

17.11.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఈ రోజు నెల్లూరు నించి సుకన్యగారు సేకరించి పంపిన బాబా చూపించిన అద్భుతమైన లీలను మనమందరమూ పంచుకుందాము.
అగ్నిప్రమాదాన్నించి కాపాడిన బాబా
సింగపూర్ నించి శ్రీమతి విజి మూర్తి గారు పంపిన బాబా లీలను ఆమె మాటలలో
సాయిబాబాయే నాకు, తల్లి, తండ్రీ అన్నీ ఆయనే. నా జీవితం లొ కొన్ని క్లిష్ట పరిస్థితులలో బాబా ఎంతో సహాయం చేసారు. జనవరి 2011 సంవత్సరం లొ నేను సాయి వ్రతము చేసాను. ఒక రోజున మంగళవారమునాడు పూజా గదిలో దీపాలు వెలిగంచడానికి గదిని శుభ్రం చేస్తున్నాను. పూజా గదిలో ఉన్న బాబా విగ్రహం ఒడిలో ఊదీ ఉండటం చూసాను. బాబా విగ్రహం కూర్చుని ఉన్నట్లుగా ఉంటుంది. ఊదీ బాబా కుడి చేతిలో నించి ఆయన కుడితొడమీద పడిఉంది. బహుశా అది అగరువత్తుల బూడిద కావచ్చు అనుకున్నాను. కాని అది బాగా తెల్లగా ఉండి మంచి సువాసనతో ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాబా మాఇంటికి వచ్చారని తలిచాను.
కిందటి వారం నా భర్తకు కడుపులో నెప్పి వచ్చి కిడ్నీ లో రాళ్ళు ఉన్నట్లుగా లక్షణాలు కనిపించాయి. 5 సంవత్సరాల క్రితం ఆయనకి కిడ్నీలో రాళ్ళకి ఆపరేషన్ జరిగింది. మేము ఆస్పత్రికి వెళ్ళి డాక్టరుని కలిసాము. ఆయన మూత్ర పరీక్ష చేయించుకోమన్నారు. ఆ సమయంలో నేను బాబాని ప్రార్థించాను. అప్పుడు డాక్టర్ గారు, " ఇప్పుడేమీ లక్షాణాలు కనపడటంలేదు. అంతా నార్మల్ గానే ఉంది. మందులు ఇస్తాను, వాటిని వాడండి. మరలా నొప్పివస్తే కనక ఎక్స్ రే తీద్దాము" అన్నారు. ప్రతీరోజు నేనాయన కడుపు మీద ఊదీ రాసేదానిని. బాబా దయ వల్ల ఆయనకి ఇప్పుడు నొప్పి లేదు. ఆయనకి కిడ్నీలో రాళ్ళు లేకుండా చూడమని నేను బాబాని ప్రార్థిస్తూ ఉన్నాను.
మాకు వివాహమయి పది సంవత్సరాలయినా సంతానం కలగలేదు. సంతానమివ్వమని నేను బాబాని రోజూ ప్రార్థిస్తూనే ఉన్నాను. కాని ఆయన నా మొఱ ఆలకించటంలేదు. బహుశా నా గత జన్మల కర్మ అనుకుంటున్నాను. జీవితంలో సంపదలు, సౌఖ్యాలు ఉండవచ్చు కాని పిల్లలు లేని జీవితం వ్యర్థం. బాబా వద్ద నేను ప్రతీరోజు ఏడుస్తూ ఉండేదానిని. బాబా నన్ను ఓర్పుతో ఉండమన్నారు. మేము పెద్దవారమయిపోతున్నాము, తగిన సమయం లో మాకు సంతానం కలగాలి. కాని బాబా మమ్మల్ని ఇలా ఎందుకు నిరాశ పరుస్తున్నారో తెలియదు. బాబా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, అలాగే నాకు కూడా ఒక అద్భుతం చేస్తే బాగుండుననిపించింది. బాబాని నేను ధనమివ్వమని కోరటంలేదు. మాకు ఒక సంతానాన్ని ప్రసాదిస్తే చాలు మా జీవితానికి.
బాబా చూపించిన మరొక లీల:
క్రిందటి గురువారమునాడు నేను సాయి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. ఈ బుధవారముతో పారాయణ పూర్తయింది (29.06.2011). నా ప్రార్థనలని స్వీకరించినదానికి గుర్తుగా ఏదైన ఒక సంకేతం చూపమని బాబాని అడిగాను. ఈ వారమంతా నా భర్తకి రాత్రి డ్యూ టీలు. క్రితం రోజు రాత్రి డ్యూ టీకి వెళ్ళి పొద్దున్న పది గంటలకి వచ్చారు. రాత్రి పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందనీ, తాను ప్రాణాలతో బయట పడ్డాననీ చెప్పారు. తను ఒక పెద్ద హొటలులో సెంట్రలైజెడ్ కిచెన్ లో చెఫ్ గా పని చేస్తున్నారు. అక్కడ ప్రతీరోజు 6000 నుంచి 8000 మందికి సరిపడా వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. ఆక్కడ వంటలకు వంట పాత్రలు ఎలాంటివి ఉపయోగిస్తారో, పెద్ద పెద్ద స్టవ్ లు ఎలాంటివి వాడతారో దానిని బట్టి ఊహించుకోండి. అక్కడ చాలా పెద్ద పెద్ద మంటలు చెలరేగాయనీ, తోటివారంతా చేష్టలుడిగి ఎమి చేయడానికీ పాలుపోక అరుస్తూ ఉన్నారనీ చెప్పారు. నాభర్త ఎలాగో మంటలనార్పారు. అదంతా బాబా అనుగ్రహం వల్లనే జరిగింది. సాయి నా ప్రార్థనలని స్వీకరించారనడానికి సంకేతంగా ఈ అద్భుతాన్ని చూపించారు.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment