తిరుగు ప్రయాణంలొ గుఱ్ఱం బండి ఎక్కాము. ఎక్కి కూర్చున్న తరువాత నా మనసులో రెండు ఆలోచనలు కలిగాయి.
1. ఈ రోజు బుధవారం. కొంతమంది నమ్మకం ప్రకారం బుధవారమునాడు బయలుదేరితే తిరిగి రావడం గాని, కలుసుకోవడం గాని జరుగదు అని---
2. నేను కన్నోడ్ కి చేరుకుంటే నేను ప్రతిరోజు సాయిబాబాను పూజిస్తాను…
నా మనసులో మెదిలిన మొదటి ఆలోచన ఎంత త్వరగా ప్రవేశించిందో అంత త్వరగానే మాయమైపోయింది. సమర్ధ సద్గురు సాయినాధుని దృష్టిలో అన్ని రోజులూ మంచివే. రెండవ ఆలోచన నా మనసులో వ్రేళ్లతో మొలకెత్తింది.
సోమవారం మధ్యాహ్నానికి మేము షిరిడీ చేరుకొన్నాము. మొట్టమొదటగా మేము శ్రీ బి.ఎస్.కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కలుసుకున్నాము. ఆయన మాకు వాడాలో ఉండటానికి వసతి కల్పించారు.
ఆ తరువాత మేము పూజా సామాగ్రితో బాబాను దర్శించుకోవడానికి మసీదుకు బయలుదేరాము.
బాబా మవునంగా కూర్చొని ఉన్నారు. బాబా జ్వరంతో బాధ పడుతూ అలసటగా ఉన్నారు. కాని ఆయన సమక్షంలో ఎప్పటిలాగే ఎంతో దివ్యమయిన ప్రశాంతత లభిస్తూనే ఉంది. నేను ఆయన పాదాలకు ప్రణమిల్లాను. నా మనస్సుకి ఎంతో ఆనందం కలిగింది. ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా మమ్మల్ని షిరిడీలో ఉండటానికి అనుమతించారు.
ముందుగా అనుకోలేదు, కాని ఆహ్వానం….
ఆ రోజు సాయంత్రం నేను ముక్తారాంజీ గారిని కలుసుకొన్నాను. ఇంతకు మునుపెన్నడూ మేము కలుసుకుని మాట్లాడుకోనప్పటికీ ఆయన నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. “మీరు ఈ సమయంలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.”
నాకప్పుడు ఆయన అన్న మాటలలోని అర్ధం బోధపడలేదు. తరువాత తొందరలోనే నాకర్ధమయింది. మరుసటిరోజు మంగళవారం. మేము షిరిడీలోనే ఉన్నాము.
ఆసమయంలో బాబాగారి అనారోగ్యం మాహృదయాలను కలచివేస్తూ ఉంది. ఆరోజు రాత్రి ఆయన చావడి ఉత్సవానికి రాలేదు. మా తిరుగు ప్రయాణం గడువు రోజు ముగిసిపోయినా మేము షిరిడీలోనే ఉండిపోయాము.
ఆఖరికి బుధవారం ఉదయం షిరిడి నుండి తొందరగానే బయలుదేరదామనుకున్నాము. మా మేనత్తగారు తొందరగా పూర్తయే వంటకాలు బేసన్ భాత్ గాని, దాషామీ గాని (మహారాష్ట్ర వంటకాలు) తయారు చేస్తోంది. (ఈ వంటకాల వీడియోలు ఇచ్చాను, చూడండి, మహారాష్ట్ర వంటకాలు మనకు తెలియవు కాబట్టి వాటిని నేను కూడా తెలుసుకుని మీకు వివరించాలనే నా ప్రయత్నం. దాషామి రోటీ మసాలా మరియు తీపిది కూడా ఉంది. ఉన్నదున్నట్టు రాస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. త్యాగరాజు)
కాని నేను ఉదయం స్నానం చేసి వస్తూ ఉంటే దారిలో పాలు అమ్మే వ్యక్తి కనిపించాడు.
నేను కొందామనుకున్నదానికంటే చాలా ఎక్కువగానే అతను మాకు పాలు పోసాడు. పాలు ఎక్కువగా వచ్చినందువల్ల మా మేనత్త ముందు అనుకున్న వంటకాల బదులు పాయసం చేద్దామనుకుంది. పాయసంలో సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి బాబాకు సమర్పించింది.
కాస్త పొదుపుగా తయారు చేద్దామనుకున్న వంటకం దివ్యమయిన ప్రసాదంగా మారింది. నిజం చెప్పాలంటే బాబాగారే ఆ మార్పు చేయించారు.
బయలుదేరే ముందుగా సూచనలు, ఆలోచనలు….(తరువాతి సంచికలో)
Dear Readers This Blog is open for all Sai devotees,you can share your experiences,Sai mandir photos,Temple information ,poems on Baba ,in a nutshell you can mail me anything concerning Shirdi Saibaba.Thanks for stopping by and reading Sai leelas and please dont go without giving your valuable suggestions/feedbacks/comments,it really matters alot !! Sathguru Sainath Maharaj Ki Jai
Urgent Prayers Are Required
-
Sairam to all devotees, Thank you so much for all the prayers you all keep
sending for those who requires them the most .I would request to kindly
keep the...