Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 27, 2011

బాబా లాకెట్ మరలా బాబాయే బహుమతిగా ఇచ్చుట .. అమిత్

0 comments Posted by tyagaraju on 1:16 AM


27.08.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు శ్రిమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులోని బాబా లీలను తెలుసుకుందాము.


బాబా లాకెట్ మరలా బాబాయే బహుమతిగా ఇచ్చుట .. అమిత్


బాబాయె మన అంతిమ గమ్యం. ఆయన అన్ని ప్రాణుల జీవితాలకి భద్రత కలిగిస్తారు అప్పటికీ దేనినీ కూడా తన స్వాథీనంలోనే ఉందని భావించలేదు. బాబా తన భక్తులకి నిస్వార్థమైన ప్రేమని అందించారు.

సాయి భక్తులందరూ సాయి సచ్చరిత్రను యెంతో భక్తితోను, ప్రేమతోను చదివారని నాకు ఖచ్చితంగా తెలుసు. కాని మీ కెప్పుడైనా బాబా సశరీరంగా ఉండగా యెలా జీవించారో ఆలోచించారా..అవును..ఆయన మనతో ఉన్నపుడు బాబా ఈ ప్రపంచంలో యెలాప్రవర్తించారో మనం తెలుసుకోవాలి. కాని అప్ప్డప్పుడు మనం మన రోజువారీ కార్యక్రమాలలో నిండిపోయి ఆయన చెప్పిన బోధనలని ఆచరించడానికి మనం శ్రథ్థ కనపరచం. బాబా పూర్తిగా అహంకార రహితుడు. ఆయనెప్పుడు సుఖాన్ని, బాథను పట్టించుకోలేదు. ముఖ్యంగా ఆయనను నిందించినా కూడా వాటికెపుడు ప్రభావితం కాలేదు. ఆయన ఆలోచనలో స్థిరంగా ఉంటారు

నేనిప్పుడు సోదరుడు అమిత్ పంపిన వాస్తవమైన బాబా లీలను ప్రచురిస్తున్నాను. మన పాఠకులందరికీ అమిత్ గురించి బాగా తెలుసును, ఇప్పుడాయన మరలా సాయిలీలను మనతో పంచుకోవడానికి ముందుకు వచ్చారు.


ప్రియాంకాజీ


యింతకుముందు నేను పంపిన లీలను ప్రచురించినందుకు నా ధన్యావాదములు. మీరు మంచి సేవ చేస్తూ మేము మంచి మానవులుగా ఉండటానికి, మాలో నమ్మకాన్ని పెంచి, బాబాకు దగ్గరవడానిని సరియైన మార్గాన్ని సూచిస్తున్నారు. బాబా మన సాయి భక్తులందరినీ దీవించుగాక. ఈ కింద ఇస్తున్న లీలని ప్రచురించవలసిందిగా కోరుతున్నాను.


తన భక్తులు కష్టాలలో ఉన్నప్పుడెల్లప్పుడూ ఆదుకుంటూ దయ కురిపించే మన సాయిబాబాకి కోటి కోటి ప్రణామాలు.


2010 లో నా తల్లిదండ్రులు షిరిడీ వెళ్ళారు. షిరిడీనుంచి రెండు సాయిబాబా లాకెట్లు, ఒకటి మా అబ్బాయికి, యింకొకటి మా అమ్మాయికి తెమ్మని వారికి చెప్పాను. వారు సింగపూర్ వచ్చినప్పుడు వాటిని మాకందచేశారు.


ఆరోజు మా అమ్మాయి పుట్టిన రోజు. ఉదయం పూజ అయిన తరువాత వాటిని తాడులో గుచ్చి మా అమ్మాయి, అబ్బాయి మెడలో వేశాము.


సాయంత్రం మా కుటుంబమంతా సాయి దర్శనానికి బాబా గుడికి వెళ్ళారు. నేను ఒక గంట ఆలశ్యంగా వారిని కలుసుకున్నాను. అక్కడికి వెళ్ళాక మా అమ్మాయి మెడలో బాబా లాకెట్ యెక్కడొ పడిపోయి తాడు మాత్రమే మిగిలి ఉందని గమనించాను. గుడి బాగా రద్దీగా ఉంది, లాకెట్ కూడా చాలా చిన్నదవడం వల్ల, నా భార్య, తల్లిదండ్రులు యెంతవెతికినా కనిపించలేదు, బహుశా గుడి బయటే పడిపోయి ఉండచ్చనుకున్నారు.


ఆరోజు మా అమ్మాయి పుట్టిన రోజుకూడా కావడంతో మేమంతా చాలా విచారించాము. నేను దర్శనం లైనులో ఉన్నాను, ఏకధాటిగా బాబా ని మనసులో బాబా నువ్వెప్పుడు మంచికోసం సహాయం చేస్తూనే ఉంటావు .. నాకు తెలీదు నువ్వు పోయిన లాకెట్ ని మాత్రం నాకు తిరిగి తెచ్చివాలి సాయి ..అని ప్రార్థించాను. బాబా కి వంగి నమస్కారం చేసుకుని ఆరతిని కళ్ళకద్దుకున్నాను.


ఒక పెద్ద విచిత్రం.. నా ముందే ఒక భక్తుడున్నాడు..అతను కింద తివాసీ మీదనుంచి ఏదో తీసి దానిని తన బొటనవేలు/వేళ్ళతో పట్టుకుని ఉన్నాడు (నాకిస్తున్నట్లుగా ఉంది భంగిమ) . బాబా దయకి కృపకి నేనమితానందాన్ననుభవించాను.

సాయినాధ్ మహరాజ్ కి జై ఆయనెప్పుడూ తన భక్తుల మొఱలను ఆలకిస్తూ ఉంటాడు.


సద్గురు సాయినాధ్ మహరాజ్ కి


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Thursday, August 25, 2011

సాయి తొమ్మిది గురువారముల వ్రతము - శివ

0 comments Posted by tyagaraju on 9:12 PM


26.08.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగునుండి బాబా 9 గురువారముల వ్రత మహాత్మ్యము , అమెరికా నుండి శ్రిమతి సుప్రజగారు పంపిన బాబా మీద ఒక పాట, శ్రి నగేష్ గారి షిరిడీ యాత్రలోని అనుభూతులను తెలుసుకుందాము.


సాయి తొమ్మిది గురువారముల వ్రతము - శివ

సాయిరాం,

ప్రపంచం నలుమూలల ఉన్న సాయిభక్తులు సాయి 9 గురువారముల వ్రతమాచరించి మంచి ఫలితాన్ని పొందారనిమనకు తెలుసు.


ఇది చాలా శక్తివంతమైనదని, మహిమగలదని రాయవలసిన అవసరం లేదు. దాని శక్తియొక్క తీవ్రత సూటిగా మీకు బాబా మీద ఉన్న నమ్మకం మీద ఆథారపడి ఉంటుంది. యెవరైనా సరే , వయసు, కులం, ఆడ/మగ వివక్షత లేకుండా, మతం, వీటి నియమనిబంధనలు ఏమీ లేకుడా చేయవచ్చు. బాబా రోజు ఏరోజైనా సరే ఈ వ్రతాన్ని ఆరంభించవచ్చు.

ఇప్పుడు నేను సాయి సోదరుడు శివ యొక్క సాయి వ్రతం అనుభవాన్ని మీకు వివరిస్తాను. ఈ సుందరమైన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నందుకు నేనతనిని అభినందిస్తున్నాను.


మీరు కూడా మీ సాయి తొమ్మిది గురువారముల వ్రత అనుభవాలను పంచుకోవాలనుకుంటే నాకు మైల్ చేయండి. ఈ వ్రతాన్ని గురించిన సందేహాలు యేమన్నా ఉంటే ఈ పోస్ట్ దిగువన మీ వ్యాఖ్యను వ్రాయండి. అల్లాహ్ మాలిక్

మీతో ఈ అనుభవాన్ని పంచుకోవడానికి నాకీ అవకాశమిచ్చిన పవిత్రమూర్తికి నా శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


నేను నా జీవితంలో గొప్ప కష్టాలలో ఉన్నప్పుడు, బాబా నా జీవితంలోకి వచ్చారు. బాబా నన్ను, మా కుటుంబాన్ని జీవితంలో యెన్నో కష్టాలనుండి అనవసరమైన పరిస్థితులనుండి రక్షించారు.

చాలా కాలంగా మాజీవితాల్లో యేమి జరుగుతోందన్నది మేమెరగము. మాస్టర్ (బాబా) మీద నానమ్మకం చంచలంగా ఉంటూఉండేది కాని యెలాగో బాబా నన్ను సరైన గాడిలోకి తీసుకువచ్చారు.


చాలా అనుభవాలలో నేనొక అనుభూతిని వివరిస్తాను. (తొమ్మిది గురువారాల వ్రత మహత్యం)

కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల నాకు ఇప్పుడు చేస్తున్నలాంటిదే మరొక మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలిపెట్టిన రోజులలో జరిగిందిది. మొదటి రెండు నెలలు నాకు తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుందని బాగా ఆశతో ఉన్నాను. పరిస్థితులు దిగజారడం మొదలెట్టాయి, నా తల్లితండ్రులు కూడా నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందసాగారు.


యింకా చెప్పలంటే నా మూర్ఖత్వం వల్ల మా నాన్నగారికి ప్రమాదం సంభవించింది.


చేతిలో డబ్బు లేక నేను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాన్నగారి మంచి మిత్రులు కొంతమంది సహాయంతో, నా బంధు వులతోనూ పరిస్థితిని నెట్టుకొస్తున్నాము.

యిదంతా కూడా నా సోదరి తొమ్మిది గురువారముల వ్రతం చేస్తున్నప్పుడు, జరిగింది. అది నాకు తెలీదు. ఆమె 8 వ్రతాలు పూర్తి చేసింది, కాని మా నాన్నగారు ఆస్పత్రిలో ఉండటంవాల్ల ఆఖరి గురువార వ్రతం చేయలేకపోయింది.


కాని బాబా దయతో అన్నీ చక్కబడ్డాయి. మా నాన్నగారు చాలా త్వరగానే కోలుకుని, యింతకుముందులాగే యెటువంటి బాధ లేకుండా నడవగలుగుతున్నారు.

ఆఖరి గురువారమునాడు నా సోదరి ఆఖరి గురువారం వ్రతం పూర్తి చేయగానే, నాకు అదే గురువారమునాడు రెండు కంపెనీలనుంచి పిలుపు వచ్చింది ( ఇది ఒక అద్భుతమైన లీల లేకపోతే యిన్ని నెలలుగా నాకు ఏ కంపెనీ నుంచి పిలుపు రాకుండా, నాసోదరి గురువారము వ్రతము ఉద్యాపన రోజునే పిలుపు రావడమేమిటి) అందరూ చెప్పిన సలహాప్రకారం నేనొకదానిని యెంచుకున్నాను అదికూడా బాబాగారి ఇష్ట పడ్డదె.


అప్పటినుంచీ నేనెక్కడికి వెళ్ళినా బాబాగారు ఉన్నారనే అనుభూతిని పొందడం మొదలైంది.


నేనీ కొత్త కంపెనీ లో ప్రవేశించిన నాలుగు నెలలతరువాత ప్రాజెక్ట్ నిమిత్తమై అమెరికాకి పంపబడ్డాను. ఇక్కడా నాకు గొప్ప ఆశ్చర్యకరమైనది యేమిటంటే నేనొక మంచి మితృడిని సంపాదించాను, అతనుకూడా గొప్ప సాయి భక్తుడు. అతను నన్ను ప్రతి గురువారం సాయి మందిరానికి తీసుకుని వెడుతూ ఉండేవాడు. నిజానికి సాయి నాకు యెంతో మంది స్నేహితులని బహుమతిగా ఇచ్చారు, వారంతా కూడా సాయి భక్తులే.

అందుచేత నేను సాయి భక్త స్నేహితులందరికీ చెప్పదలచునేదేమిటంటే ఈ సాయి తొమ్మిది గురువారముల వ్రతాన్ని కనక నమ్మకంతో చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. మరొక్కసారి నా హృదయాంతరాళలోనించి, నా మాస్టర్ సాయికి, నా ఉద్యోగంకోసం సాయి వ్రతమాచరించిన నా సోదరికి, మా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నవారందరికీ, నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


నా సాయి మనందరిమీద ఆయన అనుగ్రహపు జల్లులను కురిపంచుగాక.


సర్వం శ్రీ సాయినాథారపణమస్తు.

అమెరికా నుంచి శ్రీమతి సుప్రజ గారు బాబా మీద ఒక పాటను పంపించారు. దానికి రాగం కూడా కట్టించి ఈ సందర్భంగా ప్రచురిస్తున్నాను.

రాగం : రంజని

ఓ సాయి ఏమని వర్ణింతును నీ లీలలు

మనసులో ఉన్న భావాలు మాటలకందడము లేదే సాయి

నీ లీలలు విని నేను మాటలాడలేక మౌనం పాటిస్తే తండ్రీ

ఓ సాయి ఏమని వర్ణింతును నీ లీలలు

నా మది కోరిక వినపడలేదా ఓ సాయి

లేదా విని పరీక్షిస్తున్నావా ఓ నా ప్రభూ


తల్లివి తండ్రివి నీవేకదా సాయి

నీవు ఆలకించకపోతే ఎవరికి విన్నవించను
నా మది బాధ

నీ కధలు వింటే నీవేదిక్కని నీ చెంతకు వస్తి సాయి

నను దరిచేర్చవోయి నీ ఒడికి, ప్రేమ కురిపించఓయి నాపై

నిన్నే చూడగ నా మనస్సు స్థిరపడె,
పాల ముంచిన తేనె ముంచిన భారము నీదేనయ నామొఱ ఆలకించి కనికరించరాదా ఓ సాయి ఈ సారి.

శ్రి నగేష్ గారు హైదరాబాదు నుంచి తమ అనుభవాని పంపించారు. ఆయన ఈ నెల 5 వ తారీకున షిరిడీని దర్శించడం జరిగింది. అక్కడ ఆయనకు కలిగిన అనుభవాలను కూడా ఆయన మాటలలోనే ఆలకించండి.

ఓం సాయిరాం

నా షిర్డీ సందర్శనం చాలా బాగా జరిగింది.4 సార్లు బాబా ను దర్శించుకోవడం జరిగింది

షిర్డీ లో నాకు కలిగిన అనుభవాలు

1 .షిర్డీ లో బస్సు దిగిన వెంటనే భూమాతకు మరియు బాబా కు నమస్కరించుకొని మాకు

కావలసిన అడ్రస్ కోసం చూస్తున్నాము అంతలో ఒక వ్యక్తి నాకు కావలసిన అడ్రస్ ను నాకు వినిపించి వినిపించనట్లు అడ్రస్ ను చెప్పుకొంటూ వెడుతున్నాడు. ఒక 10 సెకండ్స్ తరువాత నాకు విన్పించింది వెంటనే నేను వెళ్లి అడ్రస్ అడిగి తెలుసుకున్నాను .అలా బాబా నాకు అడ్రస్ చూపించడం జరిగింది.యిది నాకు చాల ఆనందాన్నిచ్చింది.

2

నేను ద్వారకామాయి దర్శనానికి వేరే లైను లో నిలబడి ఉన్నాను ,అప్పుడు ఒక నల్ల కుక్క ఒకటి నా పక్క నుండి వెడుతోంది.. నేను బాబా యే కనక వచ్చి ఉంటే కుక్క వెనకకితి రిగి నా వద్దకు రావాలి అనుకున్నాను

.అంతలోనే కుక్క నా పక్కకు వచ్చి కూర్చుంది. కూర్చుని తలను కిందికి మీదికి మూడు సార్లు ఊపడం జరిగింది.

.ద్వారకామాయి నుండి బయటకి వచ్చి ప్రసాదం పంచాలని యెక్కడ పంచుదాం లేక వేరే చోట పంచుదామా అని ఆలోచిస్తున్నాము, ఎవరు రావడం లేదు అంతలోనే ఒక గుంపు మా దగ్గరికి వచ్చి ప్రసాదం తీసుకోవడం జరిగింది

యివి నాకు కలిగిన అనుభవాలు ,బాబా నాకు యిచ్చిన అనుభవాలు

-సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు





అబా పన్షికర్ నుంచి సాయి ప్రసాదం

0 comments Posted by tyagaraju on 12:58 AM

25.08.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

తార్ఖడ్ కుటుంబం వారికి బాబావారు కలిగించిన/చూపించిన అద్భుతమైన లీలలను 28.07.2011 గురువారమునాడు ప్రచురించడం మొదలుపెట్టాను. ఆగష్టు 20 తారీకునాటికి పూర్తి చేయగలననుకున్నాను. కాని ఈ గురువారమునాటికి అనగ 25 తారీకుతో ప్రచురించడం పూర్తి అవుతోంది. శ్రీమతి సుప్రజగారు పంపిన పీ.డీ.ఎఫ్. ఫైలులో వెండి భరిణ గురించిన లీల లేదు. కాని ఆ లీలను నేను సాయి లీల పత్రికనుండి అనువాదము చేసి 13.01.2011 న ప్రచురించడం జరిగింది. కాని వరుస క్రమం తప్పకుండా ఉంటుందనే ఉద్దేశ్యంతో మరలా దానిని ప్రచురిస్తూ, తార్ఖడ్ గారి ఆఖరి అనుభవాన్ని కూడా ప్రచురిస్తూ, ఈ గ్రంథాన్ని ముగించడం జరుగుతోంది.

ప్రతీ రోజు క్రమం తప్పకుండా, మథ్యలో 2 రోజులు, అనుకోని అవాంతరం వచ్చినప్పటికి, ప్రతీరోజూ నా చేత ప్రచురించడానికి బాబా వారు చేసిన సహాయమే తప్ప మరేమీ కాదు. నాకీ అద్భుతమైన అవకాశాన్నిచ్చిన బాబా వారికి నా థన్యవాదాలు తెలుపుకుంటూ, మన సాయి బంథువులందరిమీద ఆయన అనుగ్రహపు జల్లులను నిరంతరం కురిపించమని మనసారా వేడుకుంటున్నాను.

యిక మిగతా రెండు అనుభవాలను చదవండి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.



అపురూపమైన వెండి భరిణె

ఈరోజు మనం బాబా భక్తులైన తార్ఖడ్ కుటుంబములో శ్రీ వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ ముంబాయి వారు తన అనుభవాన్ని, సాయిలీల పత్రికలో కొన్నిసంవత్సరాల క్రితం వ్రాయగా, దాని అనువాదాన్ని ఆయన మాటలలోనే మీముందు ఉంచుతున్నాను. ఈ అనుభవం చదువుతుంటే ఒడలు పులకరిస్తుంది.

సాయి భక్తులందరూ కూడా ప్రతీరోజు ఊదీని ధరించి బయటకు వెళ్ళే అలవాటు చేసుకొవాలి.

సిల్వర్ బాక్సు (వెండి భరిణె) బై: వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ :: ముంబాయ్

నా మీద బాబా కురిపించిన అనుభూతి గురించి చెప్పేముందు నా గురించి కొంత గత చరిత్ర చెబుతాను. శ్రీ సాయి సచ్చరిత్రలో 9అథ్యాయంలో హేమాడ్ పంత్ గారు మా తాతగారైన బాబా సాహెబ్ తార్ఖడ్ గారి గురించి చెప్పడం జరిగింది.

సీతాదేవి రామచంద్ర తార్ఖడ్, రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ , జ్యోతేంద్ర రామచంద్ర ,వీరు ముగ్గురూ కూడా 1909 నుంచి 1918 వరకు బాబాతో ఉన్న అదృష్టవంతులు. అందుచేత తార్ఖడ్ ఫామిలీ కి తరతరాలకి ఆయన ఆశీస్సులు అందచేస్తూనే ఉన్నారు. బాబాగారు మాకులదేవత. ఆయన మమ్ములని ప్రతి విషయంలోను రక్షిస్తూ ఉన్నారు. మేము మా జీవితమంతా ఆయనయొక్క అనుగ్రహాన్ని పోందుతున్నాము. ఇంకా ముందు ముందు పొందుతామన్న నమ్మకం మాకుంది.

నేనిప్పుడు ఒక అద్భుతమైన అనుభూతిని మీ ముందు వుంచుతున్నాను.

ఈ సంఘటన 1973 నవంబర్ దీపావళి రోజులులో జరిగింది. నేను మొట్టమొదటి సారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను. నేను పని చేసే కంపనీ వారు ట్రయినింగ్ నిమిత్తం ఇంగ్లాండ్ పంపిస్తోంది. నేనక్కడ లండన్ కి 100 కి.మీ. దూరంలో ఉన్న చోటమార్చ్ వరకూ ఉండాలి. అందుచేత అవసరమయినవన్నీ కూడా సద్దుకోవడం చాలా ముఖ్యం.

నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి చేరుకున్నాను. ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను. సోమవారం పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గిర ఊదీ లేదని తెలుసుకున్నాను. చిన్నప్పటినుంచీ బయటకు వెళ్ళేటప్పుడు ఊదీ పెట్టుకోవడం మాకు అలవాటు. నాకు కొంత నిరాశ వచ్చింది. అప్పుడు నాకు ట్రావలింగ్ సూట్కేసులో మొట్ట్ఘమొదట ఊదీ పాకెట్ పెట్టి తరువాత బట్టలు సద్దటం నా భార్యకు అలవాటని గుర్తుకొచ్చింది. వెంటనే నేను సూట్కేస్ ఖాళీ చేసి చూడగా ఊదీ పాకట్ కనిపించింది

.కాని అది 5 నెలలు వరకూ వస్తుంది. నేను నా ఉద్యోగ రీత్యా ముంబాయి నుంచి తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండాలి. అందుచేత ముంబాయి వెళ్ళగానే ఒక వెండి డబ్బా ఊదీ వేసుకునేందుకు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను. లండన్లో ఈ చిన్న ఊదీ పాకట్ పెద్ద సహాయకారి.

లండన్ లో నాకు ఇచ్చిన ట్రయినింగ్ లో పని పూర్తి చేసుకుని మార్చ్ లో ముంబాయి వచ్చాను. ముంబాయి లో వెండి డబ్బా కొనడానికి నాభార్య, అత్తగారితో కలిసి గిర్గావ్ వచ్చాను. షాప్ లో ఉన్న కుర్రాడు 7,8 బాక్సులు చూపించాదు. కాని బాక్సు లకి అన్నీ మూతలు విడిగా వచ్చే విథంగా ఉన్నాయి. అందుచేత నాకు అల్లా మూత విడిగా రాకుండా, బాక్సుతోనే మూత అతికిఉన్నది కావాలని చెప్పాను. . ఆర్డర్ ఇస్తే తయారు చేయిస్తాను అని చెప్పారు. అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వడం యెందుకు మరో షాప్ లో చూ ద్దా మని ప్రక్క షాప్ లోకి వెళ్ళాము. షాప్ వానికి నాకు కావలసిన బాక్సు చెప్పాను. షాప్ యజమాని పాత బాక్సు అయినా ఫరవాలేదా అని అడిగాడు. పాత బాక్సు అంటే యెమిటి? అని అడిగాను. కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారు. వాటిలో మీఎకు కావలసిన బాక్సు ఉండవచ్చు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది ఇదివినగానే. పవిత్రమయిన బాబా ఊదీ వేసుకోవడానికి పాత వెండి బాక్సు కొనడమా? అదేమన్నా మంచి పనేనా?నా భార్య, అత్తగారు కూడా ఇలాగే ఆలోచించి మరో షాప్ లో క్రొత్త బాక్సు ఉంటుందేమో చూద్దమనుకున్నారు. కాని షాప్ యజమానిని బాథ పెట్టడం యెందుకని పోనీ తీసుకొచ్చాక వద్దని చెప్పవచ్చులే అనుకొని, సరే తీసుకురండి చూస్తామని చెప్పాము.

ఈలోపున షాప్ యజమాని మాకు యెలాంటి బాక్సు కావాలో అదే తెచ్చి ఇచ్చాడు. ఆ బాక్సు చూడగానే నాకు తెలివితప్పిపోయింది. యెందుకంటే అది చాలా నల్లగా ఉంది.నా మొహంలో భావాన్ని చూసి, షాప్ యజమాని అన్నాడు, "అయ్యా, ఒకవేళ మీరు కోరుకునే బాక్సు ఇలాంటిదే అయితే వర్రీ కావద్దు. దీనికి మెరుగు పెట్టి క్రొత్తదానిలా తయారు చేయించి ఇస్తాను" అన్నాడు. షాపతను పాపం చాల శ్రమ తీసుకున్నాడనిపించింది నాకు. బాక్సు మూత తెరిచి చూడగానే నాకు నోట మాటరాలేదు. బాక్సు వంక కన్నర్పకుండా చూడ టం మొదలుపెట్టాను. నా భార్య, అత్తగారు నన్నుచూసి యేమయింది అలా ఉండి పోయావు? యెమి జరిగింది? అన్నారు. వారికి బాక్సు చూపించగానే వాళ్ళకు కూడా నోటమాట రాలేదు.

బాక్సు మూత లోపల బాబా బొమ్మ అతికించి ఉంది.

ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు. చిన్న బాక్సు లో బాబా బొమ్మ యెవరు ఫి ట్ చేస్తారు? పైగా ఇది 1974 సం. బాబా మీద భక్తి అంతయెక్కువగా లేదు. ఇప్పుడు ఉన్నంతగా అప్పుడు ఇంతమంది భక్తులు లేరు.

అందుచేత యెవరయిన బాబా భక్తుడు ఇంత శ్రమ తీసుకుని బాక్సులో బాబా బొమ్మ పెట్టాడంటే నాకు నమ్మబుథ్థిగాలేదు. లేకపోతే గణపతి, రాముడు, కృష్ణుడు, శంకరుడు, వేరే దేవుళ్ళ బొమ్మలు పెట్టుకునుందేవారు.

షాప్ యజమాని బాక్సుకి మెరుగు పెట్టించి ఇచ్చాడు. అది ఇప్పటికి మెరుగు తగ్గకుండా వుంది. ఇంట్లో ఇంకా కొన్ని వెండి సామాన్లు,బొమ్మలు ఉన్నాయి అవి కొంతకాలమయిన తరువాత నల్లగా మారాయి కాని, ఈ బాక్సు మాత్రం ఇంకా వన్నె తగ్గలేదు. ఈ బాక్సు యెప్పుడు నాతోనే ఉంటుంది. బాబా ఊదీ యెప్పుడు తీసుకున్నా బాబా దర్శనం బాక్సులో నాకు కనపడుతూ ఉంటుంది.

నేను గతం గుర్తు చేసుకుంటే, నేనేకనక కొత్త బాక్సుకి ఆర్డర్ చేసుంటే అందులో బాబా ఫోటో వుండేది కాదు. ఇప్పటికి అనుకుంటాను బాబా నాకోసమే ఆ బాక్సు తయారు చేయించారేమోనని. తార్ఖడ్ కుటుంబంలో మూడవతరంవారమయిన మాకు బాబామీద ఇంకా నమ్మకం బలపడింది.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు



అబా పన్షికర్ నుంచి సాయి ప్రసాదం







యిక మామూలు క్రమంలో వాస్తవ సంఘటనలు ముందున్నాయి. మా బంగళా బ్లూ ప్రింట్ ని మేము తయారు చేసినప్పుడు, పూజ చేసుకోవడానికి, థ్యానానికి ఒక చిన్న పాలరాతి మందిరం కూడా ఉండాలని నిర్ణయించుకున్నాము. మందిరం తయారయింది, దానిలోకి నిలువెత్తు సైజు బాబావారి రంగుల చిత్రపటం ఉంచాలని బలమైన కోరిక కలిగింది. మేము చాలా ప్రయత్నం చేశాము కాని దొరకలేదు. అది ఏప్రిల్ నెల 1993. బొంబాయి మార్చ్ నెలలో విషాదకరమైన బాంబు పేలుళ్ళను చవి చూసింది. ప్రజలంతా అపరిచితులనెవరితోనైనా మాట్లాడటానికి భయపడేవారు. ఒక రోజున సాయంత్రం పొద్దు పోయాక ఒక అపరిచిత వ్యక్తి మా యింటి తలుపు బెల్ మోగించాడు. నా భార్య తలుపు వద్దకు వెళ్ళింది. ఆ అపరిచిత వ్యక్తి ప్రత్యేకంగా నన్నే కలుసుకోవాలని పట్టుపడుతున్నాడు. అతను నా పేరు చెప్పలేకపోవడంతో నాభార్య అతని గురించి కొంచెం అనుమాన పడింది. అప్పుడు నేను కల్పించుకోవడంతో నన్నతను గుర్తు పట్టాడు. షిరిడీలో లెండీ బాగ్ లో తామిద్దరమూ కలుసుకున్నామని గుర్తు చేసి, తనకక్కడ బాబా అనుభవాన్ని కూడా చెప్పినట్లు చెప్పాడు. అప్పుడు నాకు స్పష్టంగా బోథపడింది. అతను పూనా సాయి మందిరంలో సామాజిక సేవకుడు. అతనిని యింట్లోకి రావడానికి అనుమతించాను. అప్పుడది రాత్రి భోజనం చేసే సమయం కనుక మేమతనిని భోజనం చేయమన్నాము. దానికతను అంగీకరించాడు. మేము మాట్లాడుకుంటున్నపుడు నేనతనిని సాయిబాబా రంగుల చిత్రపటం కావాలనే నా కోరికను వెల్లడించాను. మేము కనక రంగుల చిత్రపటం కోసం చూస్తూ ఉండినట్లయితే, ఒక చిత్రకారుడినుంచి నిలువెత్తు చిత్రపటానికి రంగులు వేసినది పొందవచ్చని వెంటనే సమాథానమిచ్చి, అప్పుడే అబా పన్షికర్ మాకు సహాయం చేయగలరని చెప్పాడు. మరాఠీ రంగస్థలం మీద ప్రముఖ నటుడయిన ప్రభాకర్ పన్షికర్, అతని తమ్ముడయిన అబా పన్షికర్ ఫోన్ నంబరు అతని వద్ద ఉంది. నేనాయనకి ఫోన్ చేసి లండన్ లో ఉన్న అబా పన్షికర్ నంబరు తీసుకుని ఫోన్ చేశాను. రంగుల చిత్రపటం గురించిన నా కోరికను విని, అతను తాను మే నెలలో బొంబాయి వస్తున్నానని, తనను తన తమ్ముడు ఉండే చోట ప్రభాదేవి వద్ద కలుసుకోవచ్చనీ సమాథానమిచ్చాడు. నేను మే నెల దాకా నిరీక్షించి ఒక శనివారం సాయంత్రానికి కలుసుకోవడానికి అనుమతి తీసుకున్నాను. మేమంతా, అనగా నాభార్య కుందా, మా అమ్మాయి సుజాల్, నా కుమారుడు మహేంద్ర అందరమూ కలిసి 22, మే,1993 న. వెళ్ళాము. నా కతని గురించి అసలు తెలీదు. మా ముందు కాషాయ వస్త్రాలు థరించి మెడలో రుద్రాక్ష మాలతో ఒకాయన మాముందు కనిపించాడు. అబా పన్షికర్ గారు తనను తనను పరిచయం చేసుకున్నారు. నేనాయనకు చేతులు జోడించి 'నమస్కారం' చేసి నా కుటుంబాన్ని పరిచయం చేశాను. పూలదండ, కోవా ఏమీ తేకుండా ఉట్టి చేతులతో ఎలా వచ్చారని ఆయన కొంచెం మందలించారు. ఆయన మాకోసం చిత్రపటం తెచ్చినట్లు నాకసలెప్పుడూ చెప్పకపోవడంతో నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఏమయినప్పటికీ నా తప్పును మన్నించమని వెంటనే సిథ్థివినాయక మందిర ప్రాంతానికి వెళ్ళి పూలదండ, కొన్ని కోవా బిళ్ళలు కొన్నాను. ఆయన లోపలికి వెళ్ళి తనతో కూడా ఏనుగుసైజంతగ ఉన్న చిత్రపటాలను వుంచే పెట్టిని తీసుకునివచ్చారు. దానిని తెరచి డ్రాయింగ్ పేపరు చుట్టను తీశారు. ఆయన ఆ చుట్టను విప్పారు. దాని మీద ప్రసిథ్థమైన సిం హాసనం మీద కూర్చుని సాయి తన నిత్యమైన చిరునవ్వుతో మాముందున్నారు. ఆయన సలహామీద, 1 మీ.మీ.దళసరి కోడక్ పేపరు మీద చిత్రించబడ్డ రంగుల చిత్రపటానికి దండవేసి అందరికీ కోవా పంచాను. అబా గారు దాని మీద సందేశం యిలా రాశారు, "వీరేంద్ర, కుందా, సుజాల్, మరియు మహేంద్ర కు" --- అబా పన్షికర్ నుంచి సాయి ప్రసాదం"... కింద సంతకం చేశారు. అప్పుడాయన "మీ నిథిని తీసుకోండి" అన్నారు. పాఠకులారా అది నా జీవితంలో బంగారు క్షణమంటే నమ్మండి. ఏమి చేయడానికి నాకు నోట మాట రాలేదు.
నిస్సందేహంగా నాకది విలువకట్టలేని సంపద. నేను నాపర్సులోచి రూ.1,001/- తీసి ఆయనకిచ్చాను. కాని దానినాయన అంగీకరించలేదు. తాను బాబా ఫోటోలు అమ్మనని చెప్పారు. లండన్ లో సాయి మందిరానికి విరాళంగా తీసుకోమని చెప్పాను. అయిష్టంగానే ఆయన ఒప్పుకుని, చేతితో తీసుకోకుండా దానిని బల్లమీద పెట్టమన్నారు. ఆయన మా గత చరిత్ర గురించి అడిగారు. సాయిబాబాతో మా నాన్నగారికున్న అనుబంథం గురించి చెప్పాను. నేను చెప్పినది వినగానే నన్నాయన కౌగలించుకుని తానా రోజు తన జీవితంలో అమితమైన ఆనందాన్ని పొందానని చెప్పారు. ఆయన ఉద్విగ్న్నతతో లోపలికి వెళ్ళి రూపాయి నాణాలు రెండు తెచ్చి నాకిచ్చారు. నేను వాటిని తీసుకుని ఆయన ముందు సాష్టాంగ పడి "నేనిప్పుడు బాబా యొక్క నిజమైన ప్రసాదాన్ని పొందాను" అన్నాను. ఆయన దీనికర్థమేటని అడిగారు. "ఈ రెండు నాణాలు బాబాగారి విశ్వవ్యాప్తకమైన సందేశం అనగా 'శ్రథ్ఠా' మరియు 'సబూరీ' , ఆయన ఉన్న కాలంలో ప్రపంచం మొత్తం వ్యాపించిందని" చెప్పాను. నా వివరణతో అబా సంతోషంలో మునిగిపోయారు. ఆయన కళ్ళనుంచి ఆనంద భాష్పాలు జాలువారుతూండగా, తానారోజు ఒక నిజమైన సాయి భక్తుడిని కలుసుకున్నానని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు.

అప్పుడు ఆబా మాకు తన కథను చెప్పారు. ఆయన తండ్రి, గిర్గావ్ లో ఉన్న గణపతి మందిరం ప్రథాన పూజారి. తనకి 8 సం.వయసప్పుడు ఒక ముస్లిం ఫకీరు వారి యింటి ఆవరణలోకి వచ్చి సాయిబాబా ఫోటొనిచ్చారు. ఆబా, ఆఫకీరుతో తాను బ్రాహ్మణుల కొడుకుననీ, యింటిలో ముస్లిం బాబా ఫొటోను పెట్టనివ్వరనీ అన్నాడు. ఆపుడాఫకీరు, "బేటే, అబ్ తూ యిసే మత్ లే తేరీ కిస్మత్ మే లిఖాహై తూ ఇస్కీ జిందగీ భర్ సేవా కరేగా జోర్ ఇస్కే ఫోటో లోగోంకో బతా కరేగా" (అబ్బాయి, యిప్పుడు నువ్వీ ఫొటోని తీసుకోలేకపోవచ్చు, కాని నీ భవిష్యత్తుని చదవగలను. నువ్వు నీ జీవితాంతమూ ఆయన సేవ చేస్తావు. ఆయన చిత్రాలని నువ్వు ప్రజలకు పంచుతావు). ఆయన భవిష్యత్ సూచనలు నూటికి నూరుపాళ్ళు యధార్థం. ఆబా గారు తమ చరమదశ వరకు సాయిబాబా సేవలో ఉనారు. నేను మిమ్మల్ని మన్నించమని కోరుతున్నాను. నేను ఆయనని కీర్తిశేషులు అబా పన్షికర్ అని సంబోథిస్తాను, కారణం ఆయన మనమథ్యన లేరు.

విలువైన ఆ చిత్రపటాన్ని లామినేషన్ చేయించి దానికి చెక్క ఫ్రేము తయారు చేయించాను. 1993 సం.ఒక గురుపూర్ణిమనాడు, వన్ గాన్ లోని మా 'విజ్యోత్' బంగళా లో చిన్న సాయిమందిరంలో దానిని ప్రతిష్టించాము. అప్పటినుంచి మేము మా గురుపూర్ణిమని అక్కడే సామాన్యంగా యింటిలో జరుపుకునే పథ్థతిలోనే జరుపుకుంటాము.

యిది నా స్వంత చిన్న అనుభవం. నాకు కోరిక పుట్టినప్పుడెల్లా షిరిడీ వెడుతూ ఉంటాను. యిప్పుడు నేను పదవీ విరమణ చేసి, సుఖంగా జీవిస్తున్నాను. మేమిప్పుడు బాబాని ఒకటే ప్రార్తిస్తున్నాము. మా పిల్లలకు కూడా సాయిభక్తులే జీవిత భాగస్వాములుగా రావాలని, తార్ఖడ్ కుటుంబంలో లార్డ్ సాయి మీద ప్రేమ, భక్తి అలా నిరంతరం కొనసాగుతూ ఉండాలనీ ప్రార్థిస్తున్నాను.

ఆఖరుగా నేను సాయి భక్తులందరినీ కోరేదేమంటే సాయిబాబా మనకిచ్చిన మహా మంత్రాలయిన 'శ్రథ్థ, సబూరీ, ' అనగా నమ్మకం, సహనం, వీటిని మరవవద్దని. యదార్థంగా వీటికే కట్టుబడివుంటే ఈ రెండు మంత్రాలూ మీ కోరికలను తప్పక నెరవేరుస్తాయి. అపరిమితమైన నమస్కారములతో ఉచితమైన రీతిలో మనమెప్పుడు నిత్యం ప్రేమించే మనసాయికి ఈ క్రింది విథంగా అభివాదములు సమర్పించుకుంటూ ఈ గ్రంథాన్ని ముగించదలచుకున్నాను.
"అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాథిరాజ యోగిరాజ ప్రరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరజ్ కి జై"



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.


Wednesday, August 24, 2011

రచయిత స్వంత అనుభవాలు

0 comments Posted by tyagaraju on 1:56 AM





24.08.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

రచయిత స్వంత అనుభవాలు

ఓం శ్రీ సాయినాథాయనమః

వెలకట్టలేని మా నాన్నగారి అనుభవాలని చదివిన తరువాత, నేను కూడా స్వంతంగా నా అనుభవాలను మూటకట్టుకుని వుండచ్చనే ఆసక్తితో మీరుంటారని నాకు ఖచ్చితంగా తెలుసు. నేనొకసారి ఒక మహిళా భక్తురాలికి ఒక అనుభవాన్ని వివరించాను. మా నాన్నగారి ఆథ్యాత్మిక అనుభవాలలాంటి విలువైన భండాగారం నాకు కలిగి ఉండకపోవచ్చని అందామె. కాని నేను అటువంటి పుణ్యాత్మునికి జన్మించడంవల్ల, ఆయననుంచి వారసత్వంగా లేశమాత్రమైనా పుణ్యాన్ని పొంది ఉండచ్చనీ అంచేత ఈ యుగంలో సాయి భక్తులందరికీ వివరించడానికి యోగ్యమైన కొన్ని అనుభవాలు ఖచ్చితంగా కలిగే ఉంటాయని అంది ఆమె.

ఈ విథంగా నేను ఆ పుణ్యాన్ని వారందరికీ పంచగలను. ఆ మహిళా భక్తురాలు యిచ్చిన ఆ ప్రత్యుత్తరం నన్ను కదిలించడంతో నాదృష్టిలో యింతవరకు నాకు కలిగినవి చిన్నవైనా, అల్పమైనవైనా సరే మీకందరికీ నేను తెలియ చేస్తున్నాను. ఈ విథంగా నేను నా "సాయి ప్ర్రితి" ని నా వైపునించి సాయి సేవగా స్పష్టం చేస్తున్నాను.


నా పూర్తి పేరు వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్. మా పేర్ల వెనుక ఒక చిన్న కథ ఉంది. మా ముత్తాతగారు తన కొడుకులందరికీ మొదటి పేరు చివర "ద్రా' వచ్చేటట్లుగా పెట్టారు. ఈ సిథ్థాంతానికి మూల కారకులు నోబెల్ గ్రహీతయిన కీర్తిశేషులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ తప్ప మరెవరూ కాదు.
యునైటెడ్ కింగ్ డం కి వెళ్ళేముందు ఆయన చౌపాతీ బంగళాలో మా ముత్తాతగారితో ఉన్నప్పుడు జరిగిందిది. ఆ కాలంలో తార్ఖడ్ కుటుంబానికి ఆంగ్లేయుల అచార వ్యవహారాలన్ని బాగా తెలుసును కాబట్టి వారినుంచి తాను తెలుసుకోవాలనె యోచనతో వచ్చారు. రవీంద్రనాధ్ ఠాగూర్ గారికి జ్యోతిష్యం అంటే చాలా యిష్టం. ఆయన అందులో చాలా లోతుగా అథ్యయనం చేశారు. ఆయన మా ముత్తాతగారి "కుండలీ (జాతక చక్రం) వేసి, తార్ఖడ్ వారంతా కూడా లార్డ్ యింద్రనుంచి ఆవిర్భవించారనీ అందుచేత వారంతా (మగవారంతా) ఆ పేరుతోనే గుర్తింపుతో ఉండాలనీ చేప్పారు. ఆ విథంగా కొడుకులకి ఆ విథంగా పేర్లు పెట్టడానికి ఆయన అలా మా ముత్తాతగార్ని ప్రభావితం చేశారు. మా ముత్తాతగారు దానికి ఒప్పుకుని ఉండచ్చు. ఆయన తన కొడుకులకి రామచంద్ర (మా తాతగారు) ధ్యానేంద్ర వగైరా.; మా తాతగారు తన కొడుకులకు సత్యేంద్ర, జ్యోతీంద్ర (మా నాన్నగారు) గా నామకరణం చేశారు. తరువాత జ్యోతీంద్ర తన కొడుకులకి రవీంద్ర (నా అన్నగారు), వీరేంద్ర (నేను). రవీంద్ర తన కొడుకులకి దేవేంద్ర అని, నేను నా కొడుకుకు మహేంద్ర అని పేర్లు పెట్టడం జరిగింది.

నా చిన్నతనం నించీ నేను మా యింట్లో ప్రతి గురువారం సాయంత్రం జరిగే సాయిబాబా ఆరతికి హాజరవుతూ ఉండేవాడిని. ఆ సాంప్రదాయం యిప్పటికీ కొనసాగుతోంది. అదృష్టవశాత్తు నా భార్య కూడా సాయి భక్తురాలు. ఆమె తన 5 వ సంవత్సరం వయసునుంచి, షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకుంటొంది. నేను మొట్టమొదటి సారిగా నాకు 18 సం. వయసప్పుడు షిరిడీని, నా యిద్దరు స్నేహితులు అమర్ భాగ్ తాని, శశి భాటియాలతో దర్శించాను. వివాహం అయిన తరువాత నేను మా అత్తవారి ఫ్లాట్ లో నివసించడం మొదలెట్టాను. నా భార్య 5 సం. వయసులో తన తండ్రిని పోగొట్టుకుంది. ఆడవాళ్ళు యిద్దరే అవడంతో ఒక మగ తోడు అవసరమయింది. మా అత్తగారు, భార్య యిద్దరూ కూడా సాయి భక్తులవడంతో నా సాయి సంస్కారాలకి యెటువంటి ఆటంకం కలగకుండా నిజానికి యింకా యింకా యెక్కువ పెరిగింది.


షిరిడీలో గురు పూర్ణిమ


నాకు బాగా గుర్తున్నంతవరకు, షిరిడీలో గురుపూర్ణిమ ఉత్సవాలకి నేను మా అత్తగారితో కూడా కలిసి వెళ్ళడం ప్రారంభించి ఆ క్రమంలో 18 గురు పూర్ణిమలకి హాజరయాను. గురు పూర్ణిమ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగుతాయని మీకు తెలుసు. అందులో ఒకటి అఖండ పారాయణ, అంటే నిరంతరం 'సాయి సచ్చరిత్ర" ను చదవడం. సాయి భక్తులందరూ తమ తమ పేర్లు యిస్తే ఒక పిల్లవాడి ద్వారా, యధేచ్చగా 54 పేర్లు తెసి, ద్వారకామాయిలో బాబా చిత్ర పటం ముందు 'సాయి సచ్చరిత్ర' లో యెవరు ఏ అథ్యాయం చదవాలో నిర్ణయిస్తారు. అలా ఒక గురు పూర్ణిమనాడు నేను కూడా నా పేరు ఇచ్చాను. నాకు 9 నంబరు కేటాయించబడింది. దీనర్థం నేను 9 వ.అథ్యాయం చదవాలి. యిందులోనే సాయి మీద తార్ఖడ్ కుటుంబంవారి ప్రేమ, భక్తి గురించిన వివరణ ఉంది. అది నాకు మహదానందమయిందంటే నమ్మండి. ద్వారకామాయిలో చదవడం పూర్తయాక నాకు ఒక కొబ్బరికాయ, లార్డ్ సాయి ఫొటో, ప్రసాదంగా లబించింది. ఈ ఫొటొని లామినేషన్ చేయించి, ఫ్రేం కట్టించి మా యింట్లో ప్రతిరోజూ పూజ చేసుకోవడానికి ఉంచాము. ఈ రోజు వరకు నేను పొద్దున్నే మంచం మీదనించి దిగగానే ఈ ఫొటో ముందు నిలబడి నమస్కారం చేసుకుని లార్డ్ సాయిని హేచి దానా దేగా దేవా తుఝా వీసేర నా వ్హావా (ఓ లార్డ్ నేను నిన్నెపుడు మరవకుండా ఉండే, ఇదే వరమివ్వు) అని ప్రార్థిస్తాను.

విజ్యోత్ ఆవిర్భావం


ప్రియమైన పాఠకులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా అతనిలో/ఆమెలో ఒక బలీయమైన కోరికని మోస్తూ ఉంటామని నా అభిప్రాయం. మా నాన్నగారు తనకు ఒక బంగళా, కారు, ఒకస్టొర్ రూం మట్టిపాత్రలన్నీ తినే ఆహార పదార్థాలతో నిండివుండి వీటన్నిటితో తాను కూడా ఒక థనవంతుడిననీ మాకు గుర్తు చేస్తూ ఉండేవారు. ఆయన జీవితం తరువాతి దశలో అవన్నీ మృగ్యమయిపోయాయి. నేను ఆయనకి ఆఖరి సంతానం. అందుచేత భగవంతుని దయతో నా స్వశక్తితో బాగా కష్టపడి పోగొట్టుకున్న సంపదనంతా మరలా సంపాదించాలనే బలీయమైన కోరికని సహజంగా నే మోశాను. బొంబాయిలో స్వంతంగా బంగళా కలిగి ఉండటమంటే అసాథ్యమయిన పని. నా భార్య కూడా ఖర్ లో బంగళాలోనే పెరిగింది. అందు చేత స్వంతంగా ఒక బంగళా ఉండాలనీ, కనీసం వార్థక్యంలోనయినా సుఖంగా జీవిద్దామని మాయిద్దరిదీ ఒకటే కోరిక.

1991 లో మేము వెంగాన్ లో (ముంబాయినుంచి 100 కి.మీ. దూరంలో వెస్ట్రన్ రైల్వే స్టేషన్) 6 గుంటలలో (726 చ.అ.) ఒక ప్లాటు కొన్నాము. నేను నా కంపెనీలో ఋణం తీసుకుని 1960 వెంగాన్ లోఒక బంగళా కట్టుకోగలిగాము. దానికి "విజ్యోత్" అని పేరు పెట్టుకున్నాము. 1960 కి వెనుక తిరిగి చూసుకుంటే నేను పూనా వెళ్ళాను. నా స్కూలు స్నేహితుడు నాకు "లకాకీ' అనే బంగళా చూపించాడు. ఆ బంగళా ప్రముఖ పారిశ్రామిక వేత్తయిన లక్ష్మణరావ్ కాకాసాహెబ్ కిర్లోస్కర్ గారిది. మీరు ఆ పేరుకు వెనక ఉన్న రహస్యం తెలుసుకోవచ్చు. ఆయన పేరులోని మొదటి అక్షరాలు ల--క--కి--, 1959 లో ఆర్థిక యిబ్బందులవల్ల ఖర్ లో ఉన్న మా బంగళాని అమ్మవలసి వచ్చింది. 16 సం.క్రితం లకాకీ ని చూశాక నేనెప్పుడు బంగళా కట్టుకున్నా దానికి 'విజ్యోత్' అని పేరు పెట్టాలనే ఒకే ఆలోచన నాకప్పుడు కలిగింది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Tuesday, August 23, 2011

సంత్.గాడ్గే మహరాజ్ తో అనుభవం

0 comments Posted by tyagaraju on 8:04 AM


23008.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు తార్ఖడ్ కుటుంబం వారి మరొక అద్భుతమైన లీలని తెలుసుకుందాము.

సంత్.గాడ్గే మహరాజ్ తో అనుభవం

ఓం శ్రీ సాయినాథాయనమః

యింతకు ముందు చెప్పినట్లుగా నా జ్ఞాపక శక్తిని విస్తరించుకునే ప్రయత్నం చేసి మహారాష్ట్రలో గొప్ప సాథువయిన గాడ్గే మహరాజ్ గారి గురించి తెలియచేస్తాను. ఆయన ఖార్ లో ఉన్న మా బంగళాకు తరచూ సాయంత్రమప్పుడు తనదైన ప్రత్యేకమయిన దుస్తులతో వస్తూ ఉండి మరలా వేకువజాముననే వెళిపోతూ ఉండేవారు. నేనాయనని స్వయంగా చూశాను. ఆయన రంగుల గుడ్డముక్కలతో కుట్టబడిన వస్త్రాన్ని థరించి తలకి ఒక గుడ్డ ముక్కని కట్టుకునేవారు. ఈ వేషధారణ వల్ల ఆయనని గోధాడీ మహరాజ్ , గొధడీ బాబా అని పిలిచేవారు. ఆయన కాళ్ళకు తోలు చెప్పులు వేసుకుని చేతిలో యెప్పుడూ వెదురు కఱ్ఱని తీసుకుని వెడుతూ ఉండేవారు. వెదురు కఱ్ఱకి అడుగున యినుపతొడుగు, కఱ్ఱ అరిగిపోకుండా బిగింపబడి ఉండేది.


ఆయన లార్డ్ విఠల్ (విష్ణుకి) పరమ భక్తుడు. యెప్పుడూ పాండురంగ...పాండురంగా...అంటూ ఉండేవారు. మహారాష్ట్ర అంతటా తన కీర్తనల ద్వారా సాయి మహిమను చాటిన దాసగణు మహారాజ్ ఆయనని మా కుటుంబానికి పరిచయం చేశారనుకుంటాను. గాడ్గే మహారజ్ గారి దృష్టి ముఖ్యంగా అట్టడుగు బీద ప్రజానీకానికి అన్ని విధాలుగా సహాయం చేద్దామని కేంద్రీకృతమయి ఉండేది. ఆయన వారికి శుభ్రత గురించిన ప్రాథాన్యాన్ని తెలియచేస్తూ తాను స్వయంగా ఆచరించి మహారాష్ట్ర అంతటా వీథులు ఊడ్చి, "'పరిశుభ్రతే దైవం' అనే నినాదంతో వివరిస్తూ ఉండేవారు. అదే, గ్రామాలని అంటు వ్యాథులబారి నుండి సురక్షితంగా ఉంచుతుందని గ్రామస్తులందరికీ ఆయన యిచ్చే సందేశం. ఈ క్రమంలో ఆయన థనవంతుల నుంచి ఆర్థిక సహాయం కూడా తెచ్చుకోగలుగుతూ ఉండేవారు. దానిని సేకరించి ఆయన గ్రామాల్లో అవసరయమయినవారికి పంచుతూ ఉండేవారు. సాయి బాబావారి మహాసమాథి తరువాత మా తాతగారు గాడ్గే మహారాజు సాథువుగారికి బట్టల తానులు విరాళంగా యిస్తూ ఉండేవారు. మా అమ్మగారు తన చేతులతో స్వయంగా 'గొధాడీ' కుట్టి గాడ్గే మహారాజ్ మాయింటికి వచ్చినపుడెల్లా ఆయనకు యిస్తూ ఉండేవారు. ఆయన ఆపుడు మా అమ్మగార్ని దీవించి, దానిని తన స్వంతానికి తీసుకుని వెడుతూ ఉండేవారు. ఆ కాలంలో ఉన్న అప్పటివారు అలా ప్రేమని, వాత్సల్యాన్ని, కురిపిస్తూ ఉండేవారు. ఈ రోజులలో కొనుగొనడం కష్టం.


యింతకు ముందు చెప్పినట్లుగా మానాన్నగారి చేత బలవంతంగా బంగళా కొనిపించడంలో సంత్. గాడ్గే మహరాజ్ కారకులు. ఆయన యెక్కువ సమయం కాలినడకనే అన్ని చోట్లకి తిరుగుతూ ఉండేవారు. ఖార్ లో ఆయన ఒక బంగళాని చూశారు. దానిని మా నాన్నగారు 1923 సం.లో మొత్తం మీద రూ.15,007/- లకి కొన్నారు. ఓల్డ్ ఖార్లో అప్పుడది ఒక్కటే ఏకైక కట్టడంగా ఉండేది. అక్కడినుంచి మేము రైల్వే స్టేషన్, మౌంట్ మారీ చర్చ్ మొదలైనవన్ని మా బంగళా మిద్దె మీంచి యెటువంటి అడ్డంకీ లేకుండా చూడగలిగేవారమని నాకు గుర్తు. యెప్పుడైనా గాడ్గే బాబా వచ్చినప్పుడు మా అమ్మగారితో, ప్రత్యేకమైన రోటీ, 'జ్వారీ' చేయమని ఆదేశించేవారు. ఆమె అలాగే ఆయన కోసం చేసేవారు. మేమంతా ఆ రాత్రికి 'ఝుంకా భకార్' తినేవాళ్ళం. ఆ పదార్థాల యొక్క గొప్ప రుచి మా జ్ఞాపకాలలో యిప్పటికీ ఉందంటే నమ్మండి. రాత్రి భోజనము ఆయిన తరువాత గాడ్గే బాబా సాథువు గారు, తాను వివిథ గ్రామాలకు చేసిన పాదయాత్రలలోని అనుభవాలన్నీ కలిపి మాకు వివరిస్తూ ఉండేవారు. గాడ్గే బాబా నిస్సందేహంగా సామాన్యమయిన వ్యక్తి కాదు. ఆయన భగవంతుని మరొక దూత. మా నాన్నగారు ఆయనతో కూడా పండరీపురం వెళ్ళినపుడు మా నాన్నగారికికలిగిన దివ్యమైన అనుభవాన్ని మీకిప్పుడు వివరిస్తాను.

గాడ్గే బాబా పుణ్యక్షేత్రమయిన పండరీపూర్ కి యెప్పుడూ యాత్రకి వెడుతూ ఉంటారు. ఆయన పాండురంగనికి నిజమైన భక్తుడు. ఆయన తన ఖాళీ సమయంలో పాండురంగా...పాండురంగా...అని ఆయన నామ జపం యెప్పుడూ చేస్తూ ఉండేవారు.ఒకసారి మా నాన్నగారు ఆయనని ఆయన జీవితంలో యెప్పుడయినా లార్డ్ పాండురంగని కలుసుకున్నారా అని అడిగారు. గాడ్గే బాబా మా నాన్నగారిని తనతో కూడా పుణ్యక్షేత్రమయిన పండరీపూర్ కి రమ్మన్నారు. ఆయన మా నాన్నగారితో, సౌఖ్యవంతమయిన బంగళాలో ఉండేటటువంటి అన్ని సుఖాలకు దూరంగా అక్కడ ఒక యాత్రికునిలా ఉండాలని చెప్పారు. అప్పుడు మా నాన్నగారు గాడ్గే బాబా సాథువుతో కలిసి పండరీపురానికి రెండవసారి ప్రయాణం కట్టారు.




చంద్రభాగా నదీ తీరంలో ఉన్న యిసుకలో వారొక గుడారంలో బస చేశారు. రోజంతా ఆయన మహరాజ్ తో కూడా తిరుగుతూ, ఆయన శుభ్రపరిచే కార్యక్రమాలు యెలా చేస్తున్నారో యింకా ఆయన పీడిత ప్రజానీకానికి యిచ్చే సలహాలు, వారంతా ఆయన చుట్టూ గుమిగూడి ఆయన చేసే జ్ఞానోపదేశాలని ఓపికగా వినడం యివన్నీ ప్రత్యక్షంగా చూశారు. సంత్.గాడ్గే మహరాజ్ చేసే సామాజిక కార్యక్రమాల మీద మా నాన్నగారికి చక్కని అవగాహన వచ్చింది. సాయంత్రానికి వారు తమ గుడారానికి తిరిగి వచ్చారు. గుడారంలోపల మూడు పక్కలు, ప్రతీదాని మీద ఒక కంబళీ (నలుపురంగుతో) తో వేయబడి, గుడారం మథ్యలో ఒక కిరోసిన్ లాంతరు వేలాడుతూ ఉండటం గమనించారు. గాడ్గే బాబా మా నాన్నగారిని విశ్రాంతి తీసుకోమని, తాను బయటకు వెళ్ళి (గ్రామంలో దొరికే ప్రత్యేకమయిన అహార పదార్థం) తినడానికి 'ఝంకా భకార్' తెస్తానని చెప్పారు. మా నాన్నగారికి తెలుసుకోవాలనే కోరికతో ఆయనని ఖాళీగా ఉన్న మూడవ పక్క గురించి అడిగారు. గాడ్గే మహరాజ్ తాను చెప్పడం మరచాననీ, ఆ రాత్రికి తనకొక అతిథి వస్తాడనీ రాత్రికి ఉండి, ఉదయానికి ముందే వెళ్ళిపోతాడనీ చెప్పారు. ఆ అతిథి తమకు యెటువంటి యిబ్బందీ కలిగించడనీ చెప్పారు. తానెప్పుడు పండరీపూర్ వచ్చినా ఈ అతిథి రాత్ర్తికి తనతో కూడా ఉంటాడనీ చెప్పారు. యిది చెప్పి గాడ్గే మహరాజ్ గుడారం నుంచి బయటికి వెళ్ళారు. గుడారంలో త్వరగా చీకటి పడింది, అలాగే ఉష్ణొగ్రత కూడా పడిపోయింది. మా నాన్నగారు కునికిపాట్లు పడటం మొదలెట్టి నిద్రపోయారు. మా నాన్నగారికోసం 'ఝంకా భకార్' తెచ్చిన గాడ్గే బాబా గారి పిలుపుతో మానాన్నగారు మేలుకొన్నారు. తాను తన అతిథితో అప్పటికే రాత్రి భోజనం చేసేశానని, మా నాన్నగారిని క్షమించమని చెప్పి, ఆయనకి చాలా ఆకలిగా ఉండవచ్చనీ భోజనం చేసేయమని చెప్పారు. ఈ లోపులో తాను నది ఒడ్డున తిరిగి వస్తానని చెప్పారు.

మా నాన్నగారు అతిథివైపు చూశారు. అతను 'ధోతారూ (ధోవతీ) కట్టుకుని పైన యెటువంటి ఆచ్చాదన లేకుండా ఉన్నాడు. అతని శరీరం కారు నలుపుగా భిల్ల జాతివాళ్ళలా ఉండి అతని కళ్ళు ఎఱ్ఱగా మండుతున్న బొగ్గులా ఉన్నాయి. అతని భుజం మీద కంబళీ ఉంది. బాగా ఆశ్చర్యకరమైన విషయమేమంటే గుడారం మొత్తం గాఢమైన కస్తూరి సువాసనతో నిండిపోయింది. మా నాన్నగారు యింతకు ముందెన్నడూ అటువంటి సువాసనని ఆఘ్రాణించలేదు. మా నాన్నగారు యింతకుముందెన్నడు ఆఘ్రాణించని గాఢమైన కస్తూరి సువాసనతో గుడారం మొత్తం నిడిపోయింది. వారిద్దరూ గుడారం నించి వెళ్ళిపోయారు. మా నాన్నగారు మథురమైన భోజనాన్నితినడం పూర్తి చేశారు. అటువంటి మథురమైన ఆహారాన్ని ఆయనెప్పుడూ రుచి చూడలేదు. కాకి అరుస్తున్న పెద్ద శబ్దానికి ఆయన పొద్దున్నే లేచారు. గాడ్గే బాబా గారు అప్పటికే లేచారు. ఆయన మా నాన్నగారితో నోటిని నీళ్ళతో పుక్కిలించి, ఆయన కోసం ఉంచిన మట్టికుండలో ఉన్న వేడి టీ ని త్రాగమన్నారు. మా నాన్నగారు అతిథి గురించి ఆరా తీశారు. గాడ్గే బాబా ఆయన అప్పటికే టీ తాగి వెళ్ళిపోయారనీ గుడి తెరిచేముందే ఆయన తన కర్తవ్యనిర్వహణకోసం అక్కడ ఉండాలని చెప్పారు. మా నాన్నగారు కొంచెం అమాయకంగా ఆ అతిథిని తనకెందుకు పరిచయం చేయలేదని గాడ్గే బాబాని అడిగారు. గాడ్గే బాబా అతనిని పండరీపూ ర్ లొ పరిచయం చేయాల్సిన అవసరం లేదనీ మా నాన్నగారు అతనిని గుర్తించి ఉంటారని అనుకున్నానని, మా నాన్నగారితో అన్నారు. మా నాన్నగారు అయనతో రాత్రి తాను అతనిని సరిగా చూడలేదనీ, ఉదయాన్నే మహరాజ్ అతను వెళ్ళిపోయేముందు తనకు పరిచయం చేస్తారనుకున్నానని అన్నారు. అప్పుడు మహరాజ్ మానాన్నగారితో ఆ అతిథి 'పండర్ పూర్' లార్డ్ విఠోబా తప్ప మరెవరూ కాదని చెప్పారు. ఆయన మా నాన్నగారిని, ఆయన బంగళాలో తనకి కలత బెట్టిన ప్రశ్నకు సమాథానం లబించిందా అని అడిగారు. యిపుడు మా నాన్నగారు ఆ మథురమైన, మంత్రముగ్థుడిని చేసిన ఆ కస్తూరి సువాసన ఆయననాక్రమించింది. కొంతకాలంగా ఆ కస్తూరి సువాసన తనని వెంబడించి లార్డ్ విఠొబా ఉన్నారనే భావం తనకి కలుగ చేస్తూ ఉండేదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. సంత్.గాడ్గే బాబా ఒక మనొజ్ఞమైన అనుభవాన్ని యిచ్చారు. కాలం గడిచేకొద్దీ ఆయన వృధ్ధాప్యంలోకి వెళ్ళారు. ఆయన మా బంగళాకు ఆఖరి రాక కూడా మరచిపోలేనిది. ఆయన యెప్పుడు తన కంబళీ, కఱ్ఱ వీటితో వస్తూఉండి వెళ్ళిపోయే టప్పుడు వాటిని కూడా తన వస్తువులతో పాటుగా తీసుకుని వెడుతూ ఉండేవారు. ఆయన ఆఖరుసారి వచ్చినపుడు తనతో కఱ్ఱ తీసుకుని వెళ్ళడం మరచిపోయారు. నిజానికి ఆయన తనతో తీసుకుని వెళ్ళడం మరచిపోలేదు, ఉద్దేశ్యపూర్వకంగానే తన గుర్తుగా దానిని వదిలేశారు. నేనిది యెందుకు చెబుతున్ననంటే ఆయన నడక తీరు కఱ్ఱ సహాయం లేకుండా నడవలేరన్నట్లుగా ఉండేది. నా తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకుని ఆయన ఆచూకీ తెలుసుకుని ఆయన కఱ్ఱని ఆయనకు తిరిగి యిచ్చేద్దామనుకున్నారు. కాని ఆయనని వెతకడం సాథ్యం కాలేదు. కారణం నిజంగా చెప్పలంటే ఆయన మహారాష్ట్రలో యెప్పుడూ సంచారం చేస్తూ ఉండే సాథువు. అట్టడుగు ప్రజానీకానికి యెప్పుడూ సేవ చేస్తూనే ఉండేవారు. నా తలిదండ్రులు ఆ కఱ్ఱని యెంతో పవిత్రమైన వస్తువుగా భావించి దానిని చందనపు మందిరం దగ్గరలో ఉంచారు. నా తల్లిదండ్రులు ఆయన చిత్ర పటాన్ని ఒకటి కొని దానికి కూడా ప్రతీరోజూ పూజలు చేయడానికి చందనపు మందిరంలో ఉంచారు. ఆయన కూడా వారికొక దేవతని, మీరు కూడా అభినందిస్తారు.

ప్రియ పాఠకులారా ఈ సంఘటన కూడా మీకు ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని నాకు తెలుసు. నేను మరొక్కసారి అనుకునేదేమంటే ఈ రోజున మనకి అటువంటి సాథువులు గాని, దేవ దూతలుగాని మన మథ్య లేరు, యింకా సాథువులకు నిస్వార్థ సేవ చేసే అంకిత భక్తుల ఉనికి కూడా మనకి తక్కువగానే ఉంది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Monday, August 22, 2011

శ్రావణ సోమవారము - ఆగష్టు 1965

0 comments Posted by tyagaraju on 1:11 AM

22.08.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి ఝయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు


శ్రావణ సోమవారము - ఆగష్టు 1965

ఓం శ్రీ సాయినాథాయ నమః

1918 నుంచి1965 వరకు 47 సంవత్సరాలు పూర్తిగా సుదీర్ఘమయిన వ్యవథి.

మా నాన్నగారు ఈ సుదీర్ఘమయిన ప్రయాణం యెలా చేశారో, అదంతా మీకు నేను చెప్పదలచుకోలేదు.
ఈ పుస్తకం రాయడానికి గల అతి ముఖ్యమయిన ఉద్దేశ్యం మా నాన్నగారి యొక్క షిరిడీ సాయిబాబాతో ఆయన అనుభవాలని మీకు వివరించడానికి, దాని ద్వారా యెవరయినా లార్డ్ సాయిపై తమ ప్రేమను భక్తిని వ్యక్తీకరించుకోగలగడానికి. ఈ సమయంలోనే ఆయనకు మా అమ్మగారితో వివాహమయింది. ఆమెది ముంబాయిలోని కల్వె మాహిం. ఆవిడ పేరు లక్ష్మీదేవికెల్వెకర్ . యిదే సమయంలో నా తల్లిదండ్రులకు మహారాష్ట్రలో గొప్ప సాథువయిన గాడ్గే మహరాజ్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన మా నాన్నగారితో కుటుంబం కోసం ఒక బంగళా కొనుక్కోమని నిర్దేశించారు. ఆ విథంగా మా నాన్నగారు ఖార్ లో (ఖార్ పార్లీ రోడ్, 51ఏ లో ఉన్న) బంగళా కొని, టాటా బ్లాక్స్ లో ఉన్న యింటికి 1923 లో వీడ్కోలు చెప్పారు. నేను చెపుతున్న వివరణలో గాడ్గే మహరాజ్ మహాత్ముల వారి ప్రస్తావన వచ్చింది కనుక ఆయన గురించిన కొన్ని వాస్తవాలని నా తరువాతి అథ్యాయంలో చెబుతాను. మా నాన్నగారు తన వివాహం అయిన తరువాత మా అమ్మగారిని ఒక్కసారి మాత్రమే షిరిడీకి తీసుకువెళ్ళారు. ఆయన తన ముందు జీవితం లార్డ్ సాయితో సాన్నిహిత్యం గురించి అంతా వివరంగా ఆమెకి చెప్పారు. మా అమ్మగారు కూడా ఆథ్యత్మికత ఉన్నామె. దేవుడంటే భయం ఉన్న అటువంటి తల్లిదండ్రులున్నందుకు నేను చాలా అదృష్టవంతుడినని నాకు నేను భావించుకుంటున్నాను. ఈ 21 వ శతాబ్దంలో అరుదైన 'మంచి సంస్కారాన్నీ నేను వారినుంచి జీర్ణించుకున్నాను. మా నాన్నగారు మంచి ఆరోగ్యంగా ఉండే మనిషి. ఆయన ఏ సమయంలోను జబ్బు పడటం నేను చూడలేదు. ఆయన సామాన్యమయిన దగ్గు, జలుబుతో కూడా బాథపడలేదు. ఆయనకు అయిదుగురు కుమార్తెలు, యిద్దరు కొడుకులు. ఆయన తన అయిదుగురు కూతుళ్ళకి వివాహాలు చేసి తన విథిని నిర్వర్తించారు. కాని తన యిద్దరు కొడుకుల వివాహాన్ని చూడలేకపోయారు.

అది 1965 జూలై నెల. మా నాన్నగారికి తీవ్రమయిన బ్రాంకైటిస్ కి తోడు నడుము కూడా పట్టేసి సుస్తీ చేసింది.
దాంతో ఆయన మంచం మీదే ఉండాల్సి వచ్చింది. మేమంతా కూడా అది ముసలితనం లక్షణాలనుకున్నాము. నేను వి జె టి ఐ యింజనీరింగ్ కాలేజీలో బి.ఈ. ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. మా అన్నయ్య రవీంద్ర, మా నాన్నగారు పదవీవిరమణ చేసిన టెక్స్ టైల్ మిల్లులోనే పని చేస్తున్నాడు. ఆ రోజుల్లో మా అమ్మగారు, హైపర్ టెన్షన్, చక్కెర వ్యాథి, ఆస్త్మా లాంటి అన్ని రకాల జబ్బులతోనూ బాథపడుతూ ఉండేవారు. ఒకోసారి ఆవిడకి యెంత సీరియస్ గా ఉండేదంటే ఆమెకి మేము ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చేది. నిజానికి మేము యింట్లో యెప్పుడూ ఒక ఆక్సిజన్ సిలెండర్ ని ఉంచేవాళ్ళం. మా నాన్నగారు విపరీతమయిన నొప్పితో బాథ పడుతున్నారు. వైద్యులు ప్రాథమికంగా అది లుంబాగో అని నిర్థారించారు. నేను ఆయనకి వింటొజెన్ గాని మహానారాయణ తైలం గాని రాస్తూ ఉండేవాడిని. అది కొంచెం ఆయనకి ఉపశమనాన్నిస్తూ ఉండేది. మేము ఆయనకి సేవ చేయవలసి రావడంతో ఆయన చాలా విచారిస్తూ ఉండేవారు. ఆయనెప్పుడూ మమ్మల్ని కనీసం కాళ్ళు కూడా నొక్కమని అడగలేదు. అందుచేత ఆయన అలా మంచానికి అతుక్కుపోయి జబ్బు పడటంతో చాలా బాథ పడేవారు. ఒక సారి ఆయన తనావ్యాథినుండి బయట పడగలనా అని నన్నడిగారు. బాబాకి, అమితమైన బాథలో ఉన్నానని ఒక్కసారి పిలవమని ఆయనే రక్షించగలరని నేను ఆయనకు చెప్పినట్లు గుర్తు. ఆయన పరిస్థితి క్షీణించింది. డా.జోషీ, ఆయనను శాంతాక్రజ్ లో ఉన్న నానావతీ ఆస్పత్రిలో చేర్పించమని సలహా యిచ్చారు. మా అమ్మగారు ఆయనకు సేవ చేయడంలో పూర్తిగా తన విథిని నిర్వర్తిస్తూ సేవ చేస్తూ ఉండేవారు. మా అమ్మగారు తనే ఒక పేషెంటునన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయారు. ఆవిడ పొద్దున్నే ఆయనకు టీ, బ్రేక్ ఫాస్ట్ తీసుకువెడుతూ ఉండేవారు. మరలా సాయంత్రం భోజనం పట్టుకెడుతూ ఉండేవారు. నేను కాలేజీ నుంచి రాగానే ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆమెని అడుగుతూ ఉండేవాడిని. ఆయనలో అంతగా మార్పు లేదనీ, కాని ఆయన తన స్మ్రృతులు ఏమీ కోల్పోలేదనీ చెప్పేవారు. ఆయన ఒక వారం ఆస్పత్రిలో ఉన్నారనుకుంటాను. మా అమ్మగారు ఆయనకు ప్రతిరోజూ ఉదయాన్నే బాబా యిచ్చిన పవిత్రమయిన ఊదీని టీలో కలిపి యిస్తూ ఉండేవారు. మరాఠీ కాలండర్ ప్రకారం శ్రావణ మాసంలో ఆగష్టు 16 సోమవారం వచ్చింది. ప్రతి శ్రావణ సోమవారాలలో సూర్యాస్తమయానికి ముందే మేము భోజనం చేస్తూ ఉంటాము కనక మా అమ్మగారు నా అన్నతోనూ, నాతోనూ తొందరగా యింటికి తిరిగి రమ్మని చెప్పారు. నేను మధ్యాహ్న్నం కాలేజీ నుంచి వచ్చాను. ఆస్పత్రికి వెళ్ళేముందు ఆ రోజు చాలా క్లిష్టమయిన రోజని చెప్పారు. మీ దాదాకి ఆరోజు కనక గండం గడిస్తే ఆయన మరొక సంవత్సరం బ్రతుకుతారని చెప్పారు. నేనావిడని అలా యెందుకు చెబుతున్నావని అడిగాను. అందుకావిడ సమాథానమిస్తూ తార్ఖడ్ కుటుంబం లోని మగవాళ్ళందరికీ శ్రావణ సోమవారం దురదృష్టకరమైన రోజనీ చాలామంది మగవారు ఆ రోజుననే మరణించారని తన అత్తగారు చెప్పారన్నారావిడ.

యిప్పుడామె ఆస్పత్రికి వెళ్ళేసరికి ఏం జరిగింది? ఆవిడ సుమారు 3.30 కి తనతో కూడా తీసుకు వెళ్ళే థర్మాస్ ప్లాస్కులోంచి ఆయనకి ఒక కప్పు టీ యిచ్చారు. మా నాన్నగారు టీ కి బానిస. సుమారు 4 గంటలకి ఆయనకి కొంచెం నయమనిపించింది. మరొకసారి టీ యిమ్మని మా అమ్మగారిని అడిగారు. మా అమ్మగారు ఆయనతో అరగంట క్రితమే టీ యిచ్చాననీ ఆ రోజు శ్రావణ సోమవారం కాబట్టి తొందరగా యింటికి వెళ్ళాలని చెప్పారు. 5 గంటలకి టీ యిచ్చి యింటికి వెడతానని చెప్పారు. కానీ మా నాన్నగారు తను ఏదో చూస్తున్నాననీ అది సరిగా స్పష్టంగా లేదనీ టీ యివ్వవలసిందే అని పట్టు పట్టారు. మా అమ్మగారు ఆందోళన పడవద్దని, ఆయన చేతిలో తులసి మాలను ఉంచుతాననీ బాబాను ప్రార్థించమనీ చెప్పారు.



ఆమె ఆయన నుదిటిమీద పవిత్రమైన ఊదీని రాశారు. ఆయన ఒక గుక్క టీ తాగగానే మా అమ్మగారితో తనను యెవరో పిలుస్తున్నారనీ, కాని మొహం స్పష్టంగా చూడలేకపోతున్నాననీ ఆవ్యక్తి యెవరో నిర్థారించుకోవాలని అన్నారు.
గదిలో మనమిద్దరమే ఉన్నాము తులసిమాలతో బాబా జపం చేయమని మా అమ్మగారు ఆయనతో చెప్పారు. ఆయన బాబా నామం మెల్లగా అనుకోవడం మొదలెట్టారు. కొంతసేపు ఆయన మొహం కాంతివంతంగా మారింది. నెప్పితో ఉన్న వ్యథ పోయింది. "బాబా నేను వస్తున్నాను (బాబా మీ ఆలో) అంటూ యించుమించు గట్టిగా అన్నారు. యిదే ఆయన ఆఖరి మాటలు తరువాత ఆయన నిర్జీవమయిపోయారు. ఇది ఆయన చరమాంకం.

ఆ సమయంలో ఆయన బాబాని చూసి వుండచ్చని నేను అనుకుంటున్నాను. యెటువంటి మరణం ఆయనది. ఆందరూ చెప్పేదేమిటంటే ప్రతి ప్రాణి శరీరం నించి ప్రాణం (ఆత్మ) వదలి వెళ్ళేముందు చాలా బాథ పడుతుందని. యేమయినప్పటికి మా నాన్నగారు "బాబా నేను వస్తున్నాను" అంటూ చనిపోయారు. ఈ విథంగా బాబా తనతో భావూని తీసుకు వెళ్ళారు. ఒంటరిగా యింటికి వచ్చిన మా అమ్మగారి థైర్యానికి మెచ్చుకున్నాను. ఆవిడ, మీ దాదా స్వర్గానికి వెళ్ళారు అని చెప్పారు. అందరికీ తెలియపరచి ఆయన అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేయమని చెప్పారు. నేను స్కూలులో చదువుకునేటప్పుడు "మరనాతా ఖరోఖరా జగ జగాతే" (యెవరైనా వాస్తవంగా జీవించే జీవితం వారి మరణంలోనే) అనే శీర్షికతో మాకొక పాఠం ఉందని నాకు గుర్తు. దాదా నూటికి నూరు పాళ్ళు ఆపేరును ఋజువు చేశారు. మా అమ్మగారికి నిజానికి ఆవేశం యెక్కువ. కాని ఆమె ఒక్క కన్నీటిబొట్టును కూడా రాల్చలేదు. అటువంటి అపూర్వమైన చావు దృశ్యాన్ని చూసి ఆవిడ అతి దుఃఖంలో మునిగిపోయి ఉండచ్చు లేక ఆరోజున కన్నీరు కార్చకూడదని బాబావారి ఖచ్చితమైన ఆదేశాలయినా అయి ఉండచ్చు. అలా మా అమ్మమ్మగారి సిథ్ఠాంతం ఆ శ్రావణ రోజు (హిందువుల నెల) ఆగష్టు, 16, 1965 న నిజమయింది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List