

ఓం సాయి శ్రీ సాయి ఝయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

ఓం శ్రీ సాయినాథాయ నమః
1918 నుంచి1965 వరకు 47 సంవత్సరాలు పూర్తిగా సుదీర్ఘమయిన వ్యవథి.


అది 1965 జూలై నెల. మా నాన్నగారికి తీవ్రమయిన బ్రాంకైటిస్ కి తోడు నడుము కూడా పట్టేసి సుస్తీ చేసింది.
దాంతో ఆయన మంచం మీదే ఉండాల్సి వచ్చింది. మేమంతా కూడా అది ముసలితనం లక్షణాలనుకున్నాము. నేను వి జె టి ఐ యింజనీరింగ్ కాలేజీలో బి.ఈ. ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. మా అన్నయ్య రవీంద్ర, మా నాన్నగారు పదవీవిరమణ చేసిన టెక్స్ టైల్ మిల్లులోనే పని చేస్తున్నాడు. ఆ రోజుల్లో మా అమ్మగారు, హైపర్ టెన్షన్, చక్కెర వ్యాథి, ఆస్త్మా లాంటి అన్ని రకాల జబ్బులతోనూ బాథపడుతూ ఉండేవారు. ఒకోసారి ఆవిడకి యెంత సీరియస్ గా ఉండేదంటే ఆమెకి మేము ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చేది. నిజానికి మేము యింట్లో యెప్పుడూ ఒక ఆక్సిజన్ సిలెండర్ ని ఉంచేవాళ్ళం. మా నాన్నగారు విపరీతమయిన నొప్పితో బాథ పడుతున్నారు. వైద్యులు ప్రాథమికంగా అది లుంబాగో అని నిర్థారించారు. నేను ఆయనకి వింటొజెన్ గాని మహానారాయణ తైలం గాని రాస్తూ ఉండేవాడిని. అది కొంచెం ఆయనకి ఉపశమనాన్నిస్తూ ఉండేది. మేము ఆయనకి సేవ చేయవలసి రావడంతో ఆయన చాలా విచారిస్తూ ఉండేవారు. ఆయనెప్పుడూ మమ్మల్ని కనీసం కాళ్ళు కూడా నొక్కమని అడగలేదు. అందుచేత ఆయన అలా మంచానికి అతుక్కుపోయి జబ్బు పడటంతో చాలా బాథ పడేవారు. ఒక సారి ఆయన తనావ్యాథినుండి బయట పడగలనా అని నన్నడిగారు. బాబాకి, అమితమైన బాథలో ఉన్నానని ఒక్కసారి పిలవమని ఆయనే రక్షించగలరని నేను ఆయనకు చెప్పినట్లు గుర్తు. ఆయన పరిస్థితి క్షీణించింది. డా.జోషీ, ఆయనను శాంతాక్రజ్ లో ఉన్న నానావతీ ఆస్పత్రిలో చేర్పించమని సలహా యిచ్చారు. మా అమ్మగారు ఆయనకు సేవ చేయడంలో పూర్తిగా తన విథిని నిర్వర్తిస్తూ సేవ చేస్తూ ఉండేవారు. మా అమ్మగారు తనే ఒక పేషెంటునన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయారు. ఆవిడ పొద్దున్నే ఆయనకు టీ, బ్రేక్ ఫాస్ట్ తీసుకువెడుతూ ఉండేవారు. మరలా సాయంత్రం భోజనం పట్టుకెడుతూ ఉండేవారు. నేను కాలేజీ నుంచి రాగానే ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆమెని అడుగుతూ ఉండేవాడిని. ఆయనలో అంతగా మార్పు లేదనీ, కాని ఆయన తన స్మ్రృతులు ఏమీ కోల్పోలేదనీ చెప్పేవారు. ఆయన ఒక వారం ఆస్పత్రిలో ఉన్నారనుకుంటాను. మా అమ్మగారు ఆయనకు ప్రతిరోజూ ఉదయాన్నే బాబా యిచ్చిన పవిత్రమయిన ఊదీని టీలో కలిపి యిస్తూ ఉండేవారు. మరాఠీ కాలండర్ ప్రకారం శ్రావణ మాసంలో ఆగష్టు 16 సోమవారం వచ్చింది. ప్రతి శ్రావణ సోమవారాలలో సూర్యాస్తమయానికి ముందే మేము భోజనం చేస్తూ ఉంటాము కనక మా అమ్మగారు నా అన్నతోనూ, నాతోనూ తొందరగా యింటికి తిరిగి రమ్మని చెప్పారు. నేను మధ్యాహ్న్నం కాలేజీ నుంచి వచ్చాను. ఆస్పత్రికి వెళ్ళేముందు ఆ రోజు చాలా క్లిష్టమయిన రోజని చెప్పారు. మీ దాదాకి ఆరోజు కనక గండం గడిస్తే ఆయన మరొక సంవత్సరం బ్రతుకుతారని చెప్పారు. నేనావిడని అలా యెందుకు చెబుతున్నావని అడిగాను. అందుకావిడ సమాథానమిస్తూ తార్ఖడ్ కుటుంబం లోని మగవాళ్ళందరికీ శ్రావణ సోమవారం దురదృష్టకరమైన రోజనీ చాలామంది మగవారు ఆ రోజుననే మరణించారని తన అత్తగారు చెప్పారన్నారావిడ.
యిప్పుడామె ఆస్పత్రికి వెళ్ళేసరికి ఏం జరిగింది? ఆవిడ సుమారు 3.30 కి తనతో కూడా తీసుకు వెళ్ళే థర్మాస్ ప్లాస్కులోంచి ఆయనకి ఒక కప్పు టీ యిచ్చారు. మా నాన్నగారు టీ కి బానిస. సుమారు 4 గంటలకి ఆయనకి కొంచెం నయమనిపించింది. మరొకసారి టీ యిమ్మని మా అమ్మగారిని అడిగారు. మా అమ్మగారు ఆయనతో అరగంట క్రితమే టీ యిచ్చాననీ ఆ రోజు శ్రావణ సోమవారం కాబట్టి తొందరగా యింటికి వెళ్ళాలని చెప్పారు. 5 గంటలకి టీ యిచ్చి యింటికి వెడతానని చెప్పారు. కానీ మా నాన్నగారు తను ఏదో చూస్తున్నాననీ అది సరిగా స్పష్టంగా లేదనీ టీ యివ్వవలసిందే అని పట్టు పట్టారు. మా అమ్మగారు ఆందోళన పడవద్దని, ఆయన చేతిలో తులసి మాలను ఉంచుతాననీ బాబాను ప్రార్థించమనీ చెప్పారు.




సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment