

27.09.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయితో సాయి బా ని స అనుభవాలలో 13వ అనుభవాన్ని తెలుసుకుందాము. సాయి బా ని స అనుభవాలను చదివిన ప్రతీవారికి మనకు కూడా యిటువంటి అనుభూతులు కలిగితే యెంత బాగుండును అని అనుకోవడం సహజం.
బాబాతో సాయి బా ని స అనుభవాలు 13
సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి 22, 42 వ. అధ్యాయాలలో సకల జీవరాసులలోనూ భగవంతుడిని చూడమని చెప్పినారు. లక్ష్మీ బాయిషిండే, ఒక రొట్టెముక్కను పెట్టి ఆకలిని తీర్చిన శునక రూపంలో వచ్చింది తానేనని చెప్పారు. యెవరయితే ప్రాణులన్నిటిలోనూ తనని చూసి వాటి ఆకలిని తీరుస్తారో వారే తన నిజమైన భక్తులని చెప్పారు. ఆయన చెప్పిన బోధనలు సత్యమని నిరూపించేందుకు నాకు కూడా రెండు అనుభవాలు కలిగాయి. వాటిని నేను మీకిప్పుడు వివరిస్తున్నాను.
బాబాకి భోజనము పెట్టడానికి ద్వారకామాయికి వెళ్ళుతూ దారిలో ఆకలితో ఉన్న ఒక కుక్కకి రొట్టెముక్క పెట్టి ద్వారకామాయిలోబాబాని దర్శించుకున్నప్పుడు బాబా అన్న మాటలు "లక్ష్మీ, ఆకలితో ఉన్న ఆకుక్కకు రొట్టె పెట్టినావు, ఆ రొట్టె నాకే చెందినది నా ఆకలి తీరినది." యెవరయితే సకల జీవరాసిలోనూ భగవంతునిచూసి వాటి ఆకలిని తీరుస్తారో వారు నాకు నిజమైన భక్తులని" బాబా చెప్పినారు.
అది 1991 వ సంవత్సరము దీపావళీ పండగ రోజు. ఆ రోజు సాయంత్రము నేను నా భార్య ఒక పురోహితుడిని పిలిచి నాయింటి మొదటి అంతస్తులో ఉన్న పూజా గదిలో లక్ష్మీ పూజ చేయ సాగాము. పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు. కాని నా మనసంతా సాయిమీదే లగ్నమయి ఉంది. లక్ష్మీ పూజ పూర్తి అయ్యేలోపులో శ్రీ సాయి ఏదో ఒక రూపములో వచ్చి నన్ను నా భార్యను ఆశీర్వదించినా నేను సంతోషిస్తాను అని తలిచాను. శ్రీ సాయి ఒక స్నేహితుడి రూపములో గాని, నా బంధువు రూపములో గాని వచ్చి మమ్మలిని ఆశీర్వదిస్తారని ఊహించుకోసాగాను. పూజలో లక్ష్మీ దేవికి హారతి ఇస్తున్న సమయంలో నా కాళ్ళకు మెత్తటి బట్ట తాకిన అనుభూతిని పొందాను. నేను కింద నా కాళ్ళవైపు చూసుకున్నాను, నాకు ఆశ్చర్యము కలిగింది. ఒక పెద్ద పరిమాణములో ఉన్న బోదురు కప్ప నా పాదాలను తాక సాగినది.

అది 1991 వ సంవత్సరము బక్రీదు పండగ రోజు. ఆఫీసుకు సెలవు ఉండటము వలన మధ్యాహ్న్నము పన్నెండు గంటలకు యింటిలో భోజనము చేసి తాంబూలము వేసుకుని వీధిలోకి వచ్చినాను. నా యింటి గేటుముందు నాలుగు అడుగుల యెత్తు ఉన్న ఒక తెల్లటి మేక కనపడింది ఆ మేకకు తెల్లటి గెడ్డము కూడా ఉన్నది.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment