
04.08.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు శుభాశీస్సులు
ఈ రోజు తార్ఖడ్ వారి మరియొక అనుభూతిని గురించి తెలుసుకుందాము.
షిరిడీలో కుండపోతవానలో మృత్యువునెదుర్కొనుట
ప్రియ సాయి బంథు పాఠకులారా, మీరు ఒక్కసారయినా షిరిడీకి వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను. యిప్పటి షిరిడీకి, యింతకుముందు సవత్సరాలలో మా నాన్నగారు వెడుతూండేటప్పటి షిరిడీకి చాలా మార్పు వచ్చింది. మీరు షిరిడీలో ప్రవేశించదానికి కోపర్గావ్ పొలిమేరకు వచ్చినపుదు అక్కడ ఒక వాగు ఉంది. షిరిడీ గ్రామంలోకి రావాలంటే ఆ వాగును దాటాలి. సంవత్సరంలో యెక్కువ సార్లు వాగు యెండిపోయి ఉంటుంది. వర్షాకాలంలో మాత్రమే వాగు వేగంగా ప్రవహిస్తూ ఉండటం చూడచ్చు. యిప్పుడు ప్రథాన రహదారికి దానిమీద చిన్న వంతెన ఉంది. ఆ రోజులలో గ్రామస్థులు ఉదయాన్నే తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి యీ వాగు ఒడ్డుకు వస్తూ ఉండేవారు. అందుచేత, అక్కడ చాలా పొదలు ఉండటంతో సూర్యోదయానికి ముందు ఆ ప్రదేశం అనువుగా ఉండేది. రోడ్డుమీద జనసంచారం కూడా ఉండేది కాదు.


ఈ విథంగా ఆయన ఆ పరిస్థితిలో ఉండగా వాగు ఒడ్డుకు అవతలివైపునుంచి యెవరో గట్టిగా అరుస్తూ ఉండటం విన్నారు. ముందర ఆయన ఆ అరుపులని పట్టించుకోలేదు. ఆ వ్యక్తి యెక్కడ ఉన్నాడో చూద్దామని ప్రయత్నించారు గాని చీకటిగా ఉండటం వల్ల యెవరినీ చూడలేకపోయారు. ఆ మనిషి ఒడ్డు దగ్గరనుంచి పరుగెత్తుకుని వెళ్ళిపొమ్మని అరుస్తున్నట్లుగా అర్థమయింది. అతను మరాఠీలో "లోంధా అలారే అలా పాలా" అని అరుస్తున్నాడు. మా నాన్నగారికి లోధా అంటే దాని అర్థం తెలీలేదు. (కెరటం)



ప్రియమైన సాయి భక్త పాఠకులారా, మనలాంటి సామాన్యమానవులకి అటువంటి అనుభవాలని అర్థం చేకోవడం కష్టమని నాకు తెలుసు. అప్పుడు నా జీవితంలోఆలోచనా శక్తిని రేకెత్తించే సంఘటన ఒకటి జరిగింది. దానిని నేనిప్పుడు మీకు వివరిస్తాను.
నాకు బాగా గుర్తున్నంత వరకు అది 1962 సం. జూన్ నెల. బాంద్రాలో న్యూ టాకీస్ లో (యిప్పుడది గ్లోబస్ థియేటర్) గొప్ప సినిమా ఆడుతోంది. ఆ సినిమా పేరు "టెన్ కమాన్ డ్ మెంట్స్". ఈ సినిమాకి నిర్మాత సెసెల్లె బెడెమెలె, హాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు. కొలాబాలోని రీగల్ థియేటర్లో 70 ఎం.ఎం. స్క్రీన్, స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తిరిగి నిర్మించవడిన బాంద్రాలోని న్యూ టాకీస్ లోను గత రికార్డులన్నీ ఈ సినిమా బద్దలు కొట్టింది. నేను ఈ సినిమాని చూశాను. నాకు తెలిసిన దేమిటంటే, ఈ సినిమాలో చూపించిన అద్భుతాలు, మానాన్నగారు షిరిడీలో సాయిబాబాతో ఉండగా చూసిన లీలలు రెండూ కూడా సరిపోలాయి. మా నాన్నగారిని నాతో కూడా వచ్చిఈ సినిమాను చూడమని ఒప్పించాను. 30 నుంచి 35 సంవత్సరాల తరువాత అయిఉండవచ్చు, ఆయన థియేటర్ లోకి అడుగుపెట్టి సినిమా చూశారు. ఆయన చూసిన దృశ్యాలు, దైవ సంబంథమైన దివ్యమైన వెలుతురు, (ప్రకాశం) పర్వతాన్ని దర్శించడానికి వచ్చినపుడు మోజెస్ రావడం, ఈజిప్టు భూబాగాన్ని వదలి వెళ్ళే తన జ్యూ ప్రజలందరినీ మోజెస్ తీసుకుని వెళ్ళడం, రెడ్ సీ ఒడ్డుకు వచ్చి ప్రభువుని ప్రార్థించడం, ఫరోహా రాజు ఆగ్రహం నుంచి వారిని తప్పించడానికి సముద్రం రెండు భాగాలుగా విడిపోవడం, మానాన్నగారు ఆ పిక్చరైజేషన్ కి అమితానంద పడ్డారు. కళ్ళనుండి కన్నీరు పెల్లుబికి థారగా కార సాగాయి. మేము థియేటర్ నించి బయటకువచ్చిన తరువాత టెన్ కమాండ్ మెంట్స్ సినిమాలో చూపించిన విథంగా షిరిడీ సాయిబాబా వారికి కూడా అదే విథమయిన మానవాతీత శక్తులు కలిగి ఉన్నారని, మోజెస్ పాత్రకి, ఆయనకి బాగా పోలిక ఉందని నిర్థారించారు. ఆయన యింకా కొనసాగిస్తూ యిలా చెప్పారు. "వీరేన్! షిరిడీ సాయిబాబాతో ఉన్నపుడు నేననుభవించిన అపూర్వమైన అనుభవాలని నమ్మడానికి నీకిప్పుడు తగిన కారణం ఉంది."
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
------------------------------------------------------------

0 comments:
Post a Comment