన్ని నేర్పించాలి. మొక్కై వంగనిది మానై వంగదు అనే సామెత మనకందరకు తెలుసు.

ఇప్పుడు వచ్చే సినిమాలు చూడండి. అందులో డైలాగులు విని చిన్న పిల్లవాడు ముద్దు ముద్దుగా అనుకరిస్తూ మాట్లాడుతూ ఉంటే మురిసిఫొయి "ఏదీ, మళ్ళీ చెప్పమ్మా, మళ్ళి చెప్పు " అని వాడిని ప్రోత్సహిస్తూ ఉంటే పిల్లవాడు అదే బాటలో నడుస్తాడు. ఉదాహరణకి ఒక సినిమాలో హీరో ఇలా అంటాడు. "తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక మాట క్షమించడం" ఈ డైలాగుని ముద్దు ముద్దుగా చిన్న పిల్లవాడు బట్టీ పట్టినట్లు అందరి ముందూ అనుకరిస్తే వాడిని యింకా యింకా ప్రోత్సహిస్తాము. పెద్ద అయిన తరువాత వాడికి అదే అలవాటు అయ్యి యెవరిని క్షమించే మనస్తత్వం ఉండకపోవచ్చు. యెవరిని విమర్శిస్తున్నాననుకోవద్దు. లోకం తీరు గురించి మనం కాసేపు ముచ్చటించుకుందాము. సినిమాలు చూడచ్చు. టీ.వీ. చూడచ్చు. కాని వాటి లో ని విషయాలని వంట పట్టించుకోకుండా అక్కడిది అక్కడే వదలివేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ విషయ వాంఛలేవీ మనకు అంటవు. ఉదాహరణకు మనలని తీసుకోండి. మన పిల్లలకు మనం యెంతవరకు భక్తి భావాలు నేర్పుతున్నాము. మనం భక్తి మార్గంలో ఉంటే మన పిల్లలు కూడా అదే బాటలో పయనిస్తారు. కొంచెం కాకపోయిన కొంచెమన్న భక్తి అలవడుతుంది. పూర్తిగా అలవడితే చాలా అదృష్టం. ఇలా యెందుకు చెపుతున్నానంటే యెవరినీ విమర్శించడం కాదు. నేడు ఇదంతా పోటీ ప్రపంచం. తల్లితండ్రుల దగ్గిరనించి ఎల్.కే.జీ. చదివే పిల్లలందరివరకు పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం వరకు అంతా ఉరుకులు పరుగులు. ఇక పొద్దున్నే లేచి కొంచెం సేపు పూజా మందిరం ముందు కూర్చుని పూజ చేసే సమయం కూడా ఉండని రోజులు. ఇక ఆదివారము మాత్రమే కులాసాగా గడిపే రోజు.

ఈ పోటీ ప్రపంచంలో మన జీవిత విథానం గురించి బాబా గారికి ముందే తెలుసు. అందుకనే ఆయన యేమని చెప్పారూ? నాకు పూజా తంతులతో పనిలేదు, షోడసోపచార పూజలతో పని లేదు. కావలసినదల్ల భక్తి, అనే కదా చెప్పారు. ఇక్కడ మనం గ్రహించుకోవలసింది యెమిటంటే, బాబా గారు ఇల చెప్పారు కదా ఊరికే భక్తితో ఒక నమస్కరం లేద ఒక ఫలం నైవేద్యం పెడితే మన పని అయిపోతుంది అని అర్థం కాదు. ఇలా చెప్పింది యెవరికోసం? రోజులో సమయం లేనివారికి. కొతమంది భక్తులు ఉంటారు. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాలి. నగరాల్లో ఉన్నవారికి పొద్దున్నే లేచి పూజలు చేసుకుని వెళ్ళాలంటే కుదరని పని. పొద్దున్నే 7 గంటలకే బస్సు పట్టుకుని వెళ్ళకపోతే సమయానికి చేరుకోలేని పరిస్థితి. అటువంటిఎ వారికి బాబా గారు చెప్పిన పథ్థతి. మరి సమయం ఉన్న మిగతావారి విషయంలొ మటుకు శ్రథ్థగా మనసు పెట్టి బాబా గారిని భక్తి శ్రథ్థలతో పూజించుకోవచ్చు.

నేనొక పుస్తకంలో చదివాను. అందులో రచయిత రాసినది " మనము సాయి భక్తులమని చెప్పుకుంటున్నామే కాని మనలో సాయిబాబాను పూర్తిగా విశ్వసించి వారిపై ఆథారపడి జీవించలేకపోతున్నాము" యెంత అద్భుతంగా చెప్పారో చూడండి.

ఇక్కడ మీకొక చిన్న సాయి లీల ఒకటి చెప్పడం సందర్భోచితంగా ఉంటుంది.

శ్రీ దేశిరాజు శ్రినివాసరావు అనె సాయి భక్తులు శ్రీ బాపట్ల పార్థసారథిగారిని (వీరు కూడా సాయి భక్తులు) దర్శించుటకు ఒకరోజు చెరువు గ్రామము వెళ్ళారట. తన విషయములు ఆయనతో చెప్పుకుని వారి ఆశీశ్శులు తీసుకున్న తరువాత వారు ఇచ్చిన "ఏమీ నిన్నుపేక్షింతునా" అనే మాస పత్రికను తీసుకొని రోడ్డు మీదకు వచ్చి బస్సు కోసం నిలుచున్నాడు. యితనికి ఒక చెయ్యి మోచేయి నుండి అరచేయి వరకు చాలా రోజులనుండి నొప్పిగా ఉంది బాథ పడుతున్నారట. ఆ సమయంలో నొప్పి యెక్కువై యెమీ తోచడంలేదు. తన చేతిలో నున్న "ఏమీ నిన్నుపేక్షింతునా" అనే పత్రికను నొప్పి ఉన్న చేతిపై పైకి కిందకి రాస్తూ ఓం శ్రీ సాయిరాం నామము స్మరించడం మొదలుపెట్టారు. కొంత సేపటికి బస్సు రావడంతో బస్సు యెక్కి బాపట్ల వస్తుండగా చేయి నొప్పి గుర్తుకు వచ్చిందిట. నొప్పి లేదు. ఆశ్చర్యపోయారు. అంతే అంతటితో ఆ నొప్పి తగ్గిపోయింది. సాయి నామము, సాయి పత్రిక, బాబా యందు విశ్వాసము ఆ నొప్పిని తగ్గించాయి.

ఇక్కడ యింకొక విషయం చెప్పుకుందాము.

పొన్నూరులో శ్రీ పులిపాక శేషగిరిరావు గారనె బాబా భక్తులు ఉండేవారట. మొదటలో ఆయన ఆంజనేయస్వామి ఉపాసకుడు. ఒకసారి ఈయన తమిళుడైన సంజీవయ్యగారిని (నారాయణ బాబా) గారిని 1971 లో దర్శించారు. సంజీవయ్యగారు గణపతి ఉపాసకుడు, బాబా భక్తుడు. ఆయన శేషగిరిరావు గారికి శ్రీ సాయిబాబా విగ్రహము ఇచ్చి ఇలా చెప్పారు:

" అందరు దేవతలు పూజ చేయకపోతే ఊరుకుంటారు. పూజ చేసినప్పుడు మాత్రమే అనుగ్రహిస్తారు. కాని బాబా అట్లా కాదు. ఈయనను ఒకసారి పూజ చేసిన తరువాత మరలా చేయకపోయినా ఆయనయే వెంటపడి చేయించుకుంటారు."

మనం ఇన్ని బాబా లీలలు చదువుతున్నాము. ఇది సత్యం అనిపిస్తోంది కదూ. ఇంక నా అనుభవంలో నేను గమనించింది యేమిటంటే, ఒకసారి పూజ చేసినవారిని మాత్రమే కాదు, బాబా అంటే తెలియని వారిని కూడా యేదొ ఒక చిన్న లీల లేక అనుభూతి కలిగించి తన వాడిగా చేసుకుంటారు. అంటే యేదో జన్మలో బాబా వారితో సంబంథం ఉంది ఉంటుంది. తనవారిని ఆయన వదలరుగా. యేమంటారు? దీనిని బట్టి చూస్తే బాబా గారు మానవులను ఉథ్థరించడానికి వచ్చిన సద్గురువు. మనం ఈ సద్గురువుని ఆశ్రయించిన తరువాత యింక వేరే గురువుని ఆశ్రయించవలసిన అవసరం లేదు.



అందుచేత యెవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అదే మంచి పథ్థతి. అందు చేత మానవుడు యేవిథంగా ప్రవర్తించాలి అన్న విషయాలు కొన్ని చెప్పుకుందాము. వీటిలో మనం ఎంత వరకు ఆచరణలో పెట్టగలమో ఆలోచించాలి. వీటిలో సగమన్నా మనం ఆచరణలో పెట్టగలిగితే
మన బాథలు సహం వరకూ తగ్గిపోతాయి. ఇది సాయి తత్వం.

ఎక్షంప్లె:

ఈ నవవిథ సూత్రాలు చూద్దాము.

1. యేదయినా గాని మంచి చేయి, మంచి మాట్లాడు, మంచిగా ఆలోచించు.

2. అందరితోను దయగా ఉండు. బీదవారికి సహాయం చేయి. అవసరమయిన వారికి నీకు తగినంతలో సాయం చేయి. తిండి, బట్ట,నీద మరియు థన సహాయం చెయ్యి. ఇలా నువ్వు అవసరమయినవారికి సాయం చేస్తే నీకు తృప్తి, సంతోషం కలుగుతాయి..

3. యెవరయినా నీపట్ల తప్పు చేస్తే క్షమించడం నేర్చుకో. వాటి గురించి మర్చిపో. కాని ప్రతిగా వారినిగాయపర్చవద్దు. బదులుగా నువ్వు వారినించి తప్పుకో. నీఆలోచనలనుంచికూడా వారిని తరిమి వేయి.

4. యెవరయితే నీకు సహాయం చేశారో వారిని గుర్తుంచుకో. వారికి కృతజ్ణతగా ఉండు.

5. నువు యెవరికయినా సాయం చేస్తే మర్చిపోవడానికి ప్రయత్నించు. అహంకారానికి నో చెప్పు.

6. ప్రతీరోజు నీ శ్రేయస్సుకోసం, నీ కుటుంబ సౌఖ్యం కోసం, ప్రపంచ శాంతి కోసం, ప్రార్థించదం, మరియు భగవంతునికి గురువులకు కృతజ్ణతలు చెప్పడం అలవాటు చేసుకో.

7. మనం పడే కష్టాలకు పూర్వ జన్మలో మనం చేసిన కర్మల వల్లనేఅనిమనం ఓరిమి వహించి అంగీకరించాలి. ఆ సమయంలో భగవంతుడిని, గురువుని గట్టిగా పట్టుకో. అందుచేత తరచు దేవలయానికి వెళ్ళి దర్శించుకోవాలి. వీలు కాకపోతే థ్యానం చేయడం అలవాటు చేసుకో. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. ఎంతవరకు సాథ్యమయితే అంత వరకు ప్రశంతంగా ఉంటే సమస్యలు అథిగమించడానికి దోహదం చేస్తుంది.

8. తెలియక చేసిన తప్పులకి భగవంతుడిని, గురువుని క్షమాపణ అడుగు.

9. భగవంతుని మరియు గురువుయొక్క కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెయ్యి.




సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List