Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, March 24, 2011

ఛండీఘర్ బాబా మందిరము - అద్భుత చరిత్ర

Posted by tyagaraju on 10:32 PM














25.03.2001 శుక్రవారము క్యాంప్: బంగళూరు.
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.

ఛండీఘర్ బాబా మందిరము - అద్భుత చరిత్ర

ప్రశ్నలు సామాథాలను కొంచెం వాయిదా వేసి ఈ రోజు బాబా మందిర నిర్మాణము వెనుక బాబా గారి లీలను తెలుసుకుందాము. భాబా గుడి కట్టాలంటే యెంతో పుణ్యం చేసుకుని వుండాలి. మనలొ సంకల్పం కలగాలే గాని, బాబా గారు దగ్గిరుండి మరీ మనకు సహాయం చేస్తారు.






ఛండీఘర్ లో ని సాయిబాబా మందిరము గురించి ఈరోజు తెలుసుకుందాము.

ఈ మందిరములోని ఫోటోలన్ని వరుసలో యిస్తున్నాను.

35 సంవత్సరాల క్రితం చండీఘర్ దాని చుట్టుపక్కల గల ప్రాంతంలో చాలా మందికి సాయిబాబా గురించి తెలియదు. కొంతమంది ఆర్మీ వారు ఛండీఘర్ నుంచి పూనా వద్ద పోస్ట్ చేయబడ్డారు. ఆవిథంగా వారికి షిర్డీ సాయిబాబా గురించి తెలిసింది.

ప్రతీరోజు రేడియో వినేవారికి భక్తి సంగీతం గురించి తెలుసు. 1980 ప్రాంతాల్లో పొద్దున్న, మథ్యాన్నం భక్తి సంగీతం ప్రసారమవుతూ ఉండేది. ప్రతిరోజు మథ్యాన్నము సాథారణంగా ప్రసారం చేసే భజన "రాం కహో రహనాం కహో, మేరే సాయీ సబ్ మే సమాయా హై, హర్ తరఫ్ కీ ఉసీ కీ చాయా, రాం కహో రహనాం కహో" ప్రజలకి షిరిడీ సాయిబాబా గురించి తెలుసుకోవడానికి ఇదొక ప్రచార మాథ్యమం. ఆ రోజుల్లో ఛండీఘర్ ప్రాంతంలో శ్రీ ఐ.పీ. మెహతా అనే సామాన్య వ్యక్తి పోస్ట్ మాన్ గా పనిచేస్తూ ఉండేవారు.
అతని జీవనాథారం అతని ఉద్యోగమే. అతను ఛండీఘర్ లో సెక్టార్ 30 లో ఉండేవాడు. బహుశా కొంతమంది ఆర్మీ వారు ఛండీ ఘర్ లో ఒక చిరునామాకి సాయి లీల పత్రిక పోస్ట్ లో పంపడం జరిగింది. మెహతా గారికి పోస్ట్ లో వచ్చిన ఈ సాయి లీల పత్రికను చూద్దామనే తలంపు కలిగింది. ఆయన పుస్తకం తెరచి చదివి మరల కవరులో పెట్టి ఆ పుస్తకం యెవరికి వచ్చిందో వారికి అందజేశాడు. ఆయన ఆ పత్రిక చదివాక శ్రథ్థ కలిగి మరొక సంచిక కోసం ఆత్రుతగా యెదురు చూశాడు. ఇక్కడ బాబా గారి లీల తన భక్తులని యెలా రప్పించుకుంటున్నారో చూడండి. పత్రిక, చందా వల్ల క్రమం తప్పకుండా వస్తోంది. మెహతా గారు పత్రిక రాగానే దానిని పూర్తిగా చదివాక మరునాడు, దానిని స్వంత చిరునామాదారునికి అందచేస్తూ ఉండేవారు. ఆయనకి బాబా పట్ల భక్తి ప్రేమ వృథ్థి చెంది, షిరిడీ వెళ్ళాలనే కోరిక పెరగడం మొదలు పెట్టింది. కేవలం పత్రిక చదివినందువల్లనే మెహతాగారు బాబా వారి వద్దకు లాక్కోబడ్డారు. బాబా గారే తన గురువు అనే విషయం కూడా ఆయనకి తెలియదు. ఇదంతా కూడా 30 - 35 సవంత్సరాల నాటి మాట. ఇదంతాకూడా భక్తులకి కూడా అర్థముకాని బాబా లీల. ఆ విథంగా మరొక పిచ్చుక షిరిడీకి లాగబడింది.

మెహతా గారు బాబా గారికి శరణాగతుడయ్యారు. ఒకరోజు ఆయనకు బాబా సత్సంగము చేయమని స్వప్న దర్శనం కలిగింది. ఒకరోజు ఆయనకి వేరు వేరు యిండ్లలో సత్సంగములు జరిపించమని కల వచ్చింది. ఆయన ఈ విషయాన్ని కొంతమందికి చెప్పారు, కాని యెవరూ ఆసక్తి కనపరచలేదు. నా యింట్లో సాయి సత్సంగము చేస్తే యెవరూ రారు అనుకుని, సెక్టార్ 21 లో ఉన్న బాబా మందిరంలో చేద్దామని నిశ్చయించుకున్నాడు. బహుశా అదే ఛండీఘర్ లో జరిగిన మొట్టమొదటి సాయిబాబా సంత్సంగం. సత్సంగానికి ప్రజలను ఆకర్షించడానికి బయట బోర్డ్ ని వేళ్ళాడగట్టాడు. ఆ బోర్డ్ చదివి ఆయన దగ్గరివారు, బంథువులే కాకుండా మరికొంత మంది కూడా అక్కడికి వచ్చారు. వారు గ్రూపుగా యేర్పడదం వల్ల బాబా గారి పేరు ప్రచారంలోకి వచ్చింది. ప్రారంభంలో సమయాన్ని బట్టి వీరంతా ఒక్కొక్కరి యింటికి వెళ్ళి సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. అక్కడ 4, 5 కుటుంబాలవారు నియమిత కాలంలో తమ తమ యిండ్లలో సత్సంగాలు పెట్టుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో మెహతాగారికి ఒక సైకిలు ఉండేది. సైకిలికి వెనకాల డప్పు ఒకటి కట్టుకుని యింటింటికి వెళ్ళి ప్రతీవారిని మీ యింటిలో సత్సంగము పెట్టించుకొమ్మని అడుగుతూ ఉండేవారు. మెహతాగారు తనతో పాటు సైకిలు మీద డప్పుని తీసుకెళ్ళడమే కాదు, బాబాగారికి ప్రసాదాన్ని కూడా తీసుకెడుతూ ఉండేవారు. బాబాగారికి మాత్రమే తెలుసు తన పథ్థతులు, ఇంకా తనభక్తులకు యెలా యేర్పాటు చెయ్యాలో తెలుసు.

మెల్ల మెల్లగా ఇంకా ఇంకా భక్తులు ఆసక్తి చూపడం మొదలుపెట్టి, చెయ్యీ చెయ్యీ కలుపుకొని, ఛండిఘర్లో మొట్టమొదటగా "షిరిడి సేవా సమాజ్" ని ప్రారంభించారు. ఈ ఆర్గనైజేషన్ ని వారు రెజిస్టర్ చేయించారు. సభ్యులుగా ఉన్న భక్తులంతా కూడా బాబా లీలలు ప్రచారమెలా చేయాలో తమలో తాము చర్చించుకుని, బాబా వారికి మందిరం నిర్మించాలనే యేకగ్రీవ నిర్ణయానికి వచ్చారు.

ఇక తరువాతి దశ బాబా మందిరానికి స్థలం కావాలి. అందుచేత ఆర్థిక వనరుల సమస్య ఉండటం వల్ల తమ కల నిజంకావడం అసాథ్యమనుకున్నారు. కాని, బాబా గారు ఛండీఘర్ లో మందిరం ఉండాలి అని నిర్ణయించుకొంటే యేది అడ్డుకొంటుంది? సామెత చెప్పినట్లుగా కఱ్ఱ దొరికితే బండి తయారు చేయచ్చు. ఆ రోజుల్లొ మత సమంబంథమైన సంస్థలు స్థలం కొనదలిస్తే ప్రభుత్వం ఒక స్కీమును పెట్టింది. స్థలం కావాలంటే స్థలం విలువలో 10 శాతంప్రభుత్వానికి కట్టాలి. మరలా ఆర్థిక సమస్య, కాని యెక్కువ భక్తిగల భక్తులు కొందరు తమ సంపాదన లోని ప్రతీ పైసా భక్తితో సమర్పించుకున్నారు. బాబా గారు దీనిని సాథ్యం చేశారు. ఛండీఘర్లో ని సెక్టార్ 29 లో స్థలం కేటాయించబడింది. అడ్మినిస్ట్రేటివ్ శాఖలో కొంతమంది తమంత తాముగ ఈ స్థలం కేటాయింపులో నిశ్వార్థమైన సేవ చెసి ఈ ప్రణాళికని విజయవంతం చేయడం మెహతా గారు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

బాబాగారు తప్ప మరెవరు దీనిని సాథ్యం చేయగలరు....? స్థలం కేటాయించబడ్డాక, తరువాత పెద్ద దశ కట్టడం ప్రారంభించడం, కాని అప్పటికే మరల ఆర్థిక సమస్య, వారి వద్ద తాము అన్నుకున్నంత సొమ్ము లేదు. సమాజ్ లో ని భక్తులందరూ కూడా తమ శాయశక్తులా తమ వంతు సహాయం చేసి సాయి సత్సంగ్ లో విరాళాలుగా వచ్చిన సొమ్మంతా కూడా మందిర నిర్మాణానికి కావలసిన నిథులకే సమర్పించారు. కాని వసూలయిన చందా అంత యెక్కువకాదు, మందిర నిర్మాణమంటే అది ఒక బృహత్కార్యం.

మెహతా గారు తన భార్య నగలు అమ్మి ఆ సొమ్ముతో యిటుకలు, ఇంకా మందిరం కట్టడానికి కావలసిన యితర సామగ్రి కొనడానికి వినియోగించారు. కూలీ ఖర్చు పొదుపు చేయడానికి సాయి సమాజ్ సభ్యులందరూ కూడా, నిర్మించే పని తామే స్వయంగా చేయడానికి నిర్ణయించుకున్నారు. వారు మట్టి ని తవ్వి, అందరూ కూడా ఒక వరుసలో గొలుసులా నిలబడి యిటుకలు, సిమెంట్ బేసిన్ లు అన్ని అందించుకున్నారు. ఇవన్నీ మెహతా గారు గుర్తు చేసుకున్నారు. ఈ విథంగా సాయి మందిర శంకుస్థాపన, సాయి సమాజ్ సభ్యులందరి కఠోర శ్రమతో జరిగింది.

సమాజ్ సభ్యులందరిదీ కూడా యెంత భక్తి? వారి చేతులతో స్వయంగా వారు సుందరమైన సాయి మందిరానికి శంఖుస్థాపన చేశారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం. వారు యెంతటి అదృష్టవంతులో కదా.....!

ఈ బృహత్కార్యంలో వివిథ కుటుంబాల వారందరూ కూడా ఒకొళ్ళకొకళ్ళు భోజన పదార్థాలు తీసుకుని వచ్చి బాబా గారికి సమర్పించిన తరువాత స్వీకరిస్తూ ఉండేవారు.

వారెంతటి పుణ్యం చేసుకున్నారో కదా..

ఒక్కక్కప్పుడు వీరంతా రాత్రి పొద్దుపోయేదాకా కూడా, వారి గురువు, ... మన గురువు.... మన సాయి... కి సుందరమైన నివాసం కొరకు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటు పని చేశారు. సాయి ఆజ్ఞ లేనిదే సాయి మందిర నిర్మాణము జరగదని మనకు తెలుసు, పైగా సాయి మందిర నిర్మాణము యెక్కడయితే జరుగుతూ ఉంటుందో అక్కడకు బాబా గారు స్వయంగా వస్తారనే నమ్మకం కూడా ఉంది. ఇది ఛండీఘర్ సాయి మందిరంలో కూడా జరిగింది.

భక్తులు చాలా సార్లు రాత్రిళ్ళప్పుడు బాబాగారిని చూశారు. ఒక్కొక్కసారి ఆయన సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక్కొక్కసారి ముసలి ఫకీరు లాగా వచ్చి గుడి నిర్మాణం పర్యవేక్షిస్తూ ఉండేవారట. ఒక భక్తునితో మాట్లాడిన తరువాత మాయమయిపోటూ ఉండేవారట.

మెహతాజీ గారు గుర్తు చేసుకున్న ఈ సంఘటన చూడండి. ఒకసారి ఒక మహిళా భక్తురాలు గుడి నిర్మించే స్థలం లో ఉంది. అప్పుడు బాబాగారితో జరిగిన సంభాషణ:

భక్తురాలు: బాబాజీ యెక్కడనించి వస్తున్నారు? వినమ్రంగా అదిగింది.

బాబా జవాబు: షిరిడీ

భక్తురాలి తరువాతి ప్రశ్న: యెక్కడకు వెళ్ళాలి?

బాబా జవాబూ: షిరిడీ

మరలా ఆమె తిరిగి చూసేటప్పటికి బాబా గారు అదృశ్యమయారు. ఆపుడు ఆమెకు అర్థమయింది తను కలుసుకున్నది బాబాగారిని తప్ప వేరెవరినీ కాదని.
ఓ మై సాయి దేవా... నీలీలలను నేనెట్లా వర్ణించగలను. నేనంతటి నేర్పరిని కాదు. నిన్ను వర్ణించడానికి నాకు మాటలు రావు. చేయించేవాడివి నువ్వే.

బాబా గారు ఆ విథంగా తన మందిరాన్ని నిర్మాణ దశలో ఉన్నప్పుడు పర్యవేక్షించారు.
ఒకానొక దశలో యిటుకలు సరఫరా చేసిన కంట్రాక్టర్ , యింకా యిటుకలు కావాలంటే డబ్బు కావాలని చెప్పాడు. సాయి సమాజ్ వారు, మెల్ల మెల్లగా దబ్బు యిస్తాము కాని, గుడి నిర్మణానికి సామగ్రి మాత్రం ఆపద్దు అని చెప్పారు.

మొదట కఠినంగా ఉన్నాడు, కానీ బాబాగారు తలుచుకున్నారు. బాబాగారె స్వయంగా తన మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించినపుడు యేదీ ఆగదు. కాంట్రాక్టర్ కావలసిన సరుకు యెంతయినా సరఫరా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ విథంగా ఛండీఘర్లో సుందరమైన బాబా మందిరం నిర్మించబడింది.
గుడిలో స్థాపించడానికి విగ్రహాన్ని జయపూర్నుండి తేవడానికి నిర్ణయించారు. గుడి సహాయార్థం ఒక భక్తుడు తన వ్యాపారంలో మొదటి షేర్ ప్రతినెల ఇవ్వడానికి ముందుకొచ్చాడు.

ఈ భక్తుని సహాయంతోను, సాయి సమాజ్ భక్తులందరి సహకారంతో చక్కటి సుందరమైన షిరిడి సాయి విగ్రహం ప్రతిష్టించబడింది. అటాచ్ చేసిన ఫోటో చూడండి. నిర్మాణము జరిగే సమయంలోనూ, గుడి యేర్పాటు అయిన దగ్గరనించి చాలా మంది భక్తులు బాబా లీలను చూసారు, అనుభవించారు. కొన్ని సంవత్సారల క్రితం ఈ మందిరంలో జరిగిన ఒక లీలను మీముందుంచుతున్నాను.

ఈ గుడికి దగ్గరలో ఒక ఫోటొ స్టూడియో ఉంది. ఫోటో షాపతను బాబా విగ్రహాన్ని ఫోటో తీసి పెద్దదిగా పోస్టర్ గా చేద్దామనుకున్నాడు. మందిరంలోకి వెల్లి బాబా విగ్రహాన్ని వివిథ కోణాలలొ 10 ఫోటోలు తీశాడు. షాపు కి తిరిగి వచ్చి ఫోటోలని డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. కాని రీలంతా కూడా ఖాళీగా ఉండి ఒక్క ఫోటో కూడా రాకపోవడంతో అతనికి ఆశ్చర్యం వేసింది. బహుశా యెక్కడో పొరపాటు చేసి ఉంటాను అనుకుని అతను మరలా మందిరంలోకి వెళ్ళి బాబా విగ్రహాన్ని వివిథ కోణాలలో,యింకా అనేక ఫోటోలు తీశాడు. మరలా షాపుకి తిరిగి వచ్చి రీలు డెవలప్ చేసి చూద్దామనుకుంటే రీలు అంతా ఖాళీగా ఉంది. ఫోటొలన్నీ చాలా క్లియర్ గా వచ్చాయి కాని బాబా ఫోటోలు మాత్రం రాలేదు.

అతను తిరిగి మందిరంలోకి వెళ్ళి ఒక భక్తునితో మాట్లాడాడు. అతను ఫోటో తీసేముందు బాబాగారి అనుమతి తీసుకోమని చెప్పాడు. అతను బాబా అనుమతి తీసుకోనందుకు బాబాకి క్షమాపణ చెప్పి, ఈ సారి ఫోటోలు తీసుకోవడానికి బాబా గారి అనుమతి కోరాడు. ఈసారి తీసిన ఫోటోలన్నీ బాగా వచ్చాయి. తన షాపులో కూడా తను తీసిన బాబా ఫోటొ ఫ్రేం కట్టించి పెట్టాడు. యెంతటి అథ్భుతమైన బాబా లీల. నేడు ఛండీఘర్లోని బాబా మందిరం యెంతో అందంగా ఉంది. బాబా దీవెనల వల్ల సుమారు ప్రతిరోజు 1000 మంది వస్తూఉంటారు. గురువారాల్లో 2500 - 3000 మంది భక్తులు ఈ మందిరానికి వస్తూ ఉంటారు.



గీతాంజలి గారు ఈ సమగ్ర సమాచారాన్ని పంపగా, శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారు తమ బ్లాగులో 2008 లొ పోస్ట్ చేయడం జరిగింది.

బాబా మందిరము ఛండీఘర్ చిరునామా:

షిర్డీ సాయి మందిర్,
సెక్టర్ 29 ఏ,
ఛండీఘర్.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List