Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, February 13, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ – 8 వ.భాగమ్

Posted by tyagaraju on 5:18 AM
      Image result for images of shirdi sai baba and lord shiva
            Image result for images of jasmine flower
13.02.2018  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మహాశివరాత్రి శుభాకాంక్షలు

శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు.     పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లుసాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
                 Image result for images of radhakrishna swamiji

(ముందుగా మహాశివరాత్రి సందర్భంగా మధురమైన భక్తి గీతం వినండి)


శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ – 8 .భాగమ్
తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు

04.08.1971 :  రోజు మరలా గ్రహణం గురించే స్వామీజీ వివరించారుచూడండి, మీకు ఇంతకుముందే 6.తారీకు  రాత్రి 11.30 నుంచి తెల్లవారుఝాము 3 గంటల వరకు సంభవించబోయే గ్రహణం గురించి చెప్పాను సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ చేయమని చెప్పానుకొంతమంది గ్రహణ సమయంలో కొన్ని శక్తులు లభించడానికి  ‘సిధ్ధిమంత్రాలనుజపిస్తారుమనకు అటువంటి మంత్రాలు అవసరంలేదు.  



మనకు అన్నిటికన్నా అత్యుత్తమమయిన మంత్రం ఉందిఅదే విష్ణుసహస్రనామంఆయనను కీర్తించడానికి వేయినామాలు ఉన్నాయి వేయి నామాల ద్వారా ఆయనను స్ఠుతిస్తూ ఉన్నాము. హే భగవాన్! నువ్వు యింకా యితర మంత్రాలను కూడా సృష్టించావుకాని మాకు అవి అవసరం లేదుమాకు నువ్వే కావాలి అని ఆయనకు చెప్పుకుంటాముమనం విష్ణుసహస్రనామ పారాయణ చేస్తున్నామంటే వాస్తవానికి ఆయనను పిలుస్తున్నట్లే లెక్క.

నేను నీవాడిని, నువ్వు నావాడివి అని దేవునికి మనం చెప్పుకుంటే చాలుఒకానొక సందర్భంలో బాబా ఈవిధంగా చెప్పారుఒకసారి నాకు చాలా బాధ కలిగిందిగుండె దడదడలాడిందిప్రాణం విలవిలా  కొట్టుకొందితగ్గే ఉపాయం కనిపించలేదుఅట్టి కష్టసమయంలో పుస్తకమెంత ఉపయోగపడిందో నీకెలా చెప్పనుదీని ద్వారా నాప్రాణాలు దక్కాయిఒక్క క్షణం దీనిని గుండెలకు హత్తుకున్నానుతక్షణం ప్రాణం చల్లబడింది.”  బాబాకు అటువంటి బాధ కలగలేదుఎవరో ఒక భక్తునికి విధమయిన బాధ కలిగి ఉండవచ్చు భక్తుని క్షేమం కోసం బాబా విష్ణువుని ప్రార్ధించి ఉండవచ్చుబాబా యింకా యిలా అన్నారుహరి నాహృదయంలోకి ప్రవేశించాడుఆయన నా హృదయం."  బాబాయే స్వయంగా విష్ణుసహస్రనామ పారాయణ గురించి అంత గొప్పగా చెప్పినపుడు మనము కూడా పారాయణ చేసి దానియొక్క ఫలితాన్ని పొందలేమాశ్రీమహావిష్ణువే పరమాత్మఆయన సర్వశక్తిమంతుడయిన పరమాత్మ, సర్వాధికారి. మనము విష్ణుసహస్రనామ పారాయణను దుష్టశక్తులను పారద్రోలడానికే కాక మన ఆరోగ్యం గురించి కూడా చేయవచ్చుమన ఆధ్యాత్మిక సాధనలో కలిగే అడ్డంకులను కూడా తొలగించడానికి దోహదపడుతుంది

మీకొక ఉదాహరణ చెబుతానుఒకపెద్ద మనిషి నావద్దకు వచ్చి తాను ధ్యానం చేయడం ప్ర్రారంభించెనపుడెల్లా ధ్యానానికి తనకు మధ్యలో ఒకవిధమయిన నీడ వచ్చి తన ధ్యానానికి భంగం కలిగిస్తోదని చెప్పాడుఅవుడు నేను, “నువ్వేమీ చింత పెట్టుకోకువిష్ణుసహస్రనామం ప్రారాయణ చేస్తూ ఉండునీకేదో అవరోధం కలిగి నిన్ను కలత పెడుతూ ఉంది అడ్డంకి ఖచ్చితంగా తొలగిపోతుందివిష్ణుసహస్రనామ పారాయణను మాత్రం ఆపవద్దుఅని ఆయనకి సలహా యిచ్చాను.

09.08.1971  :  నేటి ఆధునిక యుగంలో మానవునికి కలుగుతున్న అశాంతిని గురించి చెప్పారు.  “నేడు మానవునికి ఎన్నో కోరికలు వెంటాడుతూ ఉన్నాయి. ఏదీ అతనిని సంతృప్తి పరచలేకపోతూ ఉందికోరుకున్న కోరికలన్నీ తీరతాయాఅది సాధ్యమేనాప్రస్తుత తరానికి సంతృప్తి అనేది లేదుమనకి మనం కాస్త ఆత్మవిమర్శ చేసుకుంటే, భగవంతుడు మనకి బుధ్ధినిచ్చాడని బోధపడుతుందిదానిని మనం ఏవిధంగానయినా ఉపయోగించుకోవచ్చుఅందుచేత మనం అన్నికామాలని’ (కోరికలని) పారద్రోలి కామ స్థానంలో రామ ని వెతకాలిప్రతివారు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ అందులోనే నిమగ్నమయి ఉంటారు తప్పితే భగవంతుని గురించి మాత్ర్తం ఆలోచించరుప్రతిరోజు కనీసం 10 నిమిషాలయినా భగవంతుని కోసం మనం కేటాయించలేమా ప్రపంచంలో మానవుడు తాను సాధించిన విజయాలగురించి తనకు తాను గొప్పగా  భావించుకుంటూ ఉండవచ్చుకాని అతనికి మనశ్శాంతి ఉంటుందానేటి మానవునికి స్వఛ్ఛమయిన మనస్సు ఉందాఅది ఉన్నపుడె అతనికి నిజమయిన శాంతి ఉంటుందిముఖ్యంగా ముందుగా మనకి కావలసినదేమిటంటే ప్రాపంచిక బంధాలనుండి మనం తప్పించుకోవాలిదానికోసం మనం భగవంతుని విధంగా ప్రార్ధించాలి.  “హే!భగవాన్, భార్యా, పిల్లలు, గృహం యింకా నాకున్న సంపద ఇవేమీ నావి కావుఅంతా నీదేఅంతే కాకుండాహే! భగవాన్, నేను కూడా నీవాడినేఆఖరికి శరీరం కూడా నాది కాదునేను కూడా నీవాడినేనాలో ఉన్నది నీవు మాత్రమే.”  
           Image result for images man praying shirdi saibaba
ఈవిధమయిన భావాన్ని పెంపొందించుకుంటే అహంకారం పూర్తిగా తొలగిపోతుందిఅటువంటి వ్యక్తి తరతమ భేదాలు చూడడుఅటువంటి వ్యక్తి దృష్టిలో తనవారయినా, కాకపోయినా అందరూ సమానమేఆవిధంగా అందరూ సమానమే అనే భావంతో ఉన్న వ్యక్తిలో ఎటువంటి ద్వేషభావం ఉండదుమనం భగవంతునికి ఎంత దగ్గరగా ఉన్నామనే దానికి నిజమయిన పరీక్ష ఏమిటంటే ఎంతవరకు ద్వేషాన్ని మనం జయించగలగాము అన్నదే.శ్రీకృష్ణ పరమాత్మ మయ్యార్పిత మనోబుధ్ధి…….” అని చెప్పాడు.  (భగవద్గీత . 8 శ్లో.7).

నీకున్న సంపదనంతా భగవంతునికి త్యాగం చేయవచ్చుసంపదనంతా భగవంతునికి సమర్పించినంత మాత్రాన పూర్తయినట్లుకాదునీ బుద్ధిని, మనస్సును కూడా భగవంతునికి అర్పణ చేయాలి

(ఈసందర్భంగా SAYIBABA'S TEACHINGS & PHILOSOPHY  by.Lt.Col.M.B.Nimbaalkar గారు వ్రాసిన పుస్తకంలోని విషయాన్ని ప్రస్తావిస్తాను పుస్తకాన్ని శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసి మన బ్లాగులో కూడ ప్రచురించానుమీకోసం మరలా శరణాగతి గురించిన భాగాన్ని అందిస్తున్నాను.

భక్తిమార్గంలో తొమ్మిదవది  ‘ఆత్మనివేదన (శరణుజొచ్చుట)

అనగా పూర్తిగా తనకు తాను భగవంతునికి అర్పించుకొనుటఅంతేకాకుండా భక్తుడు తన భార్యాపిల్లలనే కాక మొత్తం తన స్థిరచరాస్థులను కూడా భగవంతునికి అప్పగించి సర్వశ్య శరణాగతిని వేడుటఅహంకారాన్ని కూడా వదలివేసి తాను చేసిన పనులన్నిటినీ తాను పూజించే భగవంతునికి గాని, గురువుకు గాని అర్పించుటనవవిధభక్తులలో ఆత్మనివేదన భక్తి చాలా ముఖ్యమయినదిసంత్.రామదాసు ఆత్మ నివేదన గురించి విధంగా చెప్పారుఆత్మ నివేదన లేక తనకుతాను అర్పించుకోకుండా మానవుడు జననమరణ చక్రాలనుండి తప్పించుకోలేడుభక్తిలో మొట్టమొదటిది స్మరణం అయితే ఆత్మనివేదన భక్తిలో చివరిదిఅదే ఉత్తమస్థాయిభక్తిలో పరాకాష్ట.
             Image result for images of kakasaheb dixit
శ్రీసాయి సత్ చరిత్రలో ఆత్మనివేదన గురించి ఉదాహరణగా కాకాసాహెబ్ దీక్షిత్ గురించి చెప్పుకోవచ్చుఆయన బొంబాయిలో తను చేస్తున్న న్యాయవాదవృత్తిని, అధికారహోదాని, ఆఖరికి తన భార్యాపిల్లలను కూడా వదలి తరచూ షిరిడీ వచ్చి చాలా రోజులు అక్కడే ఉండేవాడుఒకసారి ఆయన లండన్ లో ఉన్నప్పుడు రైలు ఎక్కుతుండగా జారిపడిపోయారుకాలికి దెబ్బతగిలి జీవితాంతం కుంటిగానే నడవవలసివచ్చిందికాని ఆయన ఎప్పుడూ బాబాని తన కాలికుంటితనాన్ని బాగుచేయమని అడగలేదుకాని ఆయన తన కాలికుంటితనం కంటే తన మనసుయొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమయిన ఆనందాన్ని కలుగచేయమని వేడుకొన్నారు. (అధ్యాయం – 50).  మానసికంగాను, శారీరకంగాను. కాకాసాహెబ్, బాబాకు సర్వశ్య శరణాగతి చేశారుఒకసారి కాకాసాహెబ్ ఒక మహారాజావారి కేసు వాదించినందుకు పెద్దమొత్తంలో ఫీజు ముట్టిందిఆయన వెండినాణాలన్నిటిని ఒక పెద్ద ట్రంకుపెట్టిలో పెట్టి షిరిడీ వచ్చి బాబా ముందు పెట్టి, “బాబా యిదంతా నీదేఅన్నారుఅప్పుడు బాబాఅవునా!” అని పెట్టి తెరచి రెండు చేతులతో నాణాలన్నిటినీ అక్కడున్న భక్తులందరికీ సంతోషంగా పంచిపెట్టేశారుకొద్ది నిషాలలోనే పెట్టంతా ఖాళి అయిపోయిందిఆసమయంలో నాగపూర్ సబ్ జడ్జి శ్రీ గార్డే, కాకాసాహెబ్ గారి మరొక స్నేహితుడు అక్కడే ఉన్నారువారిద్దరూ కాకాసాహెబ్ ముఖంవైపు తదేకంగా చూశారుతను సంపాదించిన సొమ్మంతా క్షణాలలో లెక్కలేకుండా అందరికీ బాబా పంచిపెట్టేసినా కూడా కాకాసాహెబ్ ముఖంలో కించిత్తు విచారం కూడా కనపడకపోవడంతో వారిద్దరూ చాలా ఆశ్చర్యపోయారుఆయన పరిత్యాగం, తన సద్గురువుకు చేసిన సర్వశ్య శరణాగతి అపూర్వం, అద్వితీయం. )


అపుడే దేవుడు నీవద్దకు వస్తాడుశ్రీకృష్ణపరమాత్మ ఇంకా యిలా చెప్పాడు.  “అనన్యాశ్చింతయంతోమాం ……..” అనగా మన మనసెప్పుడూ ఆయననే చింతిస్తూ ఉండాలిఅప్పుడు ఆయన పూర్తిగా మన యోగక్షేమాలను చూస్తూ మనలని కనిపెట్టుకుని ఉంటాడుశ్రీరామచంద్రులవారు చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొనండి.  “అభయం సర్వ భూతేషు…..” అనగా దీని అర్ధం ఏమిటి?  “ఎవరయితే నాపాదాల వద్ద నన్ను శరణు వేడుకుంటారో వారి యోగక్షేమాలను నేను వహింతును.” కాని ఆయన పాదాలవద్ద మనము ఏవిధంగా శరణు వేడుకోగలంమనం భగవంతుని దర్శించుకోవడానికి గర్భాలయంలోకి ప్రవేశించడానికి ఫాంటు, చొక్కాలను తీసి సామాన్యమయిన దుస్తులతో ప్రవేశిస్తాముఅదే విధంగా మన శరీరాన్ని కూడా బయటనే వదలి భగవంతుని సన్నిధానంలోకి ప్రవేశించాలిఅనగా మనస్సును భగవంతుని మీదనే కేంద్రీకరించాలని భావముఅంతేకాదు, మన ఆలోచనలన్నీ కూడా భగవంతుని గురించే తప్ప మరే యితర ఆలోచనలు ఉండరాదుమనం ప్రతిరోజు పూజలు ఏవిధంగా చేస్తున్నామో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొనండిపూజను ప్రారంభించేముందుపరమేశ్వర ప్రీత్యర్ధం….” అని చదివి పూర్తి చేసేముందుకాయేనవాచా …….నారాయణేతి సమర్పయామి….” అని పూజ ముగిస్తాము.
మరి ఆవిధంగా పూజ చేయడమంటే ఎంత అధ్భుతమో కదాపూజ అనేది ఆపరమేశ్వరునికి ప్రీతి కల్గించడానికిఆతరువాత పదార్ధాలన్నిటిని ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తాము.  “ఈవిధంగా నేను ప్రతిరోజు పూజ చేస్తున్నానుఅయినా గాని నాకు ఆకోరిక తీరలేదు కోరిక తీరలేదుఅని పూజ చేసిన తరువాత ఎవరయినా అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందిఆయనను సంతృప్తి పరచడానికి సంపూర్ణంగా పూజచేసి ఆయనకు నైవేద్యాన్ని సమర్పించిన తరువాత మన యోగక్షేమాలను ఆయనే చూస్తాడుమనకేది కావాలో దానినే మనకు ప్రసాదిస్తాడుమనకేది యివ్వాలో ఏది యివ్వకూడదో ఆయనకు బాగా తెలుసుకాని మనం భగవంతునికి చేసే ప్రార్ధనలో న్యాయం ఉండాలి. విధేయత ఉండాలినువ్వు భగవంతుని కీర్తిస్తూ భజనలు, పూజ, ప్రార్ధనలు చేస్తున్నావంటే అన్ని విషయాలను వదలిపెట్టి కేవలం భగవంతుని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండాలి.

విధంగా పూజలు సలిపినట్లయితే భగవంతుడు నీవు చేసే ప్రార్ధనలకు స్పందించి ఖచ్చితంగా ప్రతి విషయంలోను నీవద్దకు వస్తాడని నేను ఘంటాపధంగా చెబుతున్నానునేనీ విషయాన్ని అహంభావంతో చెప్పడంలేదునా స్వీయ అనుభవంతో మీకు చెబుతున్నానుసాధారణంగా మానవుడు భయపడేది దేనికంటే ఆధ్యాత్మిక జీవనంలోకి ప్రవేశించినంతనే మనకున్న సంపదనంతటినే కాక ఆస్తులను కూడా కోల్పోవలసినదేననికాని ఒక్క విషయం గుర్తుంచుకొనండిఇటువంటి భయాలన్నీ కూడా రాక్షస శక్తుల ప్రాబల్యం వలన సంభవించేవే కాని మరేమీ కాదు. అదంతా మన ఆధ్యాత్మిక అభివృధ్ధికి ఆటంకం కలిగించడానికే. మనం  అటువంటివాటిని గమనించిన వెంటనే క్రమక్రమంగా ఆవిధమయిన అడ్డంకులన్నిటినీ దాటుకుని ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలిఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండిమనం సరియైన దారిలో నడవడానికి అనగా భగవంతుని గురించి మనకు అవగాహన కలగడానికి అకస్మాత్తుగా  మనకు ప్రియమైనవాటిని, అభిమానించేవాటిని ఆయన లాగేసుకుంటాడు.”  స్వామీజీ ఈవిధంగా వివరిస్తుండగా ఒక భక్తుడుస్వామీజీ గురువు అనుగ్రహం వల్లనే భగవంతుని గురించి చేసే అన్వేషణలో కలిగే అడ్డంకులన్నీ తొలగుతాయని చెప్పబడింది కదా! అది నిజమేనా?” అని ప్రశ్నించాడు.

స్వామీజీ – “ గురువు పరిపూర్ణమయిన జ్ఞానం కలిగి ఉండి, శిష్యుడు కూడా అటువంటి గురువుకు తగినవాడయినట్లయితే అది నిజమేఉదాహరణకి శ్రీరామకృష్ణపరమ హంస పరిపూర్ణమయిన జ్ఞానిస్వామి వివేకానంద పరిణతి పొందిన శిష్యుడుఆవిధంగా గురువు అనుగ్రహంతో భగవంతుని గురించి తెలుసుకోవాలంటే శిష్యుడు అటువంటి పరిపూర్ణుడయి ఉండాలి. రోజులలో ధ్యానం నేర్చూకోవాలంటే ఉపదేశం పొందాలనే ఒక విధమయిన మోజు ప్రజలలో కనపడుతూ ఉందిఈవిధమయిన మార్గం సన్యాసికే తగినదికాని, ఎక్కువమంది ప్రజలకి మాత్రం సులభమయిన మార్గం భక్తి ఉంటే చాలుఎవరూ కూడా ఒక్కసారిగా ధ్యానమార్గంలోకి దుమికేయకూడదుఅందుచేత మనకి క్షేమకరమయినది, శ్రేష్ఠమయినది భగవన్నామస్మరణ మాత్రమేదానినే మనం ఆశ్రయించాలిఆభక్తుడే మరలా విధంగా ప్రశ్నించాడు.  “ఊరికే కూర్చుని భగవన్నామస్మరణ చేయడమంటే అది పనేమీ చేయకుండా సోమరిగా కూర్చోవడం కాదా?”

స్వామీజీ :  “అది ఏపనీ చేయకుండా ఊరికే కూర్చుని ఉండటం ఏవిధంగా అవుతుందినువ్వు ఒక క్లబ్ కి గాని, హోటల్ కి గాని, సినిమాకు వెళ్ళినా అది కూడా ఏపనీ చేయకుండా ఉండటం కాదామరొక విధంగా చూస్తే భగవంతుని గురించి తెలుసుకోవడానికి చేసే ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమయి ఉండటం అనేది అత్యుత్తమమైన క్రియ కదానేను నిన్ను అడిగిందేమిటికనీసం పదినిమిషాలు భగవంతునికోసం కేటాయించమన్నాను.  
                    Image result for images of mantra japa

గంటలకొద్దీ సమయాన్ని వృధాగా గడిపే కార్యకలపాలతో పోల్చుకుంటే అది ఊరికే సోమరిగా కూర్చోవడం ఎలా అవుతుందిభగవంతుడిని ప్రార్ధించే సమయంలో మానవునియొక్క వైఖరి గురించి ప్రస్తావిస్తూ భగవంతునికిశరణాగతిచేస్తున్నామనే భావన కలిగి ఉండాలని చెప్పారుశరణాగతికి ప్రతీక మారుతి అని జ్ఞప్తి చేసుకోండిమారుతి శ్రీరామచంద్రుని పాదాల వద్ద ఏవిధంగానయితే శరణాగతి చేస్తూ ఉన్నాడో అదే విధమయిన స్ఫూర్తి మనకు కూడా ప్రసాదించమని భగవంతుడిని వేడుకోవాలి
            Image result for images of hanuman at lord rama

అదే ఉత్తమమయిన పధ్ధతిమారుతి అవలంబించిన విధానాన్నే మనం కూడా అనుసరిస్తే శ్రీరామచంద్రమూర్తి మనలని తప్పక రక్షిస్తాడురాముడు ఎక్కడ ఉన్నాడుఆయన అయోధ్యలో మాత్రమే లేడుఆయన సర్వాంతర్యామిగా ప్రతిచోటా ఉన్నాడుమారుతి ఎక్కడ ఉన్నాడుమన బుధ్ధే మారుతిఅనగా మన బుధ్ధి మారుతి ప్రవర్తనలాగ ఉండాలిశ్రీకృష్ణపరమాత్మయందు గోపికల దృష్టిని కూడా మనం అనుసరించవచ్చు.  
              Image result for images of krishna and gopikas
ఏసందర్భంలోనయినా సరే మనం ప్రార్ధన చేయవలసిందే. “! భగవాన్, నేనెక్కడినుంచి వచ్చానో నాకు తెలియదుఎక్కడికి వెడతానో తెలియదునేనెక్కడినుంచి వచ్చానో అక్కడికే నన్ను తీసుకునివెళ్ళు”  భగవంతునికి శరణాగతి చేసే మార్గాన్ని అనుసరించేటప్పుడు ఐహిక ప్రపంచముతో అనుబంధం ఉండకూడదుఆవిధానాన్ని కూడా మనం అలవరచుకోవాలిఈప్రపంచంలో మనము ప్రజలతోను, స్నేహితులతోను, బంధువులతోను కలిసి తిరుగుతున్న సందర్భంలో మనమంతా భగవంతునికి చెందినవారమనే భావంతో ఉండాలి. ప్రతివాడు  భగవంతునికి చెందినవాడేననే భావంతో ప్రతివారికి మనం సేవచేయాలి.”  స్వామీజీ ఈవిధంగా ప్రసంగిస్తున్న సమయంలో ఒక భక్తుడు జాతకం ప్రకారం తన కుమారుడు కుజదోషం వల్ల బాధపడుతూ ఉన్నడని స్వామీజీకి చెప్పుకున్నాడుస్వామీజీ వెంటనే సమాధానమిస్తుఅత్యధిక శక్తి కలిగిన గురువుయొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేస్తు ఉన్నపుడు, నవగ్రహాల ప్రభావం గురించి నువ్వేమీ చింతించకు.
హే! భగవాన్, నేను నీవాడినినాకేమీ తెలియదునువ్వే నాయోగక్షేమాలను చూడాలిఅని ప్రార్ధించాలిఇదే శరణాగతినవగ్రహాల ప్రభావం మనమీద పడకుండా ఈశరణాగతి అత్యధికమయిన శక్తినిచ్చి కాపాడుతుంది.
(అనుగ్రహ భాషణాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List