Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, May 17, 2011

శ్రీ భరద్వాజగారి ద్వారా బాబా లీల

Posted by tyagaraju on 6:28 AM



17.05.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ భరద్వాజగారి ద్వారా బాబా లీల

బాబా శక్తి అమోఘం. బాబా తన భక్తుల ద్వారా కూడా తన లీలను చూపిస్తారు. శ్రీ యెక్కిరాల భరద్వాజ గారిని తెలియని వారుండరు. ఆయన గొప్ప బాబా భక్తులు. ఈ అద్భుతమైన బాబా లీలను చూడండి.
షిరిడీ సాయి బాబా అంకిత భక్తులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు.

భరద్వాజ మాష్టారు గారి ద్వారా మాట్లాడలెని అమ్మాయికి మాటలాడే శక్తి యెలా వచ్చిందో తెలుసుకుందాము.

నెల్లూరు దగ్గిర కొత్తపలెం లో ఒక గ్రామస్తురాలు అమెరికన్ ఆస్పత్రిలో ప్రసవించింది. ఒక పాప పుట్టింది. తరువాత ఆ పాపను తీసుకుని యింటికి బయలుదేరారు. నెల్లూరులో రైలు ఎక్కుతున్నప్పుడు తల్లి, తను చంటి పిల్లతో రైలు యెక్కడం కష్టమని రైలులో ఉన్న ఒకామెకు తన చంటి బిడ్డను అందిస్తుండగా పిల్ల జారి రైలు, ప్లాట్ ఫారంమథ్య పడిపోయిందిట.
తలకు దెబ్బ తగిలింది. గూడూరులో దిగి డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్ళగా ఆయన వైద్యం చేశారు. తరువాత యింటికి తీసుకొని వెళ్ళారు. పిల్ల పెరిగి పెద్దవుతున్నా 6 సంవత్సరముల వయసు వచ్చినా మాటలు రాలేదుట. నడక కూడా రాలేదు.

కొత్తపాలెంలో శ్రీ గోపాలయ్యగారి యింట్లొ మాష్టారు గారు సత్సంగము యేర్పాటు చేయగా మాస్టారు గారు వచ్చి సత్సంగం నిర్వహించారు. భజన కుడా చేశారు. తరువాత సాయిబాబాకు పాయసం నైవేద్యం పెట్టారు. ఆ రోజు తలకి దెబ్బ తిన్న ఆ ఆరేళ్ళ పాప సత్సంగంలో తల్లి ఒడిలో కూర్చుని ఉంది. ఆ పాయసం, మాస్టారు దగ్గరున్న సమయంలో ఆ పాప పాకుకుంటూ వచ్చి ఆచార్యుల వారి దగ్గిరకు వచ్చింది. అప్పుడు ఆ పాప దెబ్బతగిలిన సంఘటన అంతా అక్కడున్నవారు మాస్టారుగారికి చెప్పారు. ఆ పాపని చూసిన ఆచార్యులవారికి జాలి కలిగింది. శ్రీ సాయిబాబా అయితే ఈ పాపకు మాటలు తెప్పించేవారు కదా అని అనుకున్నారు. ఆ పాప నుంచోవటానికి, యేదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తోందని చూసిన శ్రీ భరద్వాజ గారు దగ్గరకి వచ్చిన పాపను ఒళ్ళోకి తీసుకుని శ్రీ సాయిబాబాకు నివేదించిన పాయసం ఆ పాప నోట్లో పెట్టి తినిపించారు. తరువాత వారు విద్యానగర్ వచ్చారు.

మరునాడు మాస్టారుగారి శిష్యుడు విజయకుమార్ విద్యానగర్ వచ్చి మాస్టారుగరితో, "మీరు నిన్న పాయసం తినిపించడంతో ఆ పాపలో మార్పు చ్చింది. కాళ్ళలో కొంచెం శక్తి వచ్చి కొంచెం సేపు నించోకలుగుతోంది. గొంతులో కూడా కొంత మార్పు వచ్చింది అని చెప్పడంతో మాస్టారుగారు కూడా ఆశ్చర్య పోయారు. తరువాత క్రమక్రమమంగా ఆ పిల్ల అడుగులు వేయటం, కొన్ని పదాలు పలకడం కూడా వచ్చింది. ఈ విథంగా తన భక్తులను ఆదుకునే శక్తిని బాబా తన అంకితభక్తుడైన మాస్టారుగారికి ఇచ్చారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List